Political News

ముగ్గురు మొనగాళ్ళు `ప్ర‌జాగ‌ళం`:  పోస్ట‌ర్ విడుద‌ల‌

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుని పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్తంగా తొలి స‌భ‌కు శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఉమ్మడి సభను అదిరిపోయేలా నిర్వ‌హించా ల‌ని ప్లాన్ చేశారు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి.. టీడీపీ, జ‌న‌సేన సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.  టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ భూమి పూజ చేసి.. కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

మూడు పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు ‘ప్రజాగళం’ అని నామకరణం చేశారు. తాజాగా ఈ సభ లోగో/పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోడీ, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండడాన్ని ఈ పోస్ట‌ర్‌లో చూడొచ్చు. ప్రజాగళం సభ ద్వారా మోడీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు. లక్షలాది మంది వస్తారన్న అంచనాల నేపథ్యంలో 100కి పైగా ఎకరాల్లో ఈ సభ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నేతృత్వంలో 13 కమిటీలు ఈ సభా నిర్వహణలో పాలుపంచుకున్నాయి.

కాగా, ఈ పోస్ట‌ర్‌పై “ల‌క్ష‌లాదిగా త‌ర‌లి రండి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌నుపున‌ర్నిర్మించుకుందాం.. విధ్వంసం నుంచి వికాసానికి అడుగేద్దాం“ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. సుమారు 10ల‌క్ష‌ల మంది అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు(మూడు పార్టీలు) వ‌స్తార‌ని అంచ‌నా వేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన స‌భా ప్రాంగ‌ణాన్ని విశాలంగా తీర్చి దిద్ద‌డంతోపాటు.. ప్ర‌తి రెండు మీట‌ర్ల దూరానికి ఎల్ ఈడీ స్క్రీన్ల‌ను ఏర్పాటు చేశారు. స‌భ‌కు ముందు కూర్చునేందుకు ల‌క్ష‌కు పైగా కుర్చీల‌ను ఏర్పాటు చేశారు.

అదేవిధంగా వెయ్యి కి పైగా గ్యాల‌రీల‌ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాల‌రీలో 5 నుంచి ప‌ది వేల మంది నిల‌బ‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా వ‌చ్చిన వారికి  తాగునీరు విస్తృతంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మ‌జ్జిగ ప్యాక‌ట్ల‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ స‌భ‌కు సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని అంచ‌నా.

This post was last modified on March 16, 2024 7:29 am

Share
Show comments
Published by
Satya
Tags: Praja Galam

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago