Political News

రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా కాపు ఉద్య‌మ నాయ‌కుడు

ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా ఉన్న వైసీపీ, టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి నాయ‌కులు మాట‌ల‌కు ప‌దును పెంచుతున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్న‌వారు స‌వాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు 20 రోజుల ముందుగానే.. రాష్ట్రంలో రాజ‌కీయం కాకెక్కింది. కేక‌పుట్టిస్తోంది. తాజాగా 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు.. పృథ్వీ రాజ్‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, స‌వాళ్లు విసిరారు. అది కూడా.. కాపు ఉద్య‌మనాయ‌కుడు, ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కేంద్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా.. రెడ్డి సేవ‌కుడి గా మారిపోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. కిర్లంపూడిలో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌.. త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు ఎగ్గొడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే.. తాను ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతాన‌ని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ముద్ర‌గ‌డను ఇప్పుడు ప‌ట్టించుకునేవారు.. న‌మ్మేవారు కూడా ఎవ‌రూ లేర‌ని పృథ్వీ వ్యాఖ్యానించారు. మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే వ‌స్తార‌ని చెప్పారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పై పృథ్వీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌నను జ‌గ‌న్ రెడ్డి.. జ‌గ‌న్ రెడ్డి.. అంటారేంటి? ఆయ‌న జ‌గ‌న్ రెడ్డి కాదు.. `జ‌గ‌న్ బ‌ట‌న్ రెడ్డి`.. ఇది నేను చెబుతున్న మాట కాదు.. వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు అని పృథ్వీ స‌టైర్లు వేశారు. అయితే.. దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on April 21, 2024 9:24 pm

Share

Recent Posts

రజిని సినిమాలో విలన్… రాపో పెద్ద రిస్కు?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…

24 minutes ago

శ్రీలీల మిస్సయ్యింది మమిత సాధించింది

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…

40 minutes ago

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

3 hours ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

3 hours ago

వెంకీ త్రివిక్రమ్… ఇంకా ఆ ఒక్క కిక్ రాలేదే!

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…

4 hours ago

20 గంటలు పని… 4 గంటలు రెస్ట్?

తమిళ సినిమాలో అగ్ర నటుడిగా వెలుగొందిన నటుడు విజయ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. స్వర్గ సుఖాల జీవితం నుంచి…

4 hours ago