మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇవ్వడం ఈ రోజు హాట్ టాపిక్గా మారింది. తమ్ముడి పార్టీకి అన్న విరాళం ఇవ్వడంలో విశేషం ఏముంది అనిపించవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దీన్ని ఒక కీలక పరిణామంగానే చూడాలి. నిజానికి చిరు ఇచ్చింది కేవలం విరాళం కాదు.. ఒక పెద్ద స్టేట్మెంట్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా అభిమానుల్లోనే ఇప్పుడు రకరకాల వర్గాలు ఏర్పడ్డాయి.
చిరు అభిమానుల్లో ఓ వర్గం పవన్ను వ్యతిరేకించడం.. పవన్ ఫ్యాన్స్లో కొందరు చిరును రాజకీయంగా విమర్శించడం లాంటివి చేస్తుంటారు. మరోవైపు చిరు గతంలో ఏపీ సీఎం జగన్తో సన్నిహితంగా వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులందరూ విభేదాలను పక్కన పెట్టి.. ఏకతాటిపై నడవాలని చిరు చెప్పకనే చెప్పినట్లు అయింది.
జనసేనకు మెగా అభిమానుల నుంచి సంపూర్ణ మద్దతు రాబట్టడమే చిర-పవన్ ప్రత్యేక కలయికకు.. చిరు భారీ విరాళం ప్రకటించడానికి కారణంగా స్పష్టమవుతోంది. అభిమానుల్లో వర్గాల వల్ల ఓట్ల చీలిక జరిగి వైసీపీకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో తాను తమ్ముడికి పూర్తిమద్దతు ప్రకటించడం ద్వారా మెగా అభిమానులు కూడా పూర్తగా పవన్కు అండగా నిలవాలని చిరు సంకేతాలు ఇచ్చారన్నది స్పష్టం.
కేవలం విరాళం మాత్రమే ఇవ్వాలనుకుంటే.. చిరు సైలెంట్గా ఆ పని చేయొచ్చు. నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్ గతంలో అలాగే చేశారు. కానీ చిరు మాత్రం దీన్నొక కార్యక్రమం లాగా చేశారు. పవన్కు ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా తన మద్దతు ఉందని స్పష్టం చేశారు. మరి మెగా అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఎన్నికల్లో పవన్కు పూర్తి అండనిస్తారేమో చూడాలి.
This post was last modified on April 8, 2024 10:09 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…