Political News

‘పిఠాపురంలో ప‌వ‌న్‌కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయం’

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఆయ‌న గెలుపు త‌థ్య‌మ‌ని ఇటీవ‌ల టీడీపీలోకి చేరిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు సంల‌చ‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. అంద‌రూ చెబుతున్న‌ట్టుగా ల‌క్ష ఓట్ల మెజారిటీ రాక‌పోయినా.. ఖ‌చ్చితంగా 65 వేల ఓట్ల మెజారిటీతో ప‌వ‌న్ గెలుస్తున్నార‌ని చెప్పారు. తాను చేయించిన స‌ర్వేల్లో ప‌వ‌న్‌కు అనుకూలంగా మెజారిటీ ప్ర‌జ‌లు తీర్పు చెబుతున్న‌ట్టు తెలిసింద‌న్నారు. ప‌వ‌న్ కోరుకునేవారే ఎక్కువ‌గా ఉన్నారన్నారు. ఇక్క‌డ మెగా కుటుంబానికి భారీ ఫాలోయింగ్ ఉంద‌ని చెప్పారు. ఇది ప‌వ‌న్‌కు ప్ల‌స్ అవుతుంద‌న్నారు.

తాజాగా పిఠాపురంలో ప‌ర్య‌టించిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ప‌వ‌న్ కొత్త‌గా అద్దెకు తీసుకున్న ఇంటిని సంద‌ర్శించారు. ప‌వ‌న్‌తోనూ భేటీ అయ్యారు. ఆయ‌న‌కు ప‌ట్టు శాలువా క‌ప్పి.. స‌త్క‌రించారు. ప‌వ‌న్ ఆరోగ్యం బాగోలేద‌న్న వార్త‌లు త‌న‌ను క‌ల‌చి వేశాయ‌ని.. ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకునేందుకు తాను స్వ‌యంగా పిఠాపురం వ‌చ్చాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స్వ‌ల్ప జ్వ‌రంతో ప‌వ‌న్ ఇబ్బంది ప‌డుతున్న‌ట్టుర‌ఘురామ తెలిపారు. తాను పిఠాపురంలో గ‌త వారం రోజులుగా త‌న మ‌నుషుల‌తో స‌ర్వే చేయించిన‌ట్టు తెలిపారు. ఈ స‌ర్వేలో 65 వేల ఓట్ల‌పైగా మెజారిటీతో ప‌వ‌న్ గెలుస్తున్నార‌ని త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. తాను చెప్పింది తూ.చ‌. త‌ప్ప‌కుండా జ‌రుగుతుంద‌ని చెప్పారు. రాసిపెట్టుకోవాల‌ని మీడియాకు సూచించారు.

ఇక‌, ప‌వ‌న్‌ను ఓడించేందుకు.. అనేక మంది రెడ్లు ఇక్క‌డ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన ర‌ఘురామ‌.. ఎంత మంది రెడ్లు వ‌చ్చినా.. ప‌వ‌న్‌ను ఓడించ‌డం సాధ్యం కాద‌న్నారు. సాక్ష‌త్తూ సీఎం జ‌గ‌న్‌రెడ్డి వ‌చ్చి ఇక్క‌డ కూర్చున్నా.. ప‌వ‌న్ ఓట‌మి అనే మాట వినిపించ‌ద‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న పోవాల‌ని కాపులు కోరుకుంటున్నార‌ని.. కాపులే కాదు.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా ఇదే కోరుకుంటున్నార‌ని.. ఇది పిఠాపురం నుంచే ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. పిఠాపురంలో పవ‌న్‌కు తిరుగులేద‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు.

ఇక‌, త‌న‌కు చంద్ర‌బాబు ఎక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ఆదేశించినా శిర‌సా వ‌హిస్తాన‌ని ర‌ఘురామ తెలిపారు. అసెంబ్లీ అయినా.. చ‌ట్ట‌స‌బే క‌దా.. అని ప్ర‌శ్నించారు. కుదిరితే పార్ల‌మెంటుకు…లేక‌పోతే అసెంబ్లీకి అయినా త‌న పోటీ ఖాయ‌మ‌ని చెప్పారు. త‌ను ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తార‌ని ర‌ఘురామ తెలిపారు. వైసీపీ నేత‌లు, రెడ్లు ప‌న్నే ప‌న్నాగాల‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని ర‌ఘురామ అన్నారు.

This post was last modified on April 9, 2024 9:56 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

3 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

5 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

5 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

7 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

10 hours ago