Political News

ముగ్గురు మొనగాళ్ళు `ప్ర‌జాగ‌ళం`:  పోస్ట‌ర్ విడుద‌ల‌

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుని పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్తంగా తొలి స‌భ‌కు శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఉమ్మడి సభను అదిరిపోయేలా నిర్వ‌హించా ల‌ని ప్లాన్ చేశారు. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి.. టీడీపీ, జ‌న‌సేన సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.  టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ భూమి పూజ చేసి.. కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

మూడు పార్టీలు ఏర్పాటు చేసిన ఈ సభకు ‘ప్రజాగళం’ అని నామకరణం చేశారు. తాజాగా ఈ సభ లోగో/పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. మధ్యలో ప్రధాని మోడీ, ఆయనకు ఇరువైపులా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండడాన్ని ఈ పోస్ట‌ర్‌లో చూడొచ్చు. ప్రజాగళం సభ ద్వారా మోడీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపైకి రానున్నారు. లక్షలాది మంది వస్తారన్న అంచనాల నేపథ్యంలో 100కి పైగా ఎకరాల్లో ఈ సభ ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నేతృత్వంలో 13 కమిటీలు ఈ సభా నిర్వహణలో పాలుపంచుకున్నాయి.

కాగా, ఈ పోస్ట‌ర్‌పై “ల‌క్ష‌లాదిగా త‌ర‌లి రండి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌నుపున‌ర్నిర్మించుకుందాం.. విధ్వంసం నుంచి వికాసానికి అడుగేద్దాం“ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. సుమారు 10ల‌క్ష‌ల మంది అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు(మూడు పార్టీలు) వ‌స్తార‌ని అంచ‌నా వేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన స‌భా ప్రాంగ‌ణాన్ని విశాలంగా తీర్చి దిద్ద‌డంతోపాటు.. ప్ర‌తి రెండు మీట‌ర్ల దూరానికి ఎల్ ఈడీ స్క్రీన్ల‌ను ఏర్పాటు చేశారు. స‌భ‌కు ముందు కూర్చునేందుకు ల‌క్ష‌కు పైగా కుర్చీల‌ను ఏర్పాటు చేశారు.

అదేవిధంగా వెయ్యి కి పైగా గ్యాల‌రీల‌ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాల‌రీలో 5 నుంచి ప‌ది వేల మంది నిల‌బ‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. అదేవిధంగా వ‌చ్చిన వారికి  తాగునీరు విస్తృతంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మ‌జ్జిగ ప్యాక‌ట్ల‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ స‌భ‌కు సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని అంచ‌నా.

This post was last modified on March 16, 2024 7:29 am

Share
Show comments
Published by
Satya
Tags: Praja Galam

Recent Posts

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 minutes ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

1 hour ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

1 hour ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

2 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

2 hours ago

మే 1 కోసం కొత్త సినిమాల కొట్లాట

ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…

4 hours ago