Political News

‘నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు’

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు ఉంది క‌దా.. అని ఇష్టం వ‌చ్చిన ట్టు మాట్లాడ‌ద్దంటూ.. గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. తాను మాట్లాడ‌డం మొద‌లు పెడితే.. చాలా ఇబ్బంది ప‌డ‌తావ్! అంటూ వ్యాఖ్యానిం చారు. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని మ‌చీలీప‌ట్నంలో టీడీపీ-జ‌న‌సేన సంయుక్తంగా నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ.. ఆసాంతం నిప్పులు చెరిగారు. తాను భీమవ‌రం నుంచి పిఠాపురానికి నియోజ‌క‌వ‌ర్గం మార్చుకుంటే.. సీఎం జ‌గ‌న్‌కు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న 70 మంది ఎమ్మెల్యేల‌ను ఎందుకు మార్చాడో స‌మాధానం చెప్పాల‌న్నారు.

త‌న కుటుంబంపైనా..త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌పైనా నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడ‌ని.. తాను కూడా మాట్లాడాల్సి ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చ‌రించారు. “క్లాస్ వార్‌-మాస్‌వార్ అంటున్నాడు(జ‌గ‌న్‌).. ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డ‌మే క్లాస్ వార్. ఇది మేం చేయ‌లేదు. నువ్వే చేశావు. ఐదేళ్లు అన్ని విధాలా ప్ర‌జ‌ల‌ను దోచేసి.. ఇప్పుడు క‌బుర్లు చెబుతున్నాడు” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అధికారం చేప‌డుతూనే ప్ర‌జావేదిక కూల్చేయ‌లేదా? అని ప్ర‌శ్నించారు.

పోలీసుల‌కు వీక్లీఆఫ్‌ల ఎర చూపి.. వారిని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని చివ‌ర‌కు మోసం చేశాడ‌ని అన్నారు. మ‌త్స్యకారుల‌ను మోసం చేసేందుకు జీవో 217 తీసుకువ‌చ్చాడ‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇసుక‌ను దోచుకుని.. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌ను అడ్డంగా ముంచేశాడ‌న్నారు. వారు దాచుకున్న డ‌బ్బులు కూడా ఇవ్వ‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఆయ‌న నోరు డ్రైనేజీ!

ప‌వ‌న్ త‌న ప్ర‌సంగంలో మంత్రి, పెడ‌న ఎమ్మెల్యే(ప్ర‌స్తుతం పెన‌మ‌లూరు నుంచి పోటీ చేస్తున్నారు) జోగి ర‌మేష్‌పై పేరు ఎత్త‌కుండానే.. విరుచుకుప‌డ్డారు. “ఇక్క‌డి ఎమ్మెల్యే దోపిడీ దారుడ‌ని అంద‌రూ చెబుతున్నారు. ఆయ‌న నోరు విప్పితే.. బూతులు.. ఇంటి ముందు డ్రైనేజీ బాగు చేయ‌డం చేత‌కాదు.. ఈయ‌న‌కు మంత్రి ప‌ద‌వి. ఆ య‌న నోరే పెద్ద డ్రైనేజీ. అందిన‌కాడికి అంద‌రి నుంచి దోచేశాడు. రైతులు, చిన్న చిన్న‌వ్యాపారుల నుంచి దండుకున్నాడు. వీళ్లు మాకునీతులు చెబుతున్నారు” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఇక్క‌డ అభివృద్ధిని ప్ర‌శ్నించిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై గంజాయి కేసులు పెట్టించార‌ని అన్నారు. అయినా.. త‌మ సైనికులు వెర‌వ‌కుండా ముందుకు సాగార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

This post was last modified on April 18, 2024 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

7 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

8 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago