Political News

శిరోముండ‌నం కేసులో వైసీపీ నేత తోట‌కు ఏడాదిన్న‌ర జైలు!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో 1996లోజ‌రిగిన ద‌ళిత యువ‌కులపై దాడి. .. ఇద్ద‌రి శిరోముండ‌నం కేసులో విశాఖ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్ర‌త్యేక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మొత్తం 9 మంది నిందుతుల‌ను దోషులుగా తేల్చిన కోర్టు.. వీరికి ఏడాదిన్న‌ర‌(18 నెల‌లు) క‌ఠిన కారాగారంతోపాటు.. రెండు ల‌క్షల రూపాయ‌ల భారీ జ‌రిమానా కూడా విధించింది. వీరిలో వైసీపీ మండ‌పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు.

ఏం జ‌రిగింది?

1996, డిసెంబ‌రు 29న తూర్పుగోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం మండ‌లం, వెంక‌టాయ పాలెంలో అప్ప‌ట్లో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు యువ‌కులు.. ఆందోళ‌న చేశారు. దీనిని తీవ్రంగా భావించిన తోట త్రిమూర్తులు.. ఆదేశాల‌తో ఆయ‌న వ‌ర్గం కార్య‌కర్త‌లు ఎస్సీ యువ‌త‌ను నిర్బంధించి.. తీవ్రంగా హింసించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. వీరిని త‌ర్వాత‌.. పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించి.. అక్క‌డే ఇద్ద‌రికి శిరోముండ‌నం చేయ‌డం అప్ప‌ట్లోరాష్ట్ర వ్యాప్తంగా అగ్గి రేపింది.

ఈ కేసులో పోలీసుల ప్ర‌మేయం కూడా ఉంద‌ని తేల‌డంతో దీనిని తీవ్రంగా భావించిన ప్ర‌భుత్వం.. అట్రా సిటీ కేసు న‌మోదు చేయించింది. ఇక‌, అప్ప‌టి నుంచి విచార‌ణ సాగుతూనే ఉంది. 28ఏళ్ల సుదీర్ఘ విచార‌ణ‌లో 2019 వ‌ర‌కు ఈ కేసు ఒక అడుగు ముందుకు.. ప‌ది అడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా సాగింది. ఈ కేసులో న్యాయం చేయాలంటూ.. కొన్ని ద‌ఫాలుగా ఎస్సీ సామాజిక వ‌ర్గాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న కూడా చేశాయి. దీనిపై 146 సార్లు కోర్టులో వాయిదాలు కూడా ప‌డ్డాయి.

ఎట్ట‌కేల‌కు వైసీపీ ప్ర‌భుత్వం జోక్యంతో స్థిర‌మైన విచార‌ణ ముందుకు సాగింది. 2019 నుంచిఎలాంటి విఘ్నాలు లేకుండానే కేసు విచార‌ణ ప‌రుగులు పెట్టింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ కేసుల కోర్టు దీనిపై సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో అప్ప‌టి టీడీపీ నాయ‌కుడు ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న తోట త్రిమూర్తులు చుట్టూనే ఆరోప‌ణ‌లు ఎగిసి ప‌డ్డాయి. తాజాగా.. 10 మంది నిందితుల్లో 9 మందిని కోర్టు దోషులుగా తేల్చి చెప్పింది. వీరికి ఏడాదిన్న‌ర జైలు శిక్ష‌తోపాటు.. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా విదించింది. అయితే.. దీనిని హైకోర్టులో స‌వాల్ చేసుకునే అవ‌కాశం ఉంది.

Satya

Recent Posts

ర‌జినీ సినిమాలో రాశి… ఏం చేస్తుంద‌బ్బా?

కొన్నేళ్ల ముందు వ‌ర‌కు తెలుగులో రాశి ఖ‌న్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియ‌ర్ ఎన్టీఆర్ సహా ప‌లువురు స్టార్…

1 hour ago

సూటిగా చెప్పిన సమాధానాల్లో సునీత గారి పాఠాలు

గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…

2 hours ago

కేంద్ర మంత్రివ‌ర్గంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు?

కేంద్ర మంత్రివ‌ర్గం ప్ర‌క్షాళ‌న దాదాపు ఖ‌రారైన నేప‌థ్యంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఎంపీల‌కు మంత్రి యోగం ప‌ట్ట‌నుంద‌ని టీడీపీ…

3 hours ago

వారణాసి సెట్… 7 గంటలకు షూటింగ్ అంటే

కెరీర్లో ఒక ద‌శ వ‌ర‌కు మామూలు మాస్ మ‌సాలా సినిమాలే తీశాడు రాజ‌మౌళి. మ‌గ‌ధీర నుంచి ఆయ‌నలోని మ‌రో కోణం…

5 hours ago

సైలెంటుగా పరుగులు పెడుతున్న బంగారం

సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…

8 hours ago

దీదీ వర్సెస్ రీతబ్రత… అసలైన తృణమూల్ ఎవరిది?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…

10 hours ago