ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు.. చేతులు కలిపిన విషయం తెలిసిందే. బీజేపీతో కలిసి ఉమ్మడిగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు టికెట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక, ఇప్పుడు ప్రచారం, ఎన్నికల వ్యూహాలలో ఎలా ముందుకు సాగాలనే విషయంపైనా ఇరు పార్టీలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చాయి.
ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించాయి. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నా ఇరువురు నాయకులు చర్చించారు. తాజాగా హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్.. సుదీర్ఘంగా రెండు గంటల పాటు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని ఇరువురు నిర్ణయించారు.
ఎన్నికలకు 50 రోజుల సమయం ఉండడంతో సాధ్యమైనంత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు జరిపారు. మరిన్ని ప్రజాగళం సభలు నిర్వహించడంపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. వారానికి ఒక ప్రజాగళం సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు మంచి స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇలాంటి సభలను వారానికి ఒకటి చొప్పున నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇక, ఉమ్మడిగా ప్రచారం చేసే అంశంపైనా చంద్రబాబు-పవన్లు ఒక ప్లాన్ చేసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి పొత్తులో జనసేనకు 21 స్థానాలే ఇచ్చినా.. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఇమేజ్ను వినియోగించుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. ఈ క్రమంలో ఒకవైపు జనసేన టికెట్లు పొందిన వారి పక్షాన ప్రచారం చేస్తూనే మరోవైపు.. పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ అభ్యర్థుల పక్షాన కూడా ప్రచారం చేయనున్నారు. మొత్తంగా ఈ సమావేశంలో ప్రచారంపై ఎక్కడా దృష్టి పెట్టారు.
This post was last modified on March 21, 2024 5:26 pm
పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై…
అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…
వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…
రేపు విడుదల కాబోతున్న పాపం ప్రతాప్ కు టైటిల్ కు తగ్గట్టే చివరి నిమిషం వరకు అయ్యో పాపం అనిపించే…
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను పునర్విభజించే డీలిమిటేషన్, అదేసమయంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే 2023నాటి నారీ…
గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి…