తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయంపై దృష్టి పెట్టింది. దీంతో తిరుమల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
ఏం జరిగింది?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన తెలంగాణ మహిళ 300 రూపాయల క్యూలైన్లో ఉండగా.. పాము కాటు వేసిందని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. తిరుమలలో సాధారణ భక్తులకు భద్రత కరువైందని.. తిరుమలను రాజకీయంగా వాడుకుంటున్నారని.. అందుకే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో రచ్చ తెరమీదికి వచ్చింది. దీంతోవెంటనే స్పందించిన సీఎంవో అధికారులు అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీశారు.
వాస్తవం ఇదీ..
తెలంగాణలోని వరంగల్కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు స్వామి దర్శనం కోసం వచ్చారు. ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియా వద్దకు రాగానే తన కాలికి పసుపు రాసుకునే ఉద్దేశంతో మౌనిక కారు నుంచి కిందకు దిగారు. ఆ సమయంలో తన కాలికి ఏదో గుచ్చుకోవడంతో ఆమె భయంతో కేకలు పెట్టారు. ఆమె భర్త శరత్ బాబు చుట్టుపక్కల వెతికి చూడగా ఓ పాము పిల్ల కనిపించింది. దీంతో ఆమెను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అయితే.. ఆమె కాలిని పాముకాటు వేయలేదని.. వైద్యులు నిర్ధారించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం.. తిరుపతిలోని స్విమ్స్కు తరలించారు. అక్కడి వైద్యులు కూడా.. పాము కాటు కాదని తెలిపారు. అయితే.. బాధితురాలికి 300 రూపాయల క్యూలైన్లోనే పాము కాటు వేసిందని.. ఆమె ప్రాణా పాయ స్థితికి చేరుకున్నారని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. దీనిపైనే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
This post was last modified on February 24, 2026 7:36 am
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…
నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…
ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2,…