ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం మూడు రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూనే కోడి కత్తి లాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చి సీఎంపై రాయి దాడి విషయంలో సందేహాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. మరోవైపు వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఎంత చేయాలో అంతా చేస్తోంది. పేదవాళ్ల కోసం పోరాడుతున్న జగన్ మీద పెత్తందారుల దాడి అంటూ హెడ్డింగ్స్ పెట్టి ఆయనకు ఎలివేషన్ ఇస్తున్నారు అనుకూల మీడియా, సోషల్ మీడియా జనాలు.
ఐతే జగన్ మీద రాయి దాడి స్టంట్ కాదు నిజం అనుకుందామన్నా, ఇంతకీ ఈ విషయంలో భద్రతా వైఫల్యం మాటేంటి.. రాయి ఎవరు విసిరారో పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
కాగా ఇప్పుడు ఈ కేసులో పురోగతి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు రాయి దాడి విషయంలో అయిదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారట. అందులో సతీష్ అనే కుర్రాడు కూడా ఉన్నాడని.. అతనే సీఎం మీదికి రాయి విసిరాడని అంటున్నారు.
ఐతే రాయి విసరడానికి కారణం గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర రూమర్ తిరుగుతోంది. సీఎం రోడ్ షోకు హాజరైతే క్వార్టర్ మందు, రూ.350 డబ్బులు ఇస్తారని పిలిచారని.. ఐతే అక్కడికి వచ్చాక మందు సీసా మాత్రమే ఇచ్చారని.. డబ్బులు ఇవ్వలేదని ఈ కోపంతోనే సీఎం మీదికి రాయి విసిరానని సదరు యువకుడు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ఓ వార్త తిరుగుతోంది. ఇది నిజమా కాదా అన్నది పోలీసులు అధికారిక ప్రకటన చేసే వరకు తెలియదు. ఇదే నిజమైతే మాత్రం ప్రతిపక్షాలు కుట్ర పూరితంగా రాళ్ల దాడి చేయించారని ఆరోపిస్తున్న వైసీపీకి గతుక్కుమన్నట్లే.
This post was last modified on April 16, 2024 6:23 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…