ఏప్రిల్ 14 తర్వాత తెలంగాణలో లాక్ డౌన్ పొడిగించడం పక్కా అని ముందే జనాలకు అర్థమైపోయింది. ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ముందుగానే సంకేతాలు ఇచ్చేశారు.
కేంద్రం లాక్ డౌన్ను 14 తర్వాత పొడిగిస్తున్నట్లు ప్రకటించడానికి ముందే ఆయన తెలంగాణలో పొడిగింపు గురించి ప్రకటన చేసేశారు. మరి మే 3 తర్వాత లాక్ డౌన్ పరిస్థితేంటి.. తెలంగాణలో ఏమైనా సడలింపులుంటాయా.. అక్కడితో లాక్ డౌన్కు తెరపడుతుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఐతే మిగతా రాష్ట్రాల పరిస్థితేంటో కానీ.. తెలంగాణలో మాత్రం పరిస్థితి మారేలా కనిపించడం లేదు. మరోసారి లాక్ డౌన్ పొడిగింపునకే తెలంగాణ సీఎం మొగ్గు చూపుతున్నారు.
తాజాగా మంత్రులు, అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు దిశగానే సంకేతాలిచ్చారు కేసీఆర్.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత నియంత్రణలోనే ఉందని కేసీఆర్ ఈ సమావేశంలో చెప్పారు. కరోనా కేసులు ఎన్ని ఉన్నప్పటికీ.. మరణాల రేటు జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో తక్కువ ఉండటం ఊరటనిచ్చే విషయమని ఆయనన్నారు. లాక్ డౌన్ను మరి కొంత కాలం కొనసాగిస్తే, ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత, తగిన జాగ్రత్తలు పాటిస్తే రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశముందని ఆయనన్నారు.
సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని.. సీఎంలందరూ తమ రాష్ట్రాల్లో పరిస్థితిని వివరిస్తారని.. దేశవ్యాప్తంగా పరిస్థితిపై ఈ సమావేశంలో ఓ అంచనా వస్తుందని కేసీఆర్ అన్నారు. తదుపరి చర్యలపైనా ఈ సమావేశంలో అభిప్రాయాలు వెల్లడువతాయని.. తద్వారా తదుపరి కార్యాచరణపై స్పష్టత వస్తుందని ఆయనన్నారు. తెలంగాణ స్టాండ్ అయితే లాక్ డౌన్ పొడిగింపే అని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…