తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయంపై దృష్టి పెట్టింది. దీంతో తిరుమల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
ఏం జరిగింది?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన తెలంగాణ మహిళ 300 రూపాయల క్యూలైన్లో ఉండగా.. పాము కాటు వేసిందని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. తిరుమలలో సాధారణ భక్తులకు భద్రత కరువైందని.. తిరుమలను రాజకీయంగా వాడుకుంటున్నారని.. అందుకే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో రచ్చ తెరమీదికి వచ్చింది. దీంతోవెంటనే స్పందించిన సీఎంవో అధికారులు అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీశారు.
వాస్తవం ఇదీ..
తెలంగాణలోని వరంగల్కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు స్వామి దర్శనం కోసం వచ్చారు. ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియా వద్దకు రాగానే తన కాలికి పసుపు రాసుకునే ఉద్దేశంతో మౌనిక కారు నుంచి కిందకు దిగారు. ఆ సమయంలో తన కాలికి ఏదో గుచ్చుకోవడంతో ఆమె భయంతో కేకలు పెట్టారు. ఆమె భర్త శరత్ బాబు చుట్టుపక్కల వెతికి చూడగా ఓ పాము పిల్ల కనిపించింది. దీంతో ఆమెను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అయితే.. ఆమె కాలిని పాముకాటు వేయలేదని.. వైద్యులు నిర్ధారించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం.. తిరుపతిలోని స్విమ్స్కు తరలించారు. అక్కడి వైద్యులు కూడా.. పాము కాటు కాదని తెలిపారు. అయితే.. బాధితురాలికి 300 రూపాయల క్యూలైన్లోనే పాము కాటు వేసిందని.. ఆమె ప్రాణా పాయ స్థితికి చేరుకున్నారని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. దీనిపైనే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
This post was last modified on February 24, 2026 7:36 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…