Political News

రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా కాపు ఉద్య‌మ నాయ‌కుడు

ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా ఉన్న వైసీపీ, టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి నాయ‌కులు మాట‌ల‌కు ప‌దును పెంచుతున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్న‌వారు స‌వాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు 20 రోజుల ముందుగానే.. రాష్ట్రంలో రాజ‌కీయం కాకెక్కింది. కేక‌పుట్టిస్తోంది. తాజాగా 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు.. పృథ్వీ రాజ్‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, స‌వాళ్లు విసిరారు. అది కూడా.. కాపు ఉద్య‌మనాయ‌కుడు, ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కేంద్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా.. రెడ్డి సేవ‌కుడి గా మారిపోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. కిర్లంపూడిలో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌.. త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు ఎగ్గొడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే.. తాను ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతాన‌ని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ముద్ర‌గ‌డను ఇప్పుడు ప‌ట్టించుకునేవారు.. న‌మ్మేవారు కూడా ఎవ‌రూ లేర‌ని పృథ్వీ వ్యాఖ్యానించారు. మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే వ‌స్తార‌ని చెప్పారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పై పృథ్వీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌నను జ‌గ‌న్ రెడ్డి.. జ‌గ‌న్ రెడ్డి.. అంటారేంటి? ఆయ‌న జ‌గ‌న్ రెడ్డి కాదు.. `జ‌గ‌న్ బ‌ట‌న్ రెడ్డి`.. ఇది నేను చెబుతున్న మాట కాదు.. వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు అని పృథ్వీ స‌టైర్లు వేశారు. అయితే.. దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on April 21, 2024 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

1 hour ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

4 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

5 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

6 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

7 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

8 hours ago