Political News

ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో రఘురామ సైకిల్ ఎక్కారు. రఘురామకృష్ణరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రఘురామ ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామ ఎన్నికల బరిలో దిగబోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

పాలకొల్లులో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్థానంలో రఘురామను చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, ఈ వ్యవహారంపై ఆల్రెడీ టికెట్ దక్కించుకున్న అభ్యర్థి రామరాజు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అంతకుముందు పాలకొల్లులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో రఘురామ టీడీపీలో చేరుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వల్లే తాను ఈరోజు ప్రాణాలతో ఉన్నానని రఘురామ ఎమోషనల్ అయ్యారు. కస్టోడియల్ టార్చర్ కు గురైన తర్వాత తనకు చంద్రబాబు ధైర్యం చెప్పారని, తనపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు తనకు, తన కుటుంబానికి ఆయన అండగా నిలిచారని రఘురామ గుర్తు చేసుకున్నారు.

తాను జైల్లో ఉన్న రోజు రాత్రి నిద్ర పోకుండా లాయర్లతో చంద్రబాబు మాట్లాడారని, తన కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారని అన్నారు. చంద్రబాబుకు తాను రుణపడి ఉంటానని అన్నారు. తనకోసం చంద్రబాబు ఉన్నాను.. విన్నాను అని చెప్పారని, కానీ కొంతమంది నేను ఉన్నాను…నేను విన్నాను అంటూ సొల్లు కబుర్లు చెబుతుంటారని జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

గత నాలుగేళ్లుగా అనే వారి కారణాల వల్ల రాష్ట్రానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు అండగా నిలిచిన టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ప్రభంజనం సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ త్రిమూర్తుల కలయిక గురించి తాను ఏడాదికాలంగా చెబుతూనే ఉన్నానని గుర్తు చేసుకున్నారు.

This post was last modified on April 6, 2024 3:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

1 hour ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

3 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

3 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago