Political News

ఇదేం.. `రాజ‌నీతి` మోడీ స‌ర్‌!

రాజ‌నీతి- ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. బీజేపీ నేత‌లు చెబుతున్న మాట‌. రాజ‌నీ తిని మోడీ బ‌హుబాగా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వారు డ‌ప్పు కొడుతున్నారు. మ‌రి వారు ఏ కాంటెస్టులో చెబుతు న్నారో తెలియ‌దు కానీ.. క్షేత్ర‌స్థాయిలో అయితే.. మాత్రం `రాజ‌నీతి ఇదేనా మోడీ స‌ర్‌` అనే ప్ర‌శ్న‌లే ఎదుర‌వుతున్నాయి. దీనికి కార‌ణం.. కాంగ్రెస్‌కు బ‌ల‌మైన రాష్ట్రాల్లో ఆ పార్టీని నిర్వీర్యం చేసేందుకు మోడీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

ఆ పార్టీ నుంచి బ‌ల‌మైన నేత‌ల‌ను న‌యానో.. భ‌యానో.. త‌న పార్టీలోకి చేర్చుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్‌లో ఉన్న జిందాల్‌ను ఇటీవ‌ల బీజేపీలోకి తీసుకున్నారు. వాస్త‌వానికి ఆయ‌న బీజేపీకి క‌డు వ్య‌తిరేకి. కానీ, తెర‌చాటున ఆయ‌న వ్యాపారాల‌ను భ‌య‌పెట్టారో.. లేక ఆయ‌న‌నే భ‌య పెట్టా రో తెలియ‌దు కానీ.. జిందాల్‌ను అక్కున చేర్చుకున్నారు. ఇక్క‌డ వ్య‌క్తులు టార్గెట్‌గా కంటే కూడా.. బీజేపీ కాంగ్రెస్ పాలిత లేదా కాంగ్రెస్‌కు బ‌ల‌మైన రాష్ట్రాల‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది.

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో 543 పార్ల‌మెంటు స్థానాల‌కు గాను ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున 400 స్థానాలు ద‌క్కించుకుని తీరాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకోవ‌డం అటుంచితే.. ఈ ల‌క్ష్య సాధ‌న‌కు పార్టీల‌ను నిర్వీర్యం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌ధ్య ప్ర‌దేశ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బ‌లం ఉంది. అయితే.. ఇప్పుడు ఇక్క‌డే `ఆప‌రేష‌న్ లోట‌స్‌` చేప‌ట్టారు.  బీజేపీ అధికారికంగా చెప్పిన వివ‌రాల మేర‌కు.. ఒక్క మ‌ధ్య ప్ర‌దేశ్ నుంచే 16111 మంది కాంగ్రెస్ నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకున్నార‌ట‌.

వీరిలో ఒక కేంద్ర మాజీ మంత్రి స‌హా ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నార‌నిబీజేపీ చెప్పింది. ఇక‌, పంజాబ్ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా ఈ నెల 21 నుంచి వారంరోజుల్లోనే బీజేపీ 600 మంది కాంగ్రెస్ నేత‌ల‌ను లాగేసుకుంది. ఇది అధికారికంగా బీజేపీ నేత‌లే చెప్పిన మాట‌. దీంతో ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ నాయ‌కులు ఇప్పుడు బీజేపీ నేత‌లు గా మారిపోయారు. నిజానికి పంజాబ్‌పై కాంగ్రెస్ ఆశ‌లు పెట్టుకుంది. క‌నీసం 10 స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకోవాలనిలెక్క‌లు వేసుకుంది. అయితే.. బీజేపీ `ఆప‌రేష‌న్ లోట‌స్‌`తో ఇక్క‌డ కాంగ్రెస్ పునాదులు క‌దిలిపోయాయి. మ‌రి ఇన్ని చేస్తున్న మోడీ.. రాజ‌నీతి ఎలా అవుతుంది? అనేది మేధావుల ప్ర‌శ్న. ఇలాంటి వాటికి మాత్రం బీజేపీ మౌనం పాటిస్తోంది. 

This post was last modified on March 29, 2024 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

1 hour ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago