ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ టాలీవుడ్ ఎటు వైపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటికీ ఎవరూ మాట్లాడడం లేదు. అందరూ గుంభనంగానే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా.. యువ హీరో నిఖిల్ టీడీపీ బాట పట్టారు. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకొన్నారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేష్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
“నిజంగా ఇది ఎవరూ ఊహించని పరిణామం. నిఖిల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సామాజిక స్పృహతో కొన్ని పోస్టులు పెట్టినప్పటికీ, రాజకీయాలపై అతడికి ఆసక్తి ఉన్న విషయం పెద్దగా ఎప్పుడూ బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో నిఖిల్ టీడీపీలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది” అని నారా లోకేష్ అన్నారు. ఇదిలావుంటే, నిఖిల్ ఏదైనా టికెట్ ఆశించారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే.. టీడీపీ తుది జాబితా కూడా వచ్చేసింది. కూటమిలో భాగంగా పంచుకున్న 144 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో నిఖిల్ కు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది చూడాలి.
టాలీవుడ్లో మెల్లగా మొదలై..
టాలీవుడ్ లో మెల్లగా మొదలైన నిఖిల్ ప్రస్థానం.. ప్రస్తుతం మంచి సక్సెస్ లో దూసుకుపోతోంది. యువ హీరోల్లో నిఖిల్ సక్సెస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. గత ఏడాది వచ్చిన కార్తికేయ-2, 18 పేజెస్, స్పై చిత్రాలు సూపర్గా సక్సెస్ అయ్యాయి. సంబరం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో తొలి హిట్ కొట్టాడు. ఆ తర్వాత స్వామి రా రా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో పుంజుకున్నాడు.
This post was last modified on March 29, 2024 10:51 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…