ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు.. చేతులు కలిపిన విషయం తెలిసిందే. బీజేపీతో కలిసి ఉమ్మడిగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు టికెట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక, ఇప్పుడు ప్రచారం, ఎన్నికల వ్యూహాలలో ఎలా ముందుకు సాగాలనే విషయంపైనా ఇరు పార్టీలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చాయి.
ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించాయి. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నా ఇరువురు నాయకులు చర్చించారు. తాజాగా హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్.. సుదీర్ఘంగా రెండు గంటల పాటు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని ఇరువురు నిర్ణయించారు.
ఎన్నికలకు 50 రోజుల సమయం ఉండడంతో సాధ్యమైనంత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు జరిపారు. మరిన్ని ప్రజాగళం సభలు నిర్వహించడంపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. వారానికి ఒక ప్రజాగళం సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు మంచి స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇలాంటి సభలను వారానికి ఒకటి చొప్పున నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇక, ఉమ్మడిగా ప్రచారం చేసే అంశంపైనా చంద్రబాబు-పవన్లు ఒక ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి పొత్తులో జనసేనకు 21 స్థానాలే ఇచ్చినా.. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఇమేజ్ను వినియోగించుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. ఈ క్రమంలో ఒకవైపు జనసేన టికెట్లు పొందిన వారి పక్షాన ప్రచారం చేస్తూనే మరోవైపు.. పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ అభ్యర్థుల పక్షాన కూడా ప్రచారం చేయనున్నారు. మొత్తంగా ఈ సమావేశంలో ప్రచారంపై ఎక్కడా దృష్టి పెట్టారు.
This post was last modified on March 21, 2024 5:26 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…