Political News

సీనియ‌ర్ మంత్రి వ‌ర్సెస్ యువ స‌ర్పంచ్‌

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం ఆస‌క్తి రేపుతోంది. ఎందుకంటే ఇక్క‌డ ఎంతో అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ మంత్రిని కేవ‌లం స‌ర్పంచ్‌గా మాత్ర‌మే ప‌ని చేసిన జూనియ‌ర్ నాయ‌కుడు ఢీ కొట్ట‌డ‌మే కార‌ణం. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం.. అయిదు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం.. మంత్రిగా కీల‌క బాధ్య‌త‌లు.. ఇలాంటి నేప‌థ్యం ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు శ్రీకాకుళం నుంచి బ‌రిలో ఉన్నారు. ఆయ‌న ఎనిమిదో సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మ‌రోసారి గెలుపు ఖాయ‌మ‌నే ధీమాతో ఈ వైసీపీ నాయ‌కుడు ఉన్నారు.

ఇక మ‌రోవైపు టీడీపీ నుంచి యువ నాయ‌కుడు గొండు శంక‌ర్ స‌మ‌రానికి సై అంటున్నారు. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుతో పోరుకు సై అంటున్నారు. శంక‌ర్‌కు కేవ‌లం స‌ర్పంచ్‌గా ప‌నిచేసిన అనుభ‌వం మాత్ర‌మే ఉంది. తెలుగుదేశం పార్టీలో క్ర‌మంగా ఎదుగుతున్న శంక‌ర్ ఇప్పుడు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌నే ల‌క్ష్యంతో ఉన్నారు. ఇక్క‌డ ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న మ‌రో సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి గుండ అప్ప‌ల సూర్య‌నారాయ‌ణ కుటుంబాన్ని టీడీపీ ప‌క్క‌న‌పెట్ట‌డం విశేషం. ఇక్క‌డ ధ‌ర్మాన‌కు షాక్ ఇవ్వాలంటే యువ నాయ‌కుడే కావాలంటూ శంక‌ర్‌కు బాబు ఛాన్స్ ఇచ్చారు.

ఇక్క‌డ ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును ఎన్నిక‌ల క్షేత్రంలో ఎదుర్కోవ‌డం అంత సులువు కాదు. ముందుగా టీడీపీ క్యాడ‌ర్ శంక‌ర్‌కు అండ‌గా నిల‌వాల్సి ఉంది. గుండ కుటుంబం మ‌ద్ద‌తుగా నిలిస్తే శంక‌ర్‌కు ప‌రిస్థితులు క‌లిసొస్తాయి. శ్రీకాకుళంలో ఆ కుటుంబానికి గొప్ప ఫాలోయింగ్ ఉంది. మ‌రోవైపు మ‌హామ‌హా నాయ‌కుల‌నే ఎదుర్కొని గెలిచిన ధ‌ర్మాన ఈ సారి తేలిగ్గానే విజ‌యం సాధిస్తాన‌నే న‌మ్మ‌కంతో క‌నిపిస్తున్నారు. ఇక్క‌డ చ‌రిత్ర చూసుకుంటే ఆరు సార్లు టీడీపీ గెలిచింది. మూడు సార్లు కాంగ్రెస్ విజ‌యం సాధించింది. వైసీపీ ఒక‌సారి నెగ్గింది. ఇక్క‌డ వేర్వేరు పార్టీల త‌ర‌పున నెగ్గిన ధ‌ర్మాన‌.. మ‌రోసారి వైసీపీ జెండా ఎగ‌రేస్తారేమో చూడాలి. లేదంటే యువ నేత శంక‌ర్ చేతిలో భంగ‌పాటుకు గుర‌వుతారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

This post was last modified on April 12, 2024 1:43 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago