Political News

వైసీపీలోకి.. జ‌న‌సేన కీల‌క నేత‌.. తూర్పులో ఇబ్బ‌దేనా?

కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. జ‌న‌సేన పార్టీకి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఒక వైపు పార్టీకి సెగ పెడుతోంది. మ‌రోవైపు..పొరు గు పార్టీల నుంచి తీసుకున్న నాయ‌కుల‌కు టికెట్లు ఇవ్వ‌డం మ‌రింత‌గా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో కీల‌క‌ప‌రిణామం చోటు చేసుకుంది. అది కూడా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన నాయ‌కుడు పితాని బాల‌కృష్ణ పార్టీ మారిపోతున్నారు. ఆయ‌న గ‌త రెండు రోజులుగా వైసీపీకి ట‌చ్‌లో ఉన్నారు. అయితే.. ఈ విష‌యం తెలిసి కూడా జ‌న‌సేన నుంచి ఎవ‌రూ సానుభూతి చూప‌లేదు.

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి(కోనసీమ) జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జ‌న‌సేన‌ కోఆర్డినేటర్ గా పితాని బాలకృష్ణ  చాలా కాలం నుంచి ప‌ని చేస్తున్నారు. ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఆయ‌న రూపాయికి వెనుకాడ‌కుండా ఖ‌ర్చు పెట్టారు. గ‌త నెల‌లోనే త‌న ఆస్తులు అమ్మి పార్టీ జెండాలు క‌ట్టించాన‌ని.. త‌న‌కు సీటు ఇస్తార‌న్న ఆశ ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కానీ, ఆయ‌న‌కు టికెట్ రాలేదు. దీంతో కొన్నాళ్లుగా ఆయ‌న పార్టీ అధిష్టానం నుంచి బుజ్జ‌గింపుల కోసం వేచి చూస్తున్నారు. కానీ, పార్టీ నుంచి ఎలాంటి సానుభూతి రాలేదు. పైగా.. ప‌వ‌న్‌కు ఎదురు చెప్ప‌డానికి వీల్లేదంటూ.. ఈయ‌న‌ను ఉద్దేశించే పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింద‌నే ప్ర‌చారం ఉంది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీకి ట‌చ్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా జ‌న‌సేన‌కు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతున్నారు. పితాని బాల‌కృష్ణ వ్య‌క్తిగ‌త ఎలా ఉన్నా.. రాజ‌కీయంగా ఆయ‌న గతంలో వైసీపీలోనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే 2019లో పితానికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో అప్పట్లో ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.  ఆ ఎన్నికల్లో జనసేన నుంచి ఆయ‌న‌కు టికెట్ వ‌చ్చింది. కానీ, వైసీపీ హ‌వాలో ఆయ‌న ఓడిపోయారు.

త‌ర్వాత పార్టీని గెలిపించుకునేందుకు జ‌న‌సేన కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. ఒక్కొక్క‌సారి ఇంటికి కూడా వెళ్ల‌కుండానే ఆయ‌న జ‌న‌సేన కార్యాల‌యంలో ప‌డుకుని మ‌రీ సేవ చేశార‌ని ఆయ‌న అభిమానులు, అనుచ‌రులు చెబుతారు. అయితే.. ఇప్పుడు జనసేన టికెట్ నిరాకరించడంతో మళ్లీ వైసీపీలో చేరబోతున్నారు. జనసేనపై ఆయన ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పవన్ తనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పొత్తులో భాగంగా ముమ్మిడివరం టీడీపీకి వెళ్లింది. దీంతో, రామచంద్రాపురం సీటుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అక్కడ కూడా టికెట్ దక్కక పోవడంతో ఇక‌, పార్టీకి రాం రాం చెప్పారు. బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన పితాని.. రెండు నియోజ‌క‌వ‌ర్గాలు(రామ‌చంద్ర‌పురం, ముమ్మిడి వ‌రం)ల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది.

This post was last modified on March 29, 2024 7:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…

58 minutes ago

ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?

ముంబై పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…

1 hour ago

లెనిన్ అవరోధాలకు బ్రేక్ ఎక్కడ

అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…

2 hours ago

కాపులపై ‘అంబటి’ సెంటిమెంట్ ఎంత?

అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…

2 hours ago

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే…

2 hours ago

యానిమల్ పార్క్… బోల్డెస్ట్ ట్రీట్

యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…

3 hours ago