సార్వత్రిక ఎన్నికల కారణంగా దేశమంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలూ ఉండటంతో ఆ హీట్ మరింత ఎక్కువైంది. ఇక్కడ కుర్చీ కాపాడుకోవడం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసేందుకూ వెనుకాడటం లేదు. మరోవైపు ఏపీ భవిష్యత్ కోసం కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు ధీమాతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించడంలో యువత ఓట్లు కీలకంగా మారే అవకాశముంది. ముఖ్యంగా కొత్తగా ఓటు పొందిన వాళ్లు ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది కీలకంగా మారింది.
జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితా ప్రకారం ఏపీలో 4 కోట్ల 8 లక్షల ఓటర్లున్నారు. ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా సవరించిన తర్వాత కొత్తగా 22 లక్షల మంది ఓటర్ల జాబితాలో చేరారు. వీళ్లలో 18, 19 ఏళ్ల ఓటర్లు ఏకంగా 8 లక్షల మంది ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన ఈ యువకులు తొలిసారి ఓటు వేయాలనే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మరి ఈ తొలి ఓటు ఎటు పడుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కే తమ తొలి ఓటు వేస్తామని అక్కడి యువత చెబుతోందని తెలిసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా జనసేన పోటీ చేసే స్థానాల్లో యువత ఆ పార్టీకే జై కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మిగతా చోట్ల మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతునిచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధి కూటమితోనే సాధ్యమవుతుందని యువత నమ్ముతున్నారని టాక్. ఇది కూటమికి కలిసొచ్చే అవకాశముంది. యువత కూటమికి అండగా నిలిస్తే అప్పుడు జగన్కు షాక్ తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…