వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న చీరాల మాజీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు ఆమంచి కృష్ణమోహన్.. కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని సైతం ప్రకటించారు. త్వరలోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయిం చుకున్నట్టు చెప్పారు. వైసీపీలో 2019 ఎన్నికలకు ముందు చేరిన ఆమంచి.. చీరాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ టికెట్పై పోటీ చేశారు. వైసీపీ హవా జోరుగా సాగినా ఆయన విజయం దక్కించుకోలేకపోయారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేసిన కరణం బలరాం విజయం దక్కించుకున్నారు.
ఆ తర్వాత.. వైసీపీలో ఆమంచికి గుర్తింపు లేకుండా పోయింది. అయినా.. పార్టీలో కొనసాగారు. స్థానిక సంస్థల ఎన్నికల సమ యంలో తన వర్గం వారికి అవకాశం దక్కకపోతే.. స్వతంత్రంగా వారిని నిలబెట్టి 52 వార్డుల్లో గెలిపించుకున్నారు. దీంతో అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగి ఆమంచితో రాజీ పడ్డారు. దీంతో చీరాల మునిసిపాలిటీ వైసీపీకి దక్కింది. ఇక, ఆ తర్వాత కూడా ఆమంచికి ప్రాధాన్యం దక్కలేదు. పైగా చీరాల ఇచ్చేది లేదని.. పరుచూరు నుంచి పోటీ చేయాలంటూ..ఆయనను అక్కడకు బదిలీ చేశారు. అయితే, అయిష్టంగానే చీరాలకు వెళ్లిన ఆమంచి అక్కడ ఇమడలేక పోయారు. కమ్మడామినేషన్కు ఆయనకు పడలేదని పార్టీ కూడా గుర్తించింది.
తీరా టికెట్ ప్రకటించే సమయానికి అసలు ఆమంచిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో పరుచూరుకు ఎడమ బాలాజీ ని ప్రకటించారు. దీంతో హర్టయిన ఆమంచి.. గత కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమంచి తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే.. ఆయన వైసీపీపై పన్నెత్తు మాట కూడా అనలేదు.. జగన్ తనను బాగానే చూసుకున్నారని.. ఆయన ప్రోత్సహించారని చెప్పారు. టీడీపీ కూడా తనకు గుర్తింపు ఇచ్చిందన్నారు. వాస్తవానికి తాను స్వతంత్రంగానే పోటీ చేయాలని భావించానని.. కానీ, తన అనుచరుల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ టికెట్పై చీరాల నుంచి పోటీ చేస్తానన్నారు.
This post was last modified on April 9, 2024 10:09 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…