Political News

కేసీఆర్ : క్షుద్రపూజల కలకలం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపుతున్నది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రగతి భవన్ ఖాళీ చేసి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయిన కేసీఆర్ దురదృష్టవశాత్తు బాత్రూంలో జారిపడడంతో తుంటి ఎముకకు ఆపరేషన్ చేశారు. అనంతరం కొన్నాళ్లు హైదరాబాద్ లోని నంది నగర్ లో విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ తిరిగి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పోయారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు బీఆర్ఎస్ ను వీడి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరిపోతున్నారు. కూతురు కవితను మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మరోసారి పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో క్షుద్రపూజల వ్యవహారం ఉత్కంఠ రేపుతున్నది.

నందినగర్ లోని కేసీఆర్ నివాసం సమీపంలో ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ ఎవరో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. నిమ్మకాయలు, ఓ బొమ్మ, మిరపకాయలు, నల్లకోడి ఈకలు, కోడిగుడ్డు, కుంకుమ కనిపించడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు కేసీఆర్ ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పూజలు ఎవరు చేశారు ? కేసీఆర్ మీదనే కేసీఆర్ ను ఉద్దేశించే ఈ పూజలు చేశారా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

This post was last modified on April 16, 2024 6:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా సూర్యా

నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…

8 minutes ago

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

1 hour ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

3 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

4 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

6 hours ago