Political News

ఇదేం.. `రాజ‌నీతి` మోడీ స‌ర్‌!

రాజ‌నీతి- ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. బీజేపీ నేత‌లు చెబుతున్న మాట‌. రాజ‌నీ తిని మోడీ బ‌హుబాగా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వారు డ‌ప్పు కొడుతున్నారు. మ‌రి వారు ఏ కాంటెస్టులో చెబుతు న్నారో తెలియ‌దు కానీ.. క్షేత్ర‌స్థాయిలో అయితే.. మాత్రం `రాజ‌నీతి ఇదేనా మోడీ స‌ర్‌` అనే ప్ర‌శ్న‌లే ఎదుర‌వుతున్నాయి. దీనికి కార‌ణం.. కాంగ్రెస్‌కు బ‌ల‌మైన రాష్ట్రాల్లో ఆ పార్టీని నిర్వీర్యం చేసేందుకు మోడీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

ఆ పార్టీ నుంచి బ‌ల‌మైన నేత‌ల‌ను న‌యానో.. భ‌యానో.. త‌న పార్టీలోకి చేర్చుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్‌లో ఉన్న జిందాల్‌ను ఇటీవ‌ల బీజేపీలోకి తీసుకున్నారు. వాస్త‌వానికి ఆయ‌న బీజేపీకి క‌డు వ్య‌తిరేకి. కానీ, తెర‌చాటున ఆయ‌న వ్యాపారాల‌ను భ‌య‌పెట్టారో.. లేక ఆయ‌న‌నే భ‌య పెట్టా రో తెలియ‌దు కానీ.. జిందాల్‌ను అక్కున చేర్చుకున్నారు. ఇక్క‌డ వ్య‌క్తులు టార్గెట్‌గా కంటే కూడా.. బీజేపీ కాంగ్రెస్ పాలిత లేదా కాంగ్రెస్‌కు బ‌ల‌మైన రాష్ట్రాల‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది.

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో 543 పార్ల‌మెంటు స్థానాల‌కు గాను ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున 400 స్థానాలు ద‌క్కించుకుని తీరాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకోవ‌డం అటుంచితే.. ఈ ల‌క్ష్య సాధ‌న‌కు పార్టీల‌ను నిర్వీర్యం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌ధ్య ప్ర‌దేశ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బ‌లం ఉంది. అయితే.. ఇప్పుడు ఇక్క‌డే `ఆప‌రేష‌న్ లోట‌స్‌` చేప‌ట్టారు.  బీజేపీ అధికారికంగా చెప్పిన వివ‌రాల మేర‌కు.. ఒక్క మ‌ధ్య ప్ర‌దేశ్ నుంచే 16111 మంది కాంగ్రెస్ నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకున్నార‌ట‌.

వీరిలో ఒక కేంద్ర మాజీ మంత్రి స‌హా ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నార‌నిబీజేపీ చెప్పింది. ఇక‌, పంజాబ్ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా ఈ నెల 21 నుంచి వారంరోజుల్లోనే బీజేపీ 600 మంది కాంగ్రెస్ నేత‌ల‌ను లాగేసుకుంది. ఇది అధికారికంగా బీజేపీ నేత‌లే చెప్పిన మాట‌. దీంతో ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ నాయ‌కులు ఇప్పుడు బీజేపీ నేత‌లు గా మారిపోయారు. నిజానికి పంజాబ్‌పై కాంగ్రెస్ ఆశ‌లు పెట్టుకుంది. క‌నీసం 10 స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకోవాలనిలెక్క‌లు వేసుకుంది. అయితే.. బీజేపీ `ఆప‌రేష‌న్ లోట‌స్‌`తో ఇక్క‌డ కాంగ్రెస్ పునాదులు క‌దిలిపోయాయి. మ‌రి ఇన్ని చేస్తున్న మోడీ.. రాజ‌నీతి ఎలా అవుతుంది? అనేది మేధావుల ప్ర‌శ్న. ఇలాంటి వాటికి మాత్రం బీజేపీ మౌనం పాటిస్తోంది. 

Satya

Recent Posts

అమ్మ సెంటిమెంట్ జాన్వీకి కలిసొస్తుందా

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…

35 minutes ago

ఆంధ్రాలో కుల భావన ఉంది… ‘నా ఆంధ్రా’ భావన లేదు: పవన్

అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…

1 hour ago

బాబు స్పందించారు… మిగిలింది ఇక రేవంతే!

పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…

2 hours ago

అమెరికాలో భారత జెండా చించివేత… కౌంటరిస్తున్న ఎన్నారైలు!

టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…

2 hours ago

అల్లు అర్జున్ 23… ఇబ్బందేం లేదు!

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న ప్రచారం అల్లు అర్జున్ 23 క్యాన్సిల్ కావొచ్చని. దానికి తగ్గట్టే…

3 hours ago

ఔను… ర‌జినీ సినిమాకు మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు మారాడు

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఒక సినిమా తీయాల‌ని ఏడాది కింద‌ట్నుంచి ప్ర‌య‌త్నాలు…

3 hours ago