Political News

కర్నూలులో ప్రముఖ టీడీపీ లీడర్ రాజీనామా

టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న క‌ర్నూలు జిల్లా ముఖ్య నాయ‌కుడు కేఈ ప్ర‌భాక‌ర్.. ఆ పార్టీకి రాజీనామా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌న కుమారుడు కేఈ రుద్ర ఆలోచ‌న‌ల మేరకు తాము వైసీపీలోకి వెళ్తామ‌ని తెలిపారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. పార్టీలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారికి ప్రాధాన్యం లేద‌ని ఈ సంద‌ర్భంగా కేఈ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎక్క‌డ నుంచో వ‌చ్చిన వారికి తాము ప‌నిచేయాలా? అని ప్ర‌శ్నించారు. వైసీపీలో చేరిపై తాము ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు.

దీంతో ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో బ‌ల‌మైన కేఈ కుటుంబం టీడీపీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, కేఈ ప్ర‌భాక‌ర్.. ఎవ‌రో కాదు.. గ‌త ఐదేళ్ల టీడీపీ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన సీనియ‌ర్ నాయ‌కుడు కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడే.. అప్ప‌ట్లో కేఈ ప్ర‌భాక‌ర్‌.. యాక్టివ్‌గా ప‌నిచేశారు. డోన్ సహా , శ్రీశైలం నియోజ‌క‌వర్గంలో ఆయ‌న హ‌వా ఇప్ప‌టికీ ఉంది. ముఖ్యంగా డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేశార‌న‌డంలో సందేహం లేదు.

వైసీపీ ముఖ్య నేత‌, మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై ప్ర‌తి రోజూ విమ‌ర్శలు చేయ‌డంతోపాటు.. పాద యాత్ర చేసి మ‌రీ.. టీడీపీని ఇక్క‌డ బ‌లోపేతం చేశారు కేఈ ప్ర‌భాక‌ర్‌. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆయ‌న టికెట్ ఆశించారు. కానీ, ఆయ‌న పేరును చంద్ర‌బాబు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. దీంతో కొన్నాళ్లుగా అలిగిన ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. ఇక‌, కేఈ కృష్న‌మూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు.. చంద్ర‌బాబు ప‌త్తికొండ టికెట్ ఇచ్చారు.

ఇదేస‌మ‌యంలో పార్టీలో రెండో ప్లేస్‌లో ఉన్నాన‌ని చెప్పిన ప్ర‌భాక‌ర్‌ను పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు పార్టీకి ఆయ‌న రిజైన్ చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి దీనిని చంద్ర‌బాబు స‌రిదిద్దుకుంటారా? లేక వ‌దిలేస్తారా? అన్న‌ది చూడాలి. వైసీపీలోకి క‌నుక కేఈ వెళ్లిపోతే.. మొత్తంగా మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌భావం చూపించ‌డంతోపాటు.. క‌ర్నూలు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంపైనా వీరి ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on April 10, 2024 11:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

58 minutes ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

2 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

3 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

5 hours ago