Political News

ముఖ్యమంత్రి లాకప్ పాలన షురూ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ చేత అరెస్టు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనదైన తీరును ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనా అరెస్టు అయినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న అంశం రాజ్యాంగంలో లేని నేపథ్యంలో తాను జైలు నుంచే పాలన చేస్తానంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ నిర్ణయం తర్వాత ఇది సాధ్యమా? అంటూ నిబంధనల్ని సరి చూడగా.. సాధ్యమేనన్న సమాధానం వచ్చింది.

ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన కస్టడీ నుంచే తన పాలనను షురూ చేశారు.ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. జైలు నుంచి పాలనకు కాస్త భిన్నంగా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయన లాకప్ పాలన షురూ చేశారని చెప్పాలి. ఢిల్లీ మద్యం స్కాంలో విచారణకు తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు పంపింది. అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం వాటికి స్పందించలేదు.

ఈ నేపథ్యంలో ఆయన్ను మార్చి 21న అరెస్టు చేయటం.. అనంతరం ఆయన్ను కస్టడీలోకి తీసుకోవటం తెలిసిందే. అరెస్టు వేళలోనే ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చగా ఆయనకు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్.. తాను జైలు నుంచి పాలన చేస్తానని పేర్కొన్నారు.

తాను కనుక అరెస్టు అయితే.. జైలు నుంచి పాలన సాగించేందుకు ఏ చట్టమూ తమను అడ్డుకోలేదన్న కేజ్రీవాల్.. అందుకు తగ్గట్లే చేతల్లో చూపిస్తున్నారు. ఆయనపై చేసిన ఆరోపణలు రుజువు కాలేదని.. అందుకే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నట్లుగా కేజ్రీ మంత్రివర్గంలోని మంత్రి అతిశీ మార్లీనా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఈడీ లాకప్ నుంచి ముఖ్యమంత్రి హోదాలో తొలి ఆదేశాన్ని జారీ చేసినట్లు చెబుతున్నా.. అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఉమేశ్ సైగల్ మాట్లాడుతూ.. జైలు నుంచి ముఖ్యమంత్రి పాలన సాగించటం సాధ్యం కాదని పేర్కొన్నారు. జైలు మాన్యువల్ ప్రకారం ఒక వ్యక్తి జైలు లోపల నుంచి ప్రభుత్వాన్ని నడపటానికి అనుమతించదని స్పష్టం చేసిన నేపథ్యంలో తర్వాతి రోజుల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on March 24, 2024 10:05 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రాష్ట్రానికి చ‌రిత్రాత్మ‌క రోజు:  చంద్ర‌బాబు

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్రానికి…

5 hours ago

ఏపీలో అశాంతి రేపిన ప్ర‌శాంత ఎన్నిక‌లు!

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు(అసెంబ్లీ+పార్ల‌మెంటు) ప్ర‌శాంతంగా జ‌రిగాయ‌ని ఎన్నిక‌లు సంఘం చెబుతోంది. అయితే.. ప్ర‌శాంతత కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. జిల్లాల‌కు మాత్ర‌మే…

5 hours ago

మళ్లీ వివరణ ఇచ్చుకున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…

5 hours ago

ఎమ్మెల్యే-చెంపదెబ్బ.. నేషనల్ ట్రెండింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…

5 hours ago

పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…

10 hours ago

జైలుకు వెళ్ల‌కుండా మీరే న‌న్ను కాపాడాలి:  కేజ్రీవాల్‌

కీల‌క‌మైన నాలుగోద‌శ ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవా ల్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.…

11 hours ago