Political News

వ‌సంత రాజ‌కీయం అద‌ర‌హో!

తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ మూడో అభ్య‌ర్థుల జాబితాలో మాజీ మంత్రి, సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్ర‌బాబు షాక్ ఇచ్చారు. ఆయ‌న ఊహించ‌ని విధంగా నిర్ణ‌యం తీసుకున్నారు. మైలవరం సీటును ఉమాకు క‌ర‌డు గ‌ట్టిన ప్రత్యిర్థిగా ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. ఈ మధ్యే వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. దీంతో దేవినేని ఉమాకు సీటు లేనట్లయింది. అయితే.. వ‌సంత కూడా టీడీపీకి కొత్త‌కాదు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం టికెట్ కోసమే ఆయ‌న వైసీపీలో చేరారు.

అప్ప‌ట్లో వైసీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కించుకుని పోటీ చేశారు. విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో వైసీపీ ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించింది. దీంతో టీడీపీలోకి వెళ్లి టికెట్ ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవినేని ఉమ.. నాలుగు సార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన నేత‌ను త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారు. గ‌త ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ చేతిలో దేవినేని ఉమా.. ఓటమి పాలయ్యారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ ద‌ఫా అయినా గెలిచి స‌త్తా చాటాల‌ని అనుకున్నారు.

ఇంత‌లోనే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీ గూటికి చేరడం.. ఈ సారి టికెట్‌ ఆయనకే దక్కుతుందనే ప్రచారం సాగుతోన్న తరుణంలో.. మైలవరం కాకపోయినా.. పెనమలూరు టికెట్ వస్తుందని దేవినేని ఉమ వర్గం భావించింది. కానీ, నాకు సీటు ఇవ్వా్ల్సిందే.. లేదంటే.. చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటూ బోడే ప్రసాద్ రాజ‌కీయ యాగీకి దిగారు. దీంతో.. చివరకు పెనమలూరు టికెట్‌ను బోడే ప్రసాద్‌కే ఇచ్చారు. ఇక, మైలవరం చేజారిపోవడమే కాదు.. ఆశించిన పెనమలూరు టికెట్‌ కూడా దేనినేని ఉమామహేశ్వరరావుకు రాకుండా పోయింది.

తాజా జాబితాలో మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు చోటు లభిచింది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థు లను టీడీపీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టికెట్ దక్కించుకున్నారు. ఇటీవలే ఆయన వై సీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ మైలవరం టికెట్ దక్కించుకున్నసందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ అధినేత నారా చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు.

“నాపై నమ్మకం ఉంచి మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ సీటు కేటాయించిన చంద్రబాబుకి ధన్యవాదాలు. మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరెలా నియోజకవర్గంలోని ప్రతిఒక్క నాయకుడిని, కార్యకర్తలను సమన్వయపరుస్తూ నా ప్రయాణం కొనసాగిస్తా” అని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇదంతా ఓకే మ‌రి దేవినేని మాటేంటి? అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఎందుకంటే.. సీనియ‌ర్ నాయ‌కుడు.. పైగా చంద్ర‌బాబుకు అత్యంత విధేయ‌తగా ఉన్న కుటుంబం కూడా. మ‌రి ఇలాంటి నాయ‌కుడిని ప‌క్క‌న పెట్ట‌డం భావ్యం కాద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 23, 2024 8:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

52 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago