Political News

జగన్‌పై రాయి కేసులో ట్విస్ట్


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం మూడు రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూనే కోడి కత్తి లాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చి సీఎంపై రాయి దాడి విషయంలో సందేహాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. మరోవైపు వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఎంత చేయాలో అంతా చేస్తోంది. పేదవాళ్ల కోసం పోరాడుతున్న జగన్ మీద పెత్తందారుల దాడి అంటూ హెడ్డింగ్స్ పెట్టి ఆయనకు ఎలివేషన్ ఇస్తున్నారు అనుకూల మీడియా, సోషల్ మీడియా జనాలు.

ఐతే జగన్ మీద రాయి దాడి స్టంట్ కాదు నిజం అనుకుందామన్నా, ఇంతకీ ఈ విషయంలో భద్రతా వైఫల్యం మాటేంటి.. రాయి ఎవరు విసిరారో పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.

కాగా ఇప్పుడు ఈ కేసులో పురోగతి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు రాయి దాడి విషయంలో అయిదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారట. అందులో సతీష్ అనే కుర్రాడు కూడా ఉన్నాడని.. అతనే సీఎం మీదికి రాయి విసిరాడని అంటున్నారు.

ఐతే రాయి విసరడానికి కారణం గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర రూమర్ తిరుగుతోంది. సీఎం రోడ్ షోకు హాజరైతే క్వార్టర్ మందు, రూ.350 డబ్బులు ఇస్తారని పిలిచారని.. ఐతే అక్కడికి వచ్చాక మందు సీసా మాత్రమే ఇచ్చారని.. డబ్బులు ఇవ్వలేదని ఈ కోపంతోనే సీఎం మీదికి రాయి విసిరానని సదరు యువకుడు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ఓ వార్త తిరుగుతోంది. ఇది నిజమా కాదా అన్నది పోలీసులు అధికారిక ప్రకటన చేసే వరకు తెలియదు. ఇదే నిజమైతే మాత్రం ప్రతిపక్షాలు కుట్ర పూరితంగా రాళ్ల దాడి చేయించారని ఆరోపిస్తున్న వైసీపీకి గతుక్కుమన్నట్లే.

This post was last modified on April 16, 2024 6:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago