ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లోక్ సభ నియోజకవర్గాలలో రాజంపేట ఒకటి. దశాబ్దాలుగా తాతలు, తండ్రుల కాలం నుండి రాజకీయ వైరం ఉన్న రెండు కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ ఈ సారి ఒకరిని ఒకరు ఢీకొడుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఈసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ రెండు కుటుంబాల్లో ఒకటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డిది కాగా, మరొకటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. ఈ ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు కేంద్రంగా రాజకీయాలు మొదలుపెట్టిన వారే. కిరణ్కుమార్ తండ్రి అమర్నాథ్రెడ్డి నుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా విభేధాలున్నాయి.
రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా వీరికి అస్సలు పడేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమ రాజకీయాల మీద ప్రభావం చూపుతున్నది. పెద్దిరెడ్డితో పాటు ఆయన సోదరుడు, ఆయన కుమారుడు చట్ట సభలకు ఎన్నికై తమ ఉనికిని చాటుకుంటున్నారు.
2014 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్కుమార్రెడ్డి ఆంధ్ర, తెలంగాణ విభజనతో రాజకీయ ఉనికిని కోల్పోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఈ సారి రాజంపేట లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు. నల్లారి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి పీలేరు నుండి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పోటీలో ఉండగా, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా మరోసారి పోటీలో ఉన్నాడు.
రాజంపేట లోక్ సభ పరిధిలో పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబల్లపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 40 ఏళ్లలో 13 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 2014, 2019లో వరసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి మిధున్ రెడ్డి విజయం సాధించాడు. గత 40 ఏళ్లలో ఇక్కడ టీడీపీ ఒకసారి మాత్రమే విజయం సాధించింది.
1999లో టీడీపీ అభ్యర్థి గునిపాటి రామయ్య విజయం సాధించాడు. అందుకే ఈ స్థానం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దగా ఆసక్తి చూపకుండా పొత్తు అవకాశం వస్తే ఇతర పార్టీలకే వదిలేస్తారు. 2014లో బీజేపీ పొత్తు సమయంలో ఇక్కడి నుండి పురంధేశ్వరి పోటీ చేసి మిధున్ రెడ్డి చేతిలో లక్ష 80 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా, 2019లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభ మీద మిధున్ 2.70 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.
రాజంపేటలో మైనారిటీల ఓట్లే కీలకం. వారే ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ తరపున కిరణ్ కుమార్ రెడ్డి ఎంత వరకు నెగ్గుకు రాగలుగుతాడు అన్నది అనుమానమే. పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థులతో కలిసి గట్టి ప్రయత్నమే చేస్తున్నా మైనారిటీలు అధికంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థులు బీజేపీతో కలిసి ప్రచారానికి వెనకడుగు వేస్తున్నారు. మోడీ ఆకర్షణతో విజయం సాధిస్తామని బీజేపీ భావిస్తున్నది. అయితే దశాబ్ద కాలం తర్వాత తిరిగి ఎన్నికల బరిలోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలలో ఓడిపోతే రాజకీయ జీవితం ముగిసినట్లేనని భావిస్తున్నారు.
This post was last modified on April 25, 2024 6:13 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…