కాలం కలిసి రావడమంటే ఇలానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఇప్పుడు ఆ యువ నేతకు పట్టం కట్టేందుకు నియోజకవర్గం ప్రజలు రెడీగా ఉన్నారు. అదే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీల అభ్యర్థిగా గంటి మోహన చంద్ర బాలయోగి (జీఎంసీ బాలయోగి) కుమారుడు హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. అయితే..అ ప్పట్లో వైసీపీ హవా, మహిళా నాయకురాలు చింత అనురాధ సెంటిమెంటుతో గంటి వారసుడు గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.
అయితే.. ఇప్పుడు రెండు రకాలుగా మాధుర్కు కాలం కలిసి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు. అయితే.. ఆయన ముందుగానే అస్త్ర శస్త్రాలు వదిలేశారనేటాక్ ఉంది. దీనికి అనేక కారణాలు. ఒకటి ఎలాగైనా అతన్ని కసి తీరా ఓడించాలని జనసైనికులు పట్టుదలగా ఉన్నారు. అలాగే రాపాక తనకు, తనస్థాయికి మించిన సీటుగా ఎంపీసీటును భావిస్తున్నారు. దీంతో ప్రచారంలో ఇంకా స్పీడు అందుకోలేక పోతున్నారు. అంతేకాదు.. నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఇక్కడ ఊపు కనిపించడం లేదు.
ఇంకోవైపు.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్ధి, టీడీపీ నేత గంటి హరీష్మాధూర్ ప్రచారంలో దూకుడు గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతో పాటు అమలాపురంలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు.. జనసేనలో యువతను కలుపుకొని పోతున్నారు. ఇక, సొంత పార్టీ టీడీపీలో అందరూ గంటి వారసుడికే జై కొడుతున్నారు. దీనికి తోడు తండ్రి మరణం తర్వాత.. గంటి కుటుంబం నుంచి రాజకీయంగా ప్రాధాన్యం లభించలేదు.
ఈ నేపథ్యంలో ఈ సారైనా గంటి కుటుంబాన్ని గెలిపించుకుని తీరాలన్న కసి.. ఇక్కడి ప్రజల్లో స్ఫస్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమికి సంబందించి సానుభూతి, జీఎంసీ బాలయోగి కుమారుడు కావడం ఆయనకు కలిసొస్తున్నారు. ఇంకో వైపు జనసేన యూత్ ఓట్లు.. యువ నాయకుడు అనే టాక్ కూడా గంటికి అనుకూలంగా మారాయి. మొత్తంగా చూస్తే.. అమలాపురం స్థానంలో ఈ దఫా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కినట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 29, 2024 3:24 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…