రెండు నెలలు.. కేవలం రెండే నెలలు.. కానీ, ఇద్దరు ముఖ్యమంత్రుల అరెస్టు. ఇదేమీ ఆషామాషీ కాదు. అత్యంత భయంకరమైన కేసులు కూడా లేవు. అయినా.. టార్గెట్ స్టేట్స్. అందుకే.. ఇద్దరు ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి అరెస్టు చేశారు. వీరిలో ఒకరు యువ నాయకుడు, గిరిజన నేత జార్ఖండ్ అప్పటి ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్. ఇక, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్. ఈ ఇద్దరి అరెస్టూ.. యాదృచ్ఛికం కాదు.. బలమైన కేసులు.. నేరాలు కూడా జరిగిపోయినవి కాదు.. వారి చేతులు రక్తంతోనూ తడిచిపోలేదు.
అయినా అరెస్టు అయ్యారు. దీనికి కారణం.. బీజేపీతో మిలాఖత్ కాకపోవడమే. అది 2023, డిసెంబరు 3వ తేదీ.. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఓ సభలో మాట్లాడి బయటకు వచ్చారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి వర్గంలోని జార్ఖండ్కు చెందిన నాయకుడు ఒకరు ఆయనకు ఫోన్ చేశారు. మీరు మేం కలిసిపోదాం.. మాకు మీ మద్దతు ఇవ్వండి.. అని ఆయన అడగలేదు. “మీరు ఇండియా కూటమిలో ఉన్నారు. ఈ ప్రయత్నాలు విరమించుకోండి. మాతో చేతులు కలపొద్దు. కానీ, ఇండియాలో చేరద్దు” అని చెప్పారు.
కట్ చేస్తే.. రెండు రోజుల తర్వాత.. ఇదే విషయాన్ని హేమంత్ మీడియాకు చెప్పేశారు. అంతే.. ఆ మర్నాడు నుంచి ఆయనకు ఈడీ ప్రజర్ ప్రారంభమైంది. ఎప్పుడో ఎక్కడో జరిగిన గనుల కేసులో నీ ప్రమేయం ఉందంటూ.. ఈడీ అధికారులు ఆయనపై ఒత్తిడి చేశారు. అయితే.. తన ప్రమేయం లేకుండానే జరిగిందని ఆయన చెప్పారు. అయినా వినలేదు. చివరకు అరెస్టు చేశారు. కారణం ఇండియా కూటమికి జై కొట్టడమే.
ఇక, కేజ్రీవాల్ విషయానికి వస్తే.. ఆయనకు లిక్కర్ కేసులో ప్రమేయం లేదు. ఆయన ముడుపులు కూడా తీసుకోలేదు. తీసుకున్నవారిని కూడా ఆయన ప్రోత్సహించినట్టు రుజువు కూడా లేదు. కానీ, ఆయన అరెస్టయ్యారు. దీనికి కారణం.. ఆయనే స్వయంగా చెప్పారు. “మమ్మల్ని బీజేపీతో కలిసిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు. బీజేపీతో కలిస్తే కేసులు లేకుండా చూస్తామని చెబుతున్నారు” అని వారం కిందట కూడా పదే పదే ఆయన చెప్పారు. అంతేకాదు.. ఇండియా కూటమిలో చేరద్దొని బెదిరింపులు కూడా వచ్చాయన్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు అరెస్టయ్యారు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?! కేసులు నిజమా? రాజకీయం నిజమా?!!
This post was last modified on March 22, 2024 7:44 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…