పొత్తు ధర్మం మంచిదే. అయితే.. ఈ పొత్తులోనూ అవతలి పక్షం ఏమాత్రం కష్టపడకుండానే గెలిచేలా చేస్తే.. అది పొత్తు ధర్మం కింద రాదని అంటున్నారు బీఆర్ ఎస్ నాయకులు. కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇలానే చేశారు. బీఎస్పీతో చేతులుకలిపిన కేసీఆర్.. రెండు పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. వీటిలో ఒకటి నాగర్ కర్నూల్. రెండోది హైదరాబాద్. సరే.. హైదరాబాద్ అంటే.. ఎంఐఎంకే హవా ఉంటుంది కాబట్టి.. ఇక్కడ ఎవరు పోటీ చేసినా.. కష్టపడాలి. పడినా గెలుస్తారనే ఛాయిస్ తక్కువే.
కానీ, కీలకమైన నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గాన్ని కేసీఆర్ వదులు కోవడం అంటే.. గెలుపు ను బంగారపు పళ్లెంలో పెట్టి అందించడమేనని అంటున్నారు నాయకులు. నాగర్ కర్నూలు నియోజకవర్గం.. బీఆర్ఎస్కు కంచుకోట. 2014లో కేవలం 8 వేల ఓట్లతేడాతో ఓడిపోయినా.. 2019 ఎన్నికల్లో మాత్రం ఏకంగా లక్షా 40 వేల ఓట్ల తేడాతో విజయం దక్కించుకుంది. ఇక్కడ నుంచి పోతుగంటి రాములు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
దీంతో ఆయన పోయి బీజేపీలో చేరారు. ఈయన కుమారుడు పోతుగంటి భరత్కు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇంత బలమైన నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ అధినేత బీఎస్పీకి ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర చీఫ్, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ పోటీచేయనున్నారు. ఆయన గెలుపు పక్కా అనే టాక్ వినిపిస్తోంది. కానీ, కేసీఆర్ నిర్ణయంపై పార్టీ నాయకులు మాత్రం అసంతృప్తితోనే తలలూపారు.
కట్ చేస్తే.. ఇప్పటి వరకు బీఆర్ఎస్.. చేవెళ్ల- కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్- కడియం కావ్య, జహీరాబాద్- గాలి అనిల్కుమార్ , నిజామాబాద్- బాజిరెడ్డి గోరవర్ధన్ రెడ్డి, ఖమ్మం- నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్- మాలోత్ కవిత, కరీంనగర్- బోయినపల్లి వినోద్కుమార్, పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్, మహబూబ్నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి, మల్కాజ్గిరి- రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్- ఆత్రం సక్కులకు కేసీఆర్ టికెట్లు కేటాయించారు. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…