అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి, తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ‘జాతిరత్నాలు’ సినిమా తీసింది ఈ దర్శకుడే. కామెడీ అంటే ఇలాగే ఉండాలి అనే ఒక మూసను అతను బ్రేక్ చేశాడు. లీడ్ క్యారెక్టర్లను పూర్తి డంబ్గా తీర్చిదిద్ది.. కథాకథనాలను ఏ దశలోనూ సీరియస్గా తీసుకోకుండా.. సీరియస్ అనిపించే సందర్భాల్లోనూ వినోదాన్ని పంచి.. అతను ఆద్యంతం నవ్వులు పంచిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
కానీ అనుదీప్ మెరుపులు ఆ ఒక్క సినిమాకే పరిమితం అయిపోయాయి. తన తర్వాతి చిత్రం ‘ప్రిన్స్’ నిరాశపరిచింది. దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘ఫంకీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనుదీప్కు ఇంకా పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమా మినిమం ప్రభావం చూపకుండా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది.
అనుదీప్ తొలి చిత్రం ‘పిట్టగోడ’ గురించి జనాలకు అస్సలు తెలియదు. మొత్తంగా నాలుగు సినిమాలు తీస్తే మూడు డిజాస్టర్లు అయ్యాయి. ఒక్కటే బాగా ఆడింది. ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ ప్రొడక్షన్లో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఇంకో సినిమా కూడా వచ్చింది. అదీ తుస్సుమనిపించింది. ప్రిన్స్, ఫంకీ చిత్రాలు చూస్తే.. అనుదీప్కు వచ్చింది ఒకే స్టైల్ ఆఫ్ కామెడీ.. అది కూడా ఇప్పుడు సేల్ అయ్యేలా లేదనిపిస్తోంది. దీనికి మించి అతనేమీ చేయలేడు అనే ముద్ర పడిపోయింది. నవీన్ పొలిశెట్టి లాంటి స్పెషల్ టాలెంట్ ఉన్న హీరో తప్పితే.. అతడి మార్కు కామెడీని మరో నటుడు పండించలేడేమో అనిపిస్తోంది. ఒకవేళ నవీన్ వచ్చి అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేసినా సరే.. మళ్లీ ‘జాతిరత్నాలు’ స్థాయిలో నవ్వించగలడా అన్నది సందేహమే.
‘జాతిరత్నాలు’ తర్వాత ఒక దశలో రవితేజ లాంటి స్టార్ కూడా అనుదీప్తో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఇప్పుడు ఇంకా చిన్న స్థాయి హీరోలు కూడా వెనుకంజ వేసే పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాతలు దొరకడం కూడా సందేహంగా ఉంది. ఈ దశ నుంచి అనుదీప్ పుంజుకోవడం కష్టంగానే ఉంది. ‘జాతిరత్నాలు’ తర్వాత పేరున్న హీరోలు, పెద్ద బేనర్లలో రెండు సినిమాలు చేయగలిగాడు కానీ.. ‘ఫంకీ’ తర్వాత అవకాశాలు అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మరి అతణ్ని నమ్మి సినిమా చేసే నిర్మాత, హీరోలు ఎవరో చూడాలి మరి.
This post was last modified on March 9, 2026 5:15 am
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడంలోనే అసలైన గౌరవం, మర్యాద ఉంటాయని మరోసారి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…