Political News

వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకి చెందిన కీలక నేత పోతిన మహేష్ 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మహేష్ కు నిరాశ తప్పులేదు. పొత్తులో భాగంగా బిజెపి నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ కు ఆ సీటు దక్కింది. అయితే మహేష్ ను స్వయంగా పవన్ కళ్యాణ్ బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడుతూ పవన్ కళ్యాణ్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో మహేష్ తో పాటు ఆయన అనుచరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరు అందరికీ తెలుసు అంటూ రెండు రోజులు క్రితం మహేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశించి మహేష్ ఆ వ్యాఖ్యలు చేయడంతో ఆయన వైసీపీలో చేరుతారని టాక్ వచ్చింది. వైసీపీలో చేరితే తప్పేంటి అని ప్రశ్నించిన మహేష్..తాను వైసీపీ నుంచి ఒక్క పైసా తీసుకున్నట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు.

అంతకుముందు, పవన్ కళ్యాణ్ పై మహేష్ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నాయకుడంటే భరోసా ఇచ్చేవాడని, భవిష్యత్తుకు భద్రత కల్పించేవాడని, కానీ, పవన్ కు సొంత పార్టీ జెండా కన్నా పక్క పార్టీల జెండాలు మోయడంపైనే ఆసక్తి ఎక్కువని మహేష్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని నట్టేట మునిగామని, ఇన్నాళ్లు ఆయనతో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వార్ధపరులతో ప్రయాణించామని ఆలస్యంగా తెలుసుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పవన్ పార్టీ పెట్టినట్టుగా తన దగ్గర ఆధారాలున్నాయని, వాటిని బయట పెడతానని మహేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాజకీయాల్లోకి వచ్చి తాము ఆస్తులు అమ్ముకున్నామని, పవన్ మాత్రం వెనకేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాపు సామాజిక వర్గానికి, తమవంటి కొత్త తరం రాజకీయ నాయకులకు పవన్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. పక్క పార్టీల జెండాలు మోయడానికే జనసేన నేతలు, కార్యకర్తలు ఉన్నారా అని ప్రశ్నించారు. సీట్ల త్యాగాలకు మాత్రం బీసీలు కావాలి…కమ్మ సామాజిక వర్గం నేతలు పనికిరారా అని మహేష్ ప్రశ్నించారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ సీటు త్యాగం చేయొచ్చు కదా అని నిలదీశారు.

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

28 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

37 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago