ఏపీలో త్వరలో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుని పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్తంగా తొలి సభకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఉమ్మడి సభను అదిరిపోయేలా నిర్వహించా లని ప్లాన్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి.. టీడీపీ, జనసేన సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ భూమి పూజ చేసి.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మూడు పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు ‘ప్రజాగళం’ అని నామకరణం చేశారు. తాజాగా ఈ సభ లోగో/పోస్టర్ను విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోడీ, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండడాన్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ప్రజాగళం సభ ద్వారా మోడీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు. లక్షలాది మంది వస్తారన్న అంచనాల నేపథ్యంలో 100కి పైగా ఎకరాల్లో ఈ సభ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో 13 కమిటీలు ఈ సభా నిర్వహణలో పాలుపంచుకున్నాయి.
కాగా, ఈ పోస్టర్పై “లక్షలాదిగా తరలి రండి.. ఆంధ్రప్రదేశ్నుపునర్నిర్మించుకుందాం.. విధ్వంసం నుంచి వికాసానికి అడుగేద్దాం“ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. సుమారు 10లక్షల మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు(మూడు పార్టీలు) వస్తారని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన సభా ప్రాంగణాన్ని విశాలంగా తీర్చి దిద్దడంతోపాటు.. ప్రతి రెండు మీటర్ల దూరానికి ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. సభకు ముందు కూర్చునేందుకు లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా వెయ్యి కి పైగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాలరీలో 5 నుంచి పది వేల మంది నిలబడేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా వచ్చిన వారికి తాగునీరు విస్తృతంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మజ్జిగ ప్యాకట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఈ సభకు సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అంచనా.
This post was last modified on March 16, 2024 7:29 am
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…