అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి, తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ‘జాతిరత్నాలు’ సినిమా తీసింది ఈ దర్శకుడే. కామెడీ అంటే ఇలాగే ఉండాలి అనే ఒక మూసను అతను బ్రేక్ చేశాడు. లీడ్ క్యారెక్టర్లను పూర్తి డంబ్గా తీర్చిదిద్ది.. కథాకథనాలను ఏ దశలోనూ సీరియస్గా తీసుకోకుండా.. సీరియస్ అనిపించే సందర్భాల్లోనూ వినోదాన్ని పంచి.. అతను ఆద్యంతం నవ్వులు పంచిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
కానీ అనుదీప్ మెరుపులు ఆ ఒక్క సినిమాకే పరిమితం అయిపోయాయి. తన తర్వాతి చిత్రం ‘ప్రిన్స్’ నిరాశపరిచింది. దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘ఫంకీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనుదీప్కు ఇంకా పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమా మినిమం ప్రభావం చూపకుండా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది.
అనుదీప్ తొలి చిత్రం ‘పిట్టగోడ’ గురించి జనాలకు అస్సలు తెలియదు. మొత్తంగా నాలుగు సినిమాలు తీస్తే మూడు డిజాస్టర్లు అయ్యాయి. ఒక్కటే బాగా ఆడింది. ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ ప్రొడక్షన్లో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఇంకో సినిమా కూడా వచ్చింది. అదీ తుస్సుమనిపించింది. ప్రిన్స్, ఫంకీ చిత్రాలు చూస్తే.. అనుదీప్కు వచ్చింది ఒకే స్టైల్ ఆఫ్ కామెడీ.. అది కూడా ఇప్పుడు సేల్ అయ్యేలా లేదనిపిస్తోంది. దీనికి మించి అతనేమీ చేయలేడు అనే ముద్ర పడిపోయింది. నవీన్ పొలిశెట్టి లాంటి స్పెషల్ టాలెంట్ ఉన్న హీరో తప్పితే.. అతడి మార్కు కామెడీని మరో నటుడు పండించలేడేమో అనిపిస్తోంది. ఒకవేళ నవీన్ వచ్చి అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేసినా సరే.. మళ్లీ ‘జాతిరత్నాలు’ స్థాయిలో నవ్వించగలడా అన్నది సందేహమే.
‘జాతిరత్నాలు’ తర్వాత ఒక దశలో రవితేజ లాంటి స్టార్ కూడా అనుదీప్తో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఇప్పుడు ఇంకా చిన్న స్థాయి హీరోలు కూడా వెనుకంజ వేసే పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాతలు దొరకడం కూడా సందేహంగా ఉంది. ఈ దశ నుంచి అనుదీప్ పుంజుకోవడం కష్టంగానే ఉంది. ‘జాతిరత్నాలు’ తర్వాత పేరున్న హీరోలు, పెద్ద బేనర్లలో రెండు సినిమాలు చేయగలిగాడు కానీ.. ‘ఫంకీ’ తర్వాత అవకాశాలు అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మరి అతణ్ని నమ్మి సినిమా చేసే నిర్మాత, హీరోలు ఎవరో చూడాలి మరి.
This post was last modified on March 9, 2026 5:15 am
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు…
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్…
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ…
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాపే లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరినీ పోల్చడం సబబు కాకపోయినా ఇండస్ట్రీలో…