దళిత యువకులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట నియోజకవర్గం అభ్య ర్థి తోట త్రిమూర్తులుకు హైకోర్టు షాకిచ్చింది. సుమారు 28 ఏళ్ల కిందటి ఈ కేసులో ఇటీవల తుది తీర్పు వచ్చింది. విశాఖ పట్నంలోని అట్రాసిటీ కేసుల విచారణ కోర్టు.. దీనిలో దోషులుగా తేలిన 9 మందికి 18 నెలల జైలు, రూ.2 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
వీరిలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. అయితే.. ఈ కేసులో తుదితీర్పు వెలువడిన తర్వాత.. త్రిమూర్తులు సహా.. దోషులు అందరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు ను నిలుపుదల చేయాలని కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు.. ఇప్పటికిప్పుడు దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే.. లోతైన విచారణ జరపాలన్న అభ్యర్థనను మాత్రం పరిశీలిస్తామని పేర్కొంది.
ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులుగా ఉన్న వారికి నోటీసులు జారీ చేసింది. మే 1వ తారీకు వరకు కేసు విచారణను వాయిదా వేసింది. అయితే.. కీలకమైన ఎన్నికల వేళ.. ఈ పరిణామం.. తోట త్రిమూర్తులుకే కాకుండా.. వైసీపీకి కూడా ఇబ్బందిగా మారింది. తోట త్రిమూర్తులు నామినేషన్ కనుక తిరస్కరణకు గురైతే.. మండపేట నుంచి ఎవరిని బరిలో నిలపాలనేది ప్రశ్నగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 24, 2024 5:39 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…