దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మూడో దశ ఎన్నికల నామినేషన్ పర్వానికి గురువారం శ్రీకారం చుట్టనున్నా రు. ఈ క్రమంలో ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు కూడా నోటిఫికేషన్ రానుంది. ఇక, గురువారం నుంచి ఈ నెల 25 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న పరిశీలించి.. నిర్ధారించనున్నారు. ఇక, నామినేషన్లు వేసిన వారు.. ఉపసంహరించుకునేందుకు ఈ నెల 29 వ తేదీ వరకు అవకాశం ఉంది. అయితే.. ఈ క్రతువు ఎలా ఉన్నప్పటికీ.. ఒక్క జనసేన మినహా ఇతర పార్టీల్లో మాత్రం అభ్యర్థులు చాలా మంది వణుకుతున్నారు.
వైసీపీ, బీజేపీ, టీడీపీలలో అభ్యర్థుల ఎంపిక అయితే.. పూర్తయింది. కానీ, అభ్యర్థుల ఎంపిక తర్వాత.. ఆయా పార్టీలు క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వేలు.. అసంతృప్తుల నుంచి వచ్చిన ఇబ్బందులు.. ఆరోపణలు, నిరసనల నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను కొనసాగిస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అదేసమయంలో తాము ముందుగానే ప్రకటించిన స్థానాల్లో ప్రత్యర్థులు బలమైన నాయకులను నిలబెట్టడం కూడా.. పార్టీలను ఆలోచనలో పడేసింది. ఇలా.. పార్లమెంటు స్థానాల్లో టీడీపీకి 2 నుంచి 3, వైసీపీకి 2 నుంచి 3,. బీజేపీ 2 స్థానాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది.
అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ 5 చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. ఇక, టీడీపీ ఐదు చోట్ల పరిశీలన చేస్తోంది. బీజేపీ కూడా.. మూడు స్థానాల్లో మార్పులకు ఖాయమని చెబుతోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభమైనా.. బీఫాం దక్కే వరకు కూడా నాయకులకు కంటిపై నిద్ర లేకుండా పోతోంది. ముఖ్యంగా వైసీపీ రెబల్ ఎంపీ, ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురామకృష్ణం రాజుకు ఇప్పటి వరకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు. విజయవాడలో కేశినేని చిన్నిని విజయవాడ పశ్చిమకు పంపించి.. అక్కడ నుంచి బీజేపీ క్యాండిడేట్గా ఉన్న సుజనాను విజయవాడ ఎంపీగా తీసుకువస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఇక, అనకాపల్లిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడును మార్చుతారని పక్కాగా తెలుస్తోంది. నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ స్థానం కూడా కదిలిపోతుందనే చర్చ సాగుతోంది. ఎలా చూసుకున్నా.. చాలా చోట్ల అభ్యర్థులకు బీఫాం దక్కేవరకు గ్యారెంటీ లేక పోవడం గమనార్హం. ఇక, ఈ సమస్య జనసేనలో లేకుండా పోయింది. బుధవారమే ఈ పార్టీ 21 మంది అసెంబ్లీ అభ్యర్థులకు , ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చేసింది.
This post was last modified on April 18, 2024 11:49 am
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. తన సినిమాల ఫలితాలను చూస్తే.. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదనిపిస్తుంది.…
మాస్ రాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘షాక్’ ఆ ఇద్దరికీ పెద్ద…
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న సినిమాతో కెరీర్ను మొదలుపెట్టి.. ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది రష్మిక…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…