ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ దాడి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైరికల్ గా ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ఆ రాయి తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చిందని…జగన్ కొత్తగా ఏదైనా ట్రై చేయాలని లోకేష్ చేసిన ట్వీట్ ట్రెండ్ అవుతోంది. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి మాదిరిగా 2024 ఎన్నికలకు ముందు జగన్ తనపై తానే దాడి చేయించుకున్నారని లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ దాడి ఘటనపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా దాడి జరుగుతుందని ఓ వైసీపీ కార్యకర్త చేసిన ట్వీట్ ను అయ్యన్న రీ ట్వీట్ చేస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. మరో 4 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికల మూడ్ మార్చేసే ఘటన జరగబోతోందని మార్కెటింగ్ కన్సల్టెంట్, వైసీపీ కార్యకర్త అవుతు శ్రీధర్రెడ్డి చేసిన ట్వీట్ పై అయ్యన్న స్పందించారు. ఏప్రిల్ 12న శ్రీధర్ రెడ్డి చేసిన పోస్ట్ ను అయ్యన్న షేర్ చేశారు. ఈ దాడి గురించి శ్రీధర్ రెడ్డికి ముందే తెలిసి ఉండవచ్చన్న అనుమానాన్ని అయ్యన్న వ్యక్తం చేశారు.
ఎందుకంటే, శ్రీధర్ రెడ్డి ఈ తరహాలో ట్వీట్ చేయడం ఇది తొలిసారి కాదు. హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసులో ప్రధాన నిందితుడు, జగన్ కు సన్నిహితుడు అయిన శ్రీధర్ రెడ్డి చంద్రబాబు అరెస్టుకు ముందే సంచలనం జరగబోతుందని ట్వీట్ చేశాడని అయ్యన్న అన్నారు. ఇప్పుడు కూడా అలాంటిదే చేశాడని, దీని వెనక మర్మం ఏమిటో సీబీఐ తేల్చాలని అయ్యన్న డిమాండ్ చేశారు. అయితే, ఈ పోస్టుపై ఏపీ డీజీపీ సమగ్ర విచారణ జరిపించాలని శ్రీధర్ రెడ్డి కోరడం విశేషం.
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…