తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయంపై దృష్టి పెట్టింది. దీంతో తిరుమల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
ఏం జరిగింది?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన తెలంగాణ మహిళ 300 రూపాయల క్యూలైన్లో ఉండగా.. పాము కాటు వేసిందని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. తిరుమలలో సాధారణ భక్తులకు భద్రత కరువైందని.. తిరుమలను రాజకీయంగా వాడుకుంటున్నారని.. అందుకే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో రచ్చ తెరమీదికి వచ్చింది. దీంతోవెంటనే స్పందించిన సీఎంవో అధికారులు అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీశారు.
వాస్తవం ఇదీ..
తెలంగాణలోని వరంగల్కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు స్వామి దర్శనం కోసం వచ్చారు. ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియా వద్దకు రాగానే తన కాలికి పసుపు రాసుకునే ఉద్దేశంతో మౌనిక కారు నుంచి కిందకు దిగారు. ఆ సమయంలో తన కాలికి ఏదో గుచ్చుకోవడంతో ఆమె భయంతో కేకలు పెట్టారు. ఆమె భర్త శరత్ బాబు చుట్టుపక్కల వెతికి చూడగా ఓ పాము పిల్ల కనిపించింది. దీంతో ఆమెను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అయితే.. ఆమె కాలిని పాముకాటు వేయలేదని.. వైద్యులు నిర్ధారించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం.. తిరుపతిలోని స్విమ్స్కు తరలించారు. అక్కడి వైద్యులు కూడా.. పాము కాటు కాదని తెలిపారు. అయితే.. బాధితురాలికి 300 రూపాయల క్యూలైన్లోనే పాము కాటు వేసిందని.. ఆమె ప్రాణా పాయ స్థితికి చేరుకున్నారని పేర్కొంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. దీనిపైనే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
This post was last modified on February 24, 2026 7:36 am
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. నిరంతరం రాజకీయ సంఘర్షణలకు ఈ నియోజకవర్గం వేదికగా ఉంటుందన్న విషయం తెలిసిందే.…
ఈ మధ్య తెలుగు నిర్మాణ సంస్థలు ఇండస్ట్రీల మధ్య హద్దులను చెరిపివేస్తూ.. ఇతర భాషలకు వెళ్లి సినిమాలు నిర్మిస్తున్నాయి. టాలీవుడ్…
ఇప్పటిదాకా జరిగిన పెద్ది ప్రమోషన్లను జాగ్రత్తగా గమనిస్తే జాన్వీ కపూర్ కేవలం చికిరి చికిరి పాటలో మాత్రమే కనిపించింది. దాంట్లో…
బిగ్ బాస్తో పాటు అనేక టీవీ షోల ద్వారా పాపురల్ అయిన అమ్మాయి.. విష్ణుప్రియ భీమనేని. ఈ పాపులారిటీతోనే ఇన్స్టాగ్రామ్లో…
ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన…
టైటిల్ లో బ్యాడ్ అని పెట్టుకున్నారు కానీ దానికి తగ్గట్టే ప్రమోషన్లలో బాగా వెనుకబడిపోయింది బ్యాడ్ బాయ్ కార్తీక్. శుక్రవారం…