ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్ ఈవెంట్ లో ఏడాదికి రెండు రిలీజులు ఉంటాయని ప్రభాస్ ఇచ్చిన హామీ మేరకు, ఎవరూ ఫాలో కానంత వేగంగా ప్యాన్ ఇండియా మూవీస్ ఓకే చేస్తున్నా వాటి నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఇచ్చిన మాట నెరవేరడం లేదు.
తీరిక లేనంత బిజీగా డార్లింగ్ సెట్స్ లోనే ఉంటున్న మాట నిజమే కానీ కొన్ని నిర్మాణ సంస్థల ప్లానింగ్ లోపాల వల్ల టైమింగ్ మిస్సవుతోంది. అందుకే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ విషయంలో చాలా క్లారిటీతో ఉంటూ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ప్రకటించేసుకున్నారు.
ఫౌజీ ఇంకా పూర్తి కాకుండానే కల్కి 2 సెట్స్ పైకి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి ప్రభాస్ లేని ఎపిసోడ్స్ ని దర్శకుడు నాగ అశ్విన్ షూట్ చేస్తున్నారు. వీటిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తో పాటు మెయిన్ క్యాస్టింగ్ భాగం కానుంది. ఇంకో రెండు నెలల లోపు ప్రభాస్ జాయిన్ కావొచ్చని అంటున్నారు.
హీరోయిన్ గా దీపికా పదుకునే స్థానంలో ఎవరు వచ్చారనే క్లారిటీ ఇప్పటిదాకా లేదు. సాయిపల్లవి పేరు వినిపిస్తున్నా టీమ్ దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. సో అనౌన్స్ మెంట్స్ వచ్చే దాకా వెయిట్ చేయాలి. అమితాబ్, కమల్ కాల్ షీట్స్ దొరకడంతో ముందు ఆ భాగాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాగ్ అశ్విన్.
విడుదల తేదీ పరంగా కల్కి 2 మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే దీనికన్నా ముందు ఫౌజీ, స్పిరిట్ వస్తాయి. అంటే 2028లో కల్కి 2 ప్లాన్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ కు తగినంత సమయం కావాలి కాబట్టి నాగ్ అశ్విన్ కి ఇది మంచి ప్లానింగ్ అవుతుంది.
మొదటి భాగానికి అయిదు రెట్లు ఎక్కువనే స్థాయిలో సీక్వెల్ కంటెంట్ ఉంటుందని, విజువల్స్ అబ్బురపరుస్తాయని ఇన్ సైడ్ టాక్. పార్ట్ 1 లో తక్కువ స్పేస్ దక్కించుకున్న కమల్ హాసన్ ఈసారి ఫుల్ లెన్త్ రోల్ లో విశ్వరూపం చూపిస్తారట. ముఖ్యంగా ఆయనకు, ప్రభాస్ కు మధ్య వచ్చే సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉంటాయని వినికిడి.
This post was last modified on February 24, 2026 11:42 am
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…