ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఇక్కడ ఎంతో అనుభవం ఉన్న సీనియర్ మంత్రిని కేవలం సర్పంచ్గా మాత్రమే పని చేసిన జూనియర్ నాయకుడు ఢీ కొట్టడమే కారణం. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అయిదు సార్లు ఎమ్మెల్యేగా విజయం.. మంత్రిగా కీలక బాధ్యతలు.. ఇలాంటి నేపథ్యం ఉన్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఎనిమిదో సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మరోసారి గెలుపు ఖాయమనే ధీమాతో ఈ వైసీపీ నాయకుడు ఉన్నారు.
ఇక మరోవైపు టీడీపీ నుంచి యువ నాయకుడు గొండు శంకర్ సమరానికి సై అంటున్నారు. ధర్మాన ప్రసాదరావుతో పోరుకు సై అంటున్నారు. శంకర్కు కేవలం సర్పంచ్గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీలో క్రమంగా ఎదుగుతున్న శంకర్ ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇక్కడ దశాబ్దాల అనుభవం ఉన్న మరో సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబాన్ని టీడీపీ పక్కనపెట్టడం విశేషం. ఇక్కడ ధర్మానకు షాక్ ఇవ్వాలంటే యువ నాయకుడే కావాలంటూ శంకర్కు బాబు ఛాన్స్ ఇచ్చారు.
ఇక్కడ ధర్మాన ప్రసాదరావును ఎన్నికల క్షేత్రంలో ఎదుర్కోవడం అంత సులువు కాదు. ముందుగా టీడీపీ క్యాడర్ శంకర్కు అండగా నిలవాల్సి ఉంది. గుండ కుటుంబం మద్దతుగా నిలిస్తే శంకర్కు పరిస్థితులు కలిసొస్తాయి. శ్రీకాకుళంలో ఆ కుటుంబానికి గొప్ప ఫాలోయింగ్ ఉంది. మరోవైపు మహామహా నాయకులనే ఎదుర్కొని గెలిచిన ధర్మాన ఈ సారి తేలిగ్గానే విజయం సాధిస్తాననే నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇక్కడ చరిత్ర చూసుకుంటే ఆరు సార్లు టీడీపీ గెలిచింది. మూడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. వైసీపీ ఒకసారి నెగ్గింది. ఇక్కడ వేర్వేరు పార్టీల తరపున నెగ్గిన ధర్మాన.. మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తారేమో చూడాలి. లేదంటే యువ నేత శంకర్ చేతిలో భంగపాటుకు గురవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on April 12, 2024 1:43 pm
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…