ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు రహస్యంగా భేటీ అయ్యారా? ఆయ నతో 15 నిమిషాలపాటు హెలీ ప్యాడ్ వద్దే నిలబడి చర్చించారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. పల్నాడు జిల్లాలో ని చిలకలూరిపేటలో ఉన్న బొప్పూడి వద్ద టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సంయుక్తంగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభ అనంతరం.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహన శ్రేణి పార్కింగ్ వద్దకు చేరుకున్నారు.
అయితే.. మోడీని గౌరవ ప్రదంగా సాగనంపే ఉద్దేశంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా ఆయనను అనుసరించారు. కొద్ది దూరం మోడీని అనుసరించారు. ఇంతలో అధికారులు ఆయన చుట్టూ చేరారు. దీంతో ప్రత్యేక వాహన శ్రేణి పార్కింగ్ చేసిన ప్రదేశానికి పది అడుగుల దూరంలోనే చంద్రబాబు, పవన్ ఆగిపోయారు. అయితే.. కొద్ది దూరం ముందుకు నడిచిన మోడీ తిరిగి వెనక్కి చూసి.. చంద్రబాబు, పవన్లు ఏరి.. అన్నట్టుగా వెతికారు. మోడీని కాస్త దూరం నుంచి గమనిస్తున్న చంద్రబాబు, పవన్ ఆయన చెంతకు చేరుకున్నారు.
ఈ క్రమంలో తన సిబ్బందిని కొంత దూరం ఉండమని కనుసైగ చేసిన ప్రధాని మోడీ.. చంద్రబాబు, పవన్లతో ప్రత్యేకంగా పదిహేను నిమిషాల పాటు చర్చలు జరిపారు. సభ బాగా జరిగిందని…ప్రజల్లో చాలా ఉత్సాహం ఉందని వ్యాఖ్యానించిన ప్రధాని ఎన్డిఎ కూటమి గ్రాండ్ సక్సెస్ అవుతుందని అభిప్రాయ పడినట్టు టీడీపీ వర్గాలు చెప్పాయి. అదేవిధంగా చంద్రబాబు అరెస్టు ఘటనపైనా, ఆయన ఆరోగ్యం పైనా టీడీపీ అధినేత తో మోడీ మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి చంద్రబాబు, పవన్ వివరించినట్టు తెలిసింది. రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసంపై పలు అంశాలు ఉదహరిస్తూ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన ఇరువురు నేతలు ఒక నివేదికను కూడా ఆయన చేతిలో పెట్టారని పార్టీ వర్గాలు చెప్పాయి.
This post was last modified on March 18, 2024 6:50 am
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…