Political News

శిరోముండ‌నం కేసులో వైసీపీ నేత తోట‌కు ఏడాదిన్న‌ర జైలు!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో 1996లోజ‌రిగిన ద‌ళిత యువ‌కులపై దాడి. .. ఇద్ద‌రి శిరోముండ‌నం కేసులో విశాఖ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్ర‌త్యేక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మొత్తం 9 మంది నిందుతుల‌ను దోషులుగా తేల్చిన కోర్టు.. వీరికి ఏడాదిన్న‌ర‌(18 నెల‌లు) క‌ఠిన కారాగారంతోపాటు.. రెండు ల‌క్షల రూపాయ‌ల భారీ జ‌రిమానా కూడా విధించింది. వీరిలో వైసీపీ మండ‌పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు.

ఏం జ‌రిగింది?

1996, డిసెంబ‌రు 29న తూర్పుగోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం మండ‌లం, వెంక‌టాయ పాలెంలో అప్ప‌ట్లో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు యువ‌కులు.. ఆందోళ‌న చేశారు. దీనిని తీవ్రంగా భావించిన తోట త్రిమూర్తులు.. ఆదేశాల‌తో ఆయ‌న వ‌ర్గం కార్య‌కర్త‌లు ఎస్సీ యువ‌త‌ను నిర్బంధించి.. తీవ్రంగా హింసించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. వీరిని త‌ర్వాత‌.. పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించి.. అక్క‌డే ఇద్ద‌రికి శిరోముండ‌నం చేయ‌డం అప్ప‌ట్లోరాష్ట్ర వ్యాప్తంగా అగ్గి రేపింది.

ఈ కేసులో పోలీసుల ప్ర‌మేయం కూడా ఉంద‌ని తేల‌డంతో దీనిని తీవ్రంగా భావించిన ప్ర‌భుత్వం.. అట్రా సిటీ కేసు న‌మోదు చేయించింది. ఇక‌, అప్ప‌టి నుంచి విచార‌ణ సాగుతూనే ఉంది. 28ఏళ్ల సుదీర్ఘ విచార‌ణ‌లో 2019 వ‌ర‌కు ఈ కేసు ఒక అడుగు ముందుకు.. ప‌ది అడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా సాగింది. ఈ కేసులో న్యాయం చేయాలంటూ.. కొన్ని ద‌ఫాలుగా ఎస్సీ సామాజిక వ‌ర్గాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న కూడా చేశాయి. దీనిపై 146 సార్లు కోర్టులో వాయిదాలు కూడా ప‌డ్డాయి.

ఎట్ట‌కేల‌కు వైసీపీ ప్ర‌భుత్వం జోక్యంతో స్థిర‌మైన విచార‌ణ ముందుకు సాగింది. 2019 నుంచిఎలాంటి విఘ్నాలు లేకుండానే కేసు విచార‌ణ ప‌రుగులు పెట్టింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ కేసుల కోర్టు దీనిపై సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో అప్ప‌టి టీడీపీ నాయ‌కుడు ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న తోట త్రిమూర్తులు చుట్టూనే ఆరోప‌ణ‌లు ఎగిసి ప‌డ్డాయి. తాజాగా.. 10 మంది నిందితుల్లో 9 మందిని కోర్టు దోషులుగా తేల్చి చెప్పింది. వీరికి ఏడాదిన్న‌ర జైలు శిక్ష‌తోపాటు.. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా విదించింది. అయితే.. దీనిని హైకోర్టులో స‌వాల్ చేసుకునే అవ‌కాశం ఉంది.

This post was last modified on April 16, 2024 2:10 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

17 minutes ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

23 minutes ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

2 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

2 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

2 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

8 hours ago