Political News

కర్నూలులో ప్రముఖ టీడీపీ లీడర్ రాజీనామా

టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న క‌ర్నూలు జిల్లా ముఖ్య నాయ‌కుడు కేఈ ప్ర‌భాక‌ర్.. ఆ పార్టీకి రాజీనామా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త‌న కుమారుడు కేఈ రుద్ర ఆలోచ‌న‌ల మేరకు తాము వైసీపీలోకి వెళ్తామ‌ని తెలిపారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. పార్టీలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారికి ప్రాధాన్యం లేద‌ని ఈ సంద‌ర్భంగా కేఈ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎక్క‌డ నుంచో వ‌చ్చిన వారికి తాము ప‌నిచేయాలా? అని ప్ర‌శ్నించారు. వైసీపీలో చేరిపై తాము ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు.

దీంతో ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో బ‌ల‌మైన కేఈ కుటుంబం టీడీపీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇక‌, కేఈ ప్ర‌భాక‌ర్.. ఎవ‌రో కాదు.. గ‌త ఐదేళ్ల టీడీపీ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన సీనియ‌ర్ నాయ‌కుడు కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడే.. అప్ప‌ట్లో కేఈ ప్ర‌భాక‌ర్‌.. యాక్టివ్‌గా ప‌నిచేశారు. డోన్ సహా , శ్రీశైలం నియోజ‌క‌వర్గంలో ఆయ‌న హ‌వా ఇప్ప‌టికీ ఉంది. ముఖ్యంగా డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేశార‌న‌డంలో సందేహం లేదు.

వైసీపీ ముఖ్య నేత‌, మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై ప్ర‌తి రోజూ విమ‌ర్శలు చేయ‌డంతోపాటు.. పాద యాత్ర చేసి మ‌రీ.. టీడీపీని ఇక్క‌డ బ‌లోపేతం చేశారు కేఈ ప్ర‌భాక‌ర్‌. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆయ‌న టికెట్ ఆశించారు. కానీ, ఆయ‌న పేరును చంద్ర‌బాబు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. దీంతో కొన్నాళ్లుగా అలిగిన ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. ఇక‌, కేఈ కృష్న‌మూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు.. చంద్ర‌బాబు ప‌త్తికొండ టికెట్ ఇచ్చారు.

ఇదేస‌మ‌యంలో పార్టీలో రెండో ప్లేస్‌లో ఉన్నాన‌ని చెప్పిన ప్ర‌భాక‌ర్‌ను పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు పార్టీకి ఆయ‌న రిజైన్ చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి దీనిని చంద్ర‌బాబు స‌రిదిద్దుకుంటారా? లేక వ‌దిలేస్తారా? అన్న‌ది చూడాలి. వైసీపీలోకి క‌నుక కేఈ వెళ్లిపోతే.. మొత్తంగా మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌భావం చూపించ‌డంతోపాటు.. క‌ర్నూలు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంపైనా వీరి ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on April 10, 2024 11:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago