Political News

ఏపీలో బీజేపీ సేఫ్ గేమ్

దక్షిణాదిన కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాలలో పెద్దగా ప్రభావం చూపలేని భారతీయ జనతా పార్టీ ఈ లోక్ సభ ఎన్నికలలో ప్రధానంగా తెలంగాణ మీద దృష్టిపెట్టింది. 2019 ఎన్నికల తర్వాత గత ఐదేళ్లుగా తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలు ఉప ఎన్నికలతో పాటు, ఇటీవల శాసనసభ ఎన్నికల వరకు మోడీ, అమిత్ షా తో పాటు అనేక మంది కేంద్ర మంత్రులను శాసనసభ స్థానాలకు ఇంఛార్జులుగా నియమించి ప్రచారానికి రావడం బీజేపీ ఫోకస్ ను స్పష్టం చేస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రచారానికి రావడం ప్రస్తావనార్హం.

రామమందిరం ఉత్తరాదిన మెజారిటీ స్థానాలు కట్టబెడుతుందని బీజేపీ అధిష్టానం బయటకు చెబుతున్నా అంతర్గతంగా వారికి అపనమ్మకం ఉండడం మూలంగా దక్షిణాదిన గణనీయంగా లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కర్ణాటకలో పాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడం, జేడీఎస్ పొత్తు మూలంగా అక్కడ బీజేపీ ఖచ్చితంగా లాభపడుతుందని భావిస్తున్నారు. ఇక తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళి సైని రాజీనామా చేయించి చెన్నై నుండి బరిలోకి దింపడం బీజేపీ పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక తెలంగాణలో ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతున్న ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ఆఖరు నిమిషం వరకు ప్రశ్నార్ధకమే. ఫలానా స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పే పరిస్థితి బీజేపీకి లేదు.

కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు మీద ఇంత దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి ఇక్కడ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలను కేటాయించారు. పొత్తు కుదిరిన తర్వాత ప్రధాని నరేంద్రమోడి లాంఛనప్రాయంగా చిలుకలూరిపేట సభకు వచ్చిపోయారు. ఆ తర్వాత నెల రోజులు గడుస్తున్నా అటు వైపు బీజేపీ అధిష్టానం గానీ, ఏపీలో ఉన్న సీనియర్ బీజేపీ నేతలు గానీ కన్నెత్తి చూడడం లేదు.

ఇక ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులలో బీజేపీయేతరులు, టీడీపీ నుండి వచ్చి బీజేపీ తరపున పోటీ చేస్తున్న వారు ఉండడం గమనార్హం. 2014 ఎన్నికలలో పవన్ మద్దతు, బీజేపీ పొత్తు మూలంగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని దక్కించుకున్నాడు. 2019లో ఒంటరిగా బరిలోకి దిగడంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ వెంటపడి మరీ టీడీపీ పొత్తు పెట్టుకున్నది. ఇక 2019 ఎన్నికల తర్వాత గత ఐదేళ్లుగా జగన్ మోడీ ప్రభుత్వానికి అనేక అంశాలలో మద్దతుగా నిలుస్తున్నాడు. అందుకే ఆంధ్రాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుండి ఎవరు గెలిచినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు గెలిచినా కేంద్రంలో బీజేపీకే మద్దతు ఇస్తారు. అందుకే ఆంధ్రా రాజకీయాలలో తలదూర్చకుండా బీజేపీ అధిష్టానం సేఫ్ గేమ్ ఆడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

40 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

43 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

1 hour ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago