Political News

ప‌వ‌న్‌పై క‌సి తీర్చేసుకున్న ముద్ర‌గ‌డ‌.. ఏ రేంజ‌లో అంటే!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పీక‌ల లోతు ఆవేద‌న‌, ఆక్రంద‌న వ్య‌క్తం చేస్తున్న కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ ఎంపీ ముద్ర గ‌డ ప‌ద్మ‌నాభం.. ఆ క‌సినంతా తీర్చేసుకున్నారు. అది కూడా ఓ రేంజ్‌లో ఆయ‌న రెచ్చిపోయారు. జ‌న‌సేన అధినేత‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నిజానికి వైసీపీలోకి చేరిన త‌ర్వాతే ఆయ‌న ప‌వ‌న్‌పై తొలిసారి “నువ్వు సినిమాల్లో హీరో మాత్ర‌మే. మేం రాజకీయంగా హీరోలం” అంటూ..సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. తాము పార్టీని ముందుండి న‌డిపిస్తామ‌న్నా.. పోయి పోయి పొత్తులు పెట్టుకున్నాడ‌ని నిప్పులు చెరిగారు. పొత్తులుపెట్టుకుని కూడా క‌నీసం త‌న వారికి సీట్లు ద‌క్కించుకోలేక పోయార‌ని విమ‌ర్శించారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా మ‌రింత దూకుడు వ్యాఖ్య‌లు చేశారు ముద్ర‌గ‌డ‌. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్  పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సీటును చాలా స‌మీక‌ర‌ణ‌లు, చాలా స‌ర్వేల అనంత‌రం.. ఆయ‌న ఏరికోరి ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే.. తాజాగా ముద్ర‌గ‌డ ప‌వ‌న్‌పై నిప్పులు చెరుగుతూ.. పిఠాపురంలో ప‌వ‌న్ ఓడిపోవడం ఖాయమని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. “ఎన్నికలంటే సినిమాలు కాదు. ఆవేశంగా నాలుగు డైలాగులు చెప్పేసి.. ఊగిపోతూ ప్రసంగాలు చేసినంత మాత్రాన ఓట్లు పడవు” అని త‌న‌దైన శైలిలో ప‌వ‌న్‌ను విమ‌ర్శించారు.

అంతేకాదు.. ముద్రగ‌డ చిరుకు, ప‌వ‌న్‌కు పోలిక పెట్టారు. రాజకీయాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కంటే చిరంజీవే బెటర్ పవన్ జైలుకెళ్లి చంద్రబాబును కలిసిన తర్వాతే ఆయన గ్రాఫ్ పెరిగిందని తాను చెప్పా.. దీంతో చంద్రబాబు నాపై కోపం పెంచుకున్నారు.. అని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని, అందుకే రెండు మూడు సార్లు ప‌వ‌న్ వ‌స్తాన‌ని చెప్పి కూడా చంద్ర‌బాబు అనుమ‌తి లేక‌పోవ‌డంతో రాలేద‌ని, దీంతో తాను నిజంగానే బాధ‌ప‌డ్డాన‌ని ముద్ర‌గ‌డ‌ చెప్పారు.

బీజేపీలో చేరాల‌నుకున్నా!

గ‌తంలో తాను బీజేపీలో చేరాల‌ని అనుకున్న‌ట్టు ముద్ర‌గ‌డ చెప్పారు. “ఔను బీజేపీలో చేరాల‌ని అనుకున్నా. పోలవరం నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ర‌ద్దు, ఏపీకి ప్రత్యేకహోదా తదితర అంశాలపై హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌ని చెప్పా. కానీ, నా ప్ర‌తిపాద‌న‌లు చూసి  వారి నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వైసీపీలో చేరా” అని ముద్ర‌గ‌డ వివ‌రించారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా.. బలమైన అభ్యర్థులకే జగన్ టికెట్లు ఇచ్చారని ముద్ర‌గ‌డ‌ తెలిపారు. మరో 30 ఏళ్లు జగనే అధికారంలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on March 29, 2024 9:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

3 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

4 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

4 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

6 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

7 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

8 hours ago