Political News

‘పిఠాపురంలో ప‌వ‌న్‌కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయం’

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఆయ‌న గెలుపు త‌థ్య‌మ‌ని ఇటీవ‌ల టీడీపీలోకి చేరిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు సంల‌చ‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. అంద‌రూ చెబుతున్న‌ట్టుగా ల‌క్ష ఓట్ల మెజారిటీ రాక‌పోయినా.. ఖ‌చ్చితంగా 65 వేల ఓట్ల మెజారిటీతో ప‌వ‌న్ గెలుస్తున్నార‌ని చెప్పారు. తాను చేయించిన స‌ర్వేల్లో ప‌వ‌న్‌కు అనుకూలంగా మెజారిటీ ప్ర‌జ‌లు తీర్పు చెబుతున్న‌ట్టు తెలిసింద‌న్నారు. ప‌వ‌న్ కోరుకునేవారే ఎక్కువ‌గా ఉన్నారన్నారు. ఇక్క‌డ మెగా కుటుంబానికి భారీ ఫాలోయింగ్ ఉంద‌ని చెప్పారు. ఇది ప‌వ‌న్‌కు ప్ల‌స్ అవుతుంద‌న్నారు.

తాజాగా పిఠాపురంలో ప‌ర్య‌టించిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ప‌వ‌న్ కొత్త‌గా అద్దెకు తీసుకున్న ఇంటిని సంద‌ర్శించారు. ప‌వ‌న్‌తోనూ భేటీ అయ్యారు. ఆయ‌న‌కు ప‌ట్టు శాలువా క‌ప్పి.. స‌త్క‌రించారు. ప‌వ‌న్ ఆరోగ్యం బాగోలేద‌న్న వార్త‌లు త‌న‌ను క‌ల‌చి వేశాయ‌ని.. ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకునేందుకు తాను స్వ‌యంగా పిఠాపురం వ‌చ్చాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స్వ‌ల్ప జ్వ‌రంతో ప‌వ‌న్ ఇబ్బంది ప‌డుతున్న‌ట్టుర‌ఘురామ తెలిపారు. తాను పిఠాపురంలో గ‌త వారం రోజులుగా త‌న మ‌నుషుల‌తో స‌ర్వే చేయించిన‌ట్టు తెలిపారు. ఈ స‌ర్వేలో 65 వేల ఓట్ల‌పైగా మెజారిటీతో ప‌వ‌న్ గెలుస్తున్నార‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. తాను చెప్పింది తూ.చ‌. త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని చెప్పారు. రాసిపెట్టుకోవాల‌ని మీడియాకు సూచించారు.

ఇక‌, ప‌వ‌న్‌ను ఓడించేందుకు.. అనేక మంది రెడ్లు ఇక్క‌డ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన ర‌ఘురామ‌.. ఎంత మంది రెడ్లు వ‌చ్చినా.. ప‌వ‌న్‌ను ఓడించ‌డం సాధ్యం కాద‌న్నారు. సాక్ష‌త్తూ సీఎం జ‌గ‌న్‌రెడ్డి వ‌చ్చి ఇక్క‌డ కూర్చున్నా.. ప‌వ‌న్ ఓట‌మి అనే మాట వినిపించ‌ద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న పోవాల‌ని కాపులు కోరుకుంటున్నార‌ని.. కాపులే కాదు.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా ఇదే కోరుకుంటున్నార‌ని.. ఇది పిఠాపురం నుంచే ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. పిఠాపురంలో పవ‌న్‌కు తిరుగులేద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు.

ఇక‌, త‌న‌కు చంద్ర‌బాబు ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ఆదేశించినా శిర‌సా వ‌హిస్తాన‌ని ర‌ఘురామ తెలిపారు. అసెంబ్లీ అయినా.. చ‌ట్ట‌స‌బే క‌దా.. అని ప్ర‌శ్నించారు. కుదిరితే పార్ల‌మెంటుకు…లేక‌పోతే అసెంబ్లీకి అయినా త‌న పోటీ ఖాయ‌మ‌ని చెప్పారు. త‌ను ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తార‌ని ర‌ఘురామ తెలిపారు. వైసీపీ నేత‌లు, రెడ్లు ప‌న్నే ప‌న్నాగాల‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని ర‌ఘురామ అన్నారు.

This post was last modified on April 9, 2024 9:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిజిటల్ దురంధర్ మేజిక్ చేస్తాడా

ఇంకా అధికారికంగా ప్రకటించడం, ప్రమోషన్లు చేయడం లాంటివి జరగకపోయినా రేపటి నుంచి దురంధర్ ఓటిటి స్ట్రీమింగ్ జరగడం దాదాపు ఖాయమే.…

46 minutes ago

అన్నగారంటే ఇంత నిర్లక్ష్యమా?

థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…

2 hours ago

మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా…

4 hours ago

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

4 hours ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

5 hours ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

6 hours ago