అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి, తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ‘జాతిరత్నాలు’ సినిమా తీసింది ఈ దర్శకుడే. కామెడీ అంటే ఇలాగే ఉండాలి అనే ఒక మూసను అతను బ్రేక్ చేశాడు. లీడ్ క్యారెక్టర్లను పూర్తి డంబ్గా తీర్చిదిద్ది.. కథాకథనాలను ఏ దశలోనూ సీరియస్గా తీసుకోకుండా.. సీరియస్ అనిపించే సందర్భాల్లోనూ వినోదాన్ని పంచి.. అతను ఆద్యంతం నవ్వులు పంచిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
కానీ అనుదీప్ మెరుపులు ఆ ఒక్క సినిమాకే పరిమితం అయిపోయాయి. తన తర్వాతి చిత్రం ‘ప్రిన్స్’ నిరాశపరిచింది. దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘ఫంకీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనుదీప్కు ఇంకా పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమా మినిమం ప్రభావం చూపకుండా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది.
అనుదీప్ తొలి చిత్రం ‘పిట్టగోడ’ గురించి జనాలకు అస్సలు తెలియదు. మొత్తంగా నాలుగు సినిమాలు తీస్తే మూడు డిజాస్టర్లు అయ్యాయి. ఒక్కటే బాగా ఆడింది. ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ ప్రొడక్షన్లో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ పేరుతో ఇంకో సినిమా కూడా వచ్చింది. అదీ తుస్సుమనిపించింది. ప్రిన్స్, ఫంకీ చిత్రాలు చూస్తే.. అనుదీప్కు వచ్చింది ఒకే స్టైల్ ఆఫ్ కామెడీ.. అది కూడా ఇప్పుడు సేల్ అయ్యేలా లేదనిపిస్తోంది. దీనికి మించి అతనేమీ చేయలేడు అనే ముద్ర పడిపోయింది. నవీన్ పొలిశెట్టి లాంటి స్పెషల్ టాలెంట్ ఉన్న హీరో తప్పితే.. అతడి మార్కు కామెడీని మరో నటుడు పండించలేడేమో అనిపిస్తోంది. ఒకవేళ నవీన్ వచ్చి అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేసినా సరే.. మళ్లీ ‘జాతిరత్నాలు’ స్థాయిలో నవ్వించగలడా అన్నది సందేహమే.
‘జాతిరత్నాలు’ తర్వాత ఒక దశలో రవితేజ లాంటి స్టార్ కూడా అనుదీప్తో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఇప్పుడు ఇంకా చిన్న స్థాయి హీరోలు కూడా వెనుకంజ వేసే పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాతలు దొరకడం కూడా సందేహంగా ఉంది. ఈ దశ నుంచి అనుదీప్ పుంజుకోవడం కష్టంగానే ఉంది. ‘జాతిరత్నాలు’ తర్వాత పేరున్న హీరోలు, పెద్ద బేనర్లలో రెండు సినిమాలు చేయగలిగాడు కానీ.. ‘ఫంకీ’ తర్వాత అవకాశాలు అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మరి అతణ్ని నమ్మి సినిమా చేసే నిర్మాత, హీరోలు ఎవరో చూడాలి మరి.
This post was last modified on March 9, 2026 5:15 am
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…