రాజనీతి- ఇటీవల కాలంలో ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. బీజేపీ నేతలు చెబుతున్న మాట. రాజనీ తిని మోడీ బహుబాగా ప్రదర్శిస్తున్నారని వారు డప్పు కొడుతున్నారు. మరి వారు ఏ కాంటెస్టులో చెబుతు న్నారో తెలియదు కానీ.. క్షేత్రస్థాయిలో అయితే.. మాత్రం `రాజనీతి ఇదేనా మోడీ సర్` అనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి. దీనికి కారణం.. కాంగ్రెస్కు బలమైన రాష్ట్రాల్లో ఆ పార్టీని నిర్వీర్యం చేసేందుకు మోడీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఆ పార్టీ నుంచి బలమైన నేతలను నయానో.. భయానో.. తన పార్టీలోకి చేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోం ది. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్న జిందాల్ను ఇటీవల బీజేపీలోకి తీసుకున్నారు. వాస్తవానికి ఆయన బీజేపీకి కడు వ్యతిరేకి. కానీ, తెరచాటున ఆయన వ్యాపారాలను భయపెట్టారో.. లేక ఆయననే భయ పెట్టా రో తెలియదు కానీ.. జిందాల్ను అక్కున చేర్చుకున్నారు. ఇక్కడ వ్యక్తులు టార్గెట్గా కంటే కూడా.. బీజేపీ కాంగ్రెస్ పాలిత లేదా కాంగ్రెస్కు బలమైన రాష్ట్రాలను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది.
కీలకమైన ఎన్నికల సమయంలో 543 పార్లమెంటు స్థానాలకు గాను ఎన్డీయే కూటమి తరఫున 400 స్థానాలు దక్కించుకుని తీరాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రజలను నమ్ముకోవడం అటుంచితే.. ఈ లక్ష్య సాధనకు పార్టీలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుండడం గమనార్హం. మధ్య ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్కు బలం ఉంది. అయితే.. ఇప్పుడు ఇక్కడే `ఆపరేషన్ లోటస్` చేపట్టారు. బీజేపీ అధికారికంగా చెప్పిన వివరాల మేరకు.. ఒక్క మధ్య ప్రదేశ్ నుంచే 16111 మంది కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకున్నారట.
వీరిలో ఒక కేంద్ర మాజీ మంత్రి సహా ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారనిబీజేపీ చెప్పింది. ఇక, పంజాబ్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఈ నెల 21 నుంచి వారంరోజుల్లోనే బీజేపీ 600 మంది కాంగ్రెస్ నేతలను లాగేసుకుంది. ఇది అధికారికంగా బీజేపీ నేతలే చెప్పిన మాట. దీంతో ఒకప్పటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బీజేపీ నేతలు గా మారిపోయారు. నిజానికి పంజాబ్పై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. కనీసం 10 స్థానాల్లో అయినా.. విజయం దక్కించుకోవాలనిలెక్కలు వేసుకుంది. అయితే.. బీజేపీ `ఆపరేషన్ లోటస్`తో ఇక్కడ కాంగ్రెస్ పునాదులు కదిలిపోయాయి. మరి ఇన్ని చేస్తున్న మోడీ.. రాజనీతి ఎలా అవుతుంది? అనేది మేధావుల ప్రశ్న. ఇలాంటి వాటికి మాత్రం బీజేపీ మౌనం పాటిస్తోంది.
This post was last modified on March 29, 2024 2:11 pm
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…