దళిత యువకులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట నియోజకవర్గం అభ్య ర్థి తోట త్రిమూర్తులుకు హైకోర్టు షాకిచ్చింది. సుమారు 28 ఏళ్ల కిందటి ఈ కేసులో ఇటీవల తుది తీర్పు వచ్చింది. విశాఖ పట్నంలోని అట్రాసిటీ కేసుల విచారణ కోర్టు.. దీనిలో దోషులుగా తేలిన 9 మందికి 18 నెలల జైలు, రూ.2 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
వీరిలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. అయితే.. ఈ కేసులో తుదితీర్పు వెలువడిన తర్వాత.. త్రిమూర్తులు సహా.. దోషులు అందరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు ను నిలుపుదల చేయాలని కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు.. ఇప్పటికిప్పుడు దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే.. లోతైన విచారణ జరపాలన్న అభ్యర్థనను మాత్రం పరిశీలిస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులుగా ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది. మే 1వ తారీకు వరకు కేసు విచారణను వాయిదా వేసింది. అయితే.. కీలకమైన ఎన్నికల వేళ.. ఈ పరిణామం.. తోట త్రిమూర్తులుకే కాకుండా.. వైసీపీకి కూడా ఇబ్బందిగా మారింది. తోట త్రిమూర్తులు నామినేషన్ కనుక తిరస్కరణకు గురైతే.. మండపేట నుంచి ఎవరిని బరిలో నిలపాలనేది ప్రశ్నగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 24, 2024 5:39 am
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…