Political News

రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా కాపు ఉద్య‌మ నాయ‌కుడు

ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా ఉన్న వైసీపీ, టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి నాయ‌కులు మాట‌ల‌కు ప‌దును పెంచుతున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్న‌వారు స‌వాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు 20 రోజుల ముందుగానే.. రాష్ట్రంలో రాజ‌కీయం కాకెక్కింది. కేక‌పుట్టిస్తోంది. తాజాగా 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు.. పృథ్వీ రాజ్‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, స‌వాళ్లు విసిరారు. అది కూడా.. కాపు ఉద్య‌మనాయ‌కుడు, ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కేంద్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాపు ఉద్య‌మ నాయ‌కుడిగా ప్ర‌స్థానం ప్రారంభించిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. ఇప్పుడు రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా.. రెడ్డి సేవ‌కుడి గా మారిపోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. కిర్లంపూడిలో కూర్చుని క‌బుర్లు చెబుతున్న ముద్ర‌గ‌డ‌.. త‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు, రైస్ మిల్లుల‌కు ఉన్న విద్యుత్ బ‌కాయిలు ఎంతో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు ఎగ్గొడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఉత్త‌రాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మూడు సీట్లు కూడా గెలిచే ప‌రిస్థితి లేద‌న్నారు. ఒక‌వేళ మూడు సీట్లు వైసీపీ గెలిస్తే.. తాను ముద్ర‌గ‌డ ఇంట్లో అంట్లు తోముతాన‌ని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ముద్ర‌గ‌డను ఇప్పుడు ప‌ట్టించుకునేవారు.. న‌మ్మేవారు కూడా ఎవ‌రూ లేర‌ని పృథ్వీ వ్యాఖ్యానించారు. మెగా కుటుంబంలో చిరంజీవి, రామ్‌చరణ్ స‌హా ప‌లువురు కూటమికి మద్దతుగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే వ‌స్తార‌ని చెప్పారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పై పృథ్వీ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌నను జ‌గ‌న్ రెడ్డి.. జ‌గ‌న్ రెడ్డి.. అంటారేంటి? ఆయ‌న జ‌గ‌న్ రెడ్డి కాదు.. `జ‌గ‌న్ బ‌ట‌న్ రెడ్డి`.. ఇది నేను చెబుతున్న మాట కాదు.. వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు అని పృథ్వీ స‌టైర్లు వేశారు. అయితే.. దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on April 21, 2024 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

30 ఏళ్ళ సినిమాని కాపీ కొట్టడం గ్రేట్

తాజాగా రిలీజైన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంకు తెలుగులో ఎలాంటి స్పందన వస్తోందో చూస్తున్నాం. సాధారణంగా విజయ్ సినిమాలకు…

2 hours ago

సీఈవో బాబు: తాను చేస్తూ.. త‌న వారితో చేయిస్తూ

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి సీఈవో అవ‌తారం ఎత్తారు. తానుప‌నిచేస్తూ.. త‌న వారితో ప‌నిచేయిస్తూ.. ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నారు. సాధార‌ణంగా య‌జ‌మాని…

2 hours ago

లండ‌న్ ప్ర‌యాణానికి జ‌గ‌న్ ఓకే.. కానీ, బ్రేక్ ప‌డింది!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. విదేశాల‌కు వెళ్లాల‌ని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక‌వైపు… రాష్ట్రంలో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించి..…

3 hours ago

సరిపోదా శనివారం….ఇంకో అవకాశం

వంద కోట్ల వైపు వేగంగా పరుగులు పెడుతున్న సరిపోదా శనివారంకు రెండో వీకెండ్ రూపంలో ఇంకో పెద్ద అవకాశం దొరికింది,.…

3 hours ago

ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు.. వెతుకుతున్న పోలీసులు

అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్…

4 hours ago

తెలుగు చిత్రసీమకు సరిలేరు వేరెవ్వరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వరదలు ముంచెత్తడం యావత్ తెలుగు ప్రజల హృదయాలను కదిలించింది. ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి విలయానికి వేలల్లో…

5 hours ago