Political News

మోడీతో ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ర‌హ‌స్య భేటీ!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ర‌హ‌స్యంగా భేటీ అయ్యారా?  ఆయ న‌తో 15 నిమిషాల‌పాటు హెలీ ప్యాడ్ వ‌ద్దే నిల‌బ‌డి చ‌ర్చించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ప‌ల్నాడు జిల్లాలో ని చిల‌క‌లూరిపేట‌లో ఉన్న బొప్పూడి వ‌ద్ద టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి సంయుక్తంగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ అనంత‌రం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన వాహ‌న శ్రేణి పార్కింగ్ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

అయితే.. మోడీని గౌర‌వ ప్ర‌దంగా సాగ‌నంపే ఉద్దేశంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు కూడా ఆయ‌న‌ను అనుస‌రించారు. కొద్ది దూరం మోడీని అనుస‌రించారు. ఇంత‌లో అధికారులు ఆయ‌న చుట్టూ చేరారు. దీంతో ప్ర‌త్యేక వాహ‌న శ్రేణి పార్కింగ్ చేసిన ప్ర‌దేశానికి ప‌ది అడుగుల దూరంలోనే చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఆగిపోయారు. అయితే.. కొద్ది దూరం ముందుకు న‌డిచిన మోడీ తిరిగి వెన‌క్కి చూసి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఏరి.. అన్న‌ట్టుగా వెతికారు. మోడీని కాస్త దూరం నుంచి గ‌మ‌నిస్తున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఆయ‌న చెంత‌కు చేరుకున్నారు.

ఈ క్ర‌మంలో త‌న సిబ్బందిని కొంత దూరం ఉండ‌మ‌ని క‌నుసైగ చేసిన ప్ర‌ధాని మోడీ.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల‌తో ప్ర‌త్యేకంగా ప‌దిహేను నిమిషాల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. సభ బాగా జరిగిందని…ప్రజల్లో చాలా ఉత్సాహం ఉందని వ్యాఖ్యానించిన ప్రధాని ఎన్డిఎ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుందని అభిప్రాయ పడినట్టు టీడీపీ వ‌ర్గాలు చెప్పాయి. అదేవిధంగా చంద్రబాబు అరెస్టు ఘటనపైనా, ఆయన ఆరోగ్యం పైనా టీడీపీ అధినేత తో మోడీ మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి చంద్రబాబు, పవన్ వివ‌రించిన‌ట్టు తెలిసింది. రాష్ట్రంలో వ్యవస్థల‌ విధ్వంసంపై  పలు అంశాలు ఉదహరిస్తూ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన ఇరువురు నేతలు ఒక నివేదిక‌ను కూడా ఆయ‌న చేతిలో పెట్టార‌ని పార్టీ వ‌ర్గాలు చెప్పాయి. 

This post was last modified on March 18, 2024 6:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

8 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

23 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago