సార్వత్రిక ఎన్నికల కారణంగా దేశమంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలూ ఉండటంతో ఆ హీట్ మరింత ఎక్కువైంది. ఇక్కడ కుర్చీ కాపాడుకోవడం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసేందుకూ వెనుకాడటం లేదు. మరోవైపు ఏపీ భవిష్యత్ కోసం కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు ధీమాతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించడంలో యువత ఓట్లు కీలకంగా మారే అవకాశముంది. ముఖ్యంగా కొత్తగా ఓటు పొందిన వాళ్లు ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది కీలకంగా మారింది.
జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా ప్రకారం ఏపీలో 4 కోట్ల 8 లక్షల ఓటర్లున్నారు. ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా సవరించిన తర్వాత కొత్తగా 22 లక్షల మంది ఓటర్ల జాబితాలో చేరారు. వీళ్లలో 18, 19 ఏళ్ల ఓటర్లు ఏకంగా 8 లక్షల మంది ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన ఈ యువకులు తొలిసారి ఓటు వేయాలనే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మరి ఈ తొలి ఓటు ఎటు పడుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కే తమ తొలి ఓటు వేస్తామని అక్కడి యువత చెబుతోందని తెలిసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా జనసేన పోటీ చేసే స్థానాల్లో యువత ఆ పార్టీకే జై కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మిగతా చోట్ల మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతునిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధి కూటమితోనే సాధ్యమవుతుందని యువత నమ్ముతున్నారని టాక్. ఇది కూటమికి కలిసొచ్చే అవకాశముంది. యువత కూటమికి అండగా నిలిస్తే అప్పుడు జగన్కు షాక్ తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
This post was last modified on April 23, 2024 6:21 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…