Political News

ఆ ప‌ది రోజుల‌ు కూట‌మికి మోస్ట్ ఇంపార్టెంట్‌!

కూట‌మి పార్టీల ప్ర‌చారం విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జన‌సేన‌-టీడీపీ-బీజేపీ సంయుక్తంగా ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఉభ‌య గోదావ‌రిజిల్లాల్లో చేప‌ట్టిన ప్ర‌జాగ‌ళం.. ఉమ్మ‌డి స‌భ‌ల‌కు భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ ఊపును రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో భేటీ అయిన‌.. మూడు పార్టీల నాయ‌కులు.. ప్ర‌ధానంగా ప్ర‌చారంపైనే దృష్టి పెట్టారు.

ఈ నెల మిగిలిన 15 రోజులు ఎవ‌రికివారుగా ప్ర‌చారం చేయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించే అవ‌కా శం లేక‌పోయినా.. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా ప్ర‌చారం చేసుకునేలా ప్లాన్ సిద్ధం చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. మే 1న పింఛ‌న్ల పంపిణీపై స‌ర్కారుపై ఒత్తిడి తీసుకువ‌చ్చి.. ఈ ద‌ఫా ఎలాంటి ఇబ్బందులూ రాకుండా.. ల‌బ్ధి దారుల‌కు ఇళ్ల వ‌ద్దే పింఛ‌న్ల‌ను పంపిణీ చేయించాల‌ని.. దీనిపై ముందుగానే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ‌లు రాయాల‌ని కూడా తీర్మానం చేశారు.

ఇక‌, మే 2వ తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు మాత్రం.. మూడు పార్టీలు ఉమ్మ‌డిగానే స‌భ‌లు, స‌మావేశాలు.. రోడ్‌షోలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యంలో ఎలాంటి మార్పూ ఉండ‌బోద‌ని కూడా పేర్కొన్నారు. కేంద్రం నుంచి వ‌చ్చే ప్ర‌ధాన మంత్రి మోడీ, అమిత్ షా వంటివారి స‌భ‌లకు కూడా మూడు పార్టీల నాయ‌కులు హాజ‌రు కావాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా.. రాష్ట్రంలో బూమ్ తీసుకురావ‌డం ద్వారా.. ఎన్నిక‌ల వ్యూహాన్ని బ‌లోపేతం చేసేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని మూడు పార్టీలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి.

ఆ ప‌ది రోజుల పాటు ఉమ్మ‌డిప్ర‌చారం అత్యంత కీల‌క‌మ‌ని.. ఎన్నిక‌ల స్ట్రాట‌జీని మార్చేది.. ఆ ప‌ది రోజులే న‌ని నాయ‌కులు ప్ర‌త్యేకంగా భావిస్తున్నారు. దీంతో చివ‌రి ప‌దిరోజులు అంద‌రూ అందుబాటులో ఉండ‌డంతోపాటు.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో ఎండ‌ల తీవ్ర‌త కూడా ఎక్కువగా ఉన్న నేప‌థ్యంలోఉద‌యం పూట‌.. ఆన్‌లైన్ ప్ర‌చారం.. సాయం త్రం 3 గంట‌ల నుంచిఉమ్మ‌డి ప్రచారం చేసుకునేలా ప్లాన్ చేశారు. మొత్తంగా వ‌చ్చే మే 2 నుంచి 11 వ‌ర‌కు ఉమ్మ‌డి స‌భ‌ల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఓ రేంజ్‌కు చేర్చాల‌ని నిర్ణ‌యించారు. కాగా, మే 13న రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Satya

Recent Posts

సెట్ కి రాకుండా సినిమా తీసిన సింగీతం

దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…

2 hours ago

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…

4 hours ago

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

8 hours ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

10 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

12 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

13 hours ago