Political News

యువ తొలి ఓటు ఎటో?

సార్వ‌త్రిక ఎన్నిక‌ల కార‌ణంగా దేశ‌మంతటా రాజ‌కీయ వేడి రాజుకుంది. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లూ ఉండ‌టంతో ఆ హీట్ మ‌రింత ఎక్కువైంది. ఇక్క‌డ కుర్చీ కాపాడుకోవ‌డం వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏమైనా చేసేందుకూ వెనుకాడ‌టం లేదు.  మ‌రోవైపు ఏపీ భ‌విష్య‌త్ కోసం కూట‌మిగా ఏర్ప‌డిన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ గెలుపు ధీమాతో సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు అధికారంలోకి రావాలో నిర్ణ‌యించ‌డంలో యువత ఓట్లు కీల‌కంగా మారే అవ‌కాశ‌ముంది. ముఖ్యంగా కొత్త‌గా ఓటు పొందిన వాళ్లు ఎటు వైపు మొగ్గు చూపుతార‌న్న‌ది కీల‌కంగా మారింది.

జ‌న‌వ‌రిలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన తుది జాబితా ప్ర‌కారం ఏపీలో 4 కోట్ల 8 ల‌క్ష‌ల ఓట‌ర్లున్నారు. ఓట‌ర్ల జాబితాను ప్ర‌త్యేకంగా స‌వ‌రించిన త‌ర్వాత కొత్త‌గా 22 లక్ష‌ల మంది ఓట‌ర్ల జాబితాలో చేరారు. వీళ్ల‌లో 18, 19 ఏళ్ల ఓట‌ర్లు ఏకంగా 8 ల‌క్ష‌ల మంది ఉన్నారు. కొత్త‌గా ఓటు హ‌క్కు పొందిన ఈ యువ‌కులు తొలిసారి ఓటు వేయాల‌నే ఉత్సాహంతో క‌నిపిస్తున్నారు. మ‌రి ఈ తొలి ఓటు ఎటు ప‌డుతుంద‌న్న‌దే ఆసక్తిక‌రంగా మారింది.

పిఠాపురంలో  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కే త‌మ తొలి ఓటు వేస్తామ‌ని అక్క‌డి యువ‌త చెబుతోంద‌ని తెలిసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా జ‌న‌సేన పోటీ చేసే స్థానాల్లో యువ‌త ఆ పార్టీకే జై కొట్టే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇక మిగతా చోట్ల మాత్రం టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ కూట‌మి అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తునిచ్చే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధి కూట‌మితోనే సాధ్య‌మ‌వుతుంద‌ని యువ‌త న‌మ్ముతున్నార‌ని టాక్‌. ఇది కూట‌మికి క‌లిసొచ్చే అవ‌కాశ‌ముంది. యువ‌త కూట‌మికి అండ‌గా నిలిస్తే అప్పుడు జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో? 

Satya

Recent Posts

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

12 minutes ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

29 minutes ago

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

2 hours ago

స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…

3 hours ago

వంద దేవుళ్ళు కలిసి హిట్ ఇస్తారా

వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…

3 hours ago

టాక్సిక్ చుట్టూ వలయం బిగుస్తోంది

అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…

4 hours ago