ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ముఖ్యమంత్రి, అధికార వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కుటుంబ సభ్యుల మాటల దాడి తీవ్రమవుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యులు జగన్ అండ్ కో మీదే వేళ్లెత్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.
వివేకా తనయురాలు సునీత.. తన తండ్రి హత్యలో జగన్, అవినాష్ రెడ్డి తదితరుల మీద తీవ్ర ఆరోపణలే చేశారు. తాజాగా వివేకా భార్య సౌభాగ్యమ్మ సైతం ఈ కేసులో జగన్ ప్రమేయం గురించి మాట్లాడుతూ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా జగన్ సోదరి వైఎస్ షర్మిళ.. తన అన్న మీద తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేసింది.
వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన స్మారక సభలో తన అన్నకు తగిలేలా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిళ. ‘‘హంతకులు ఎవరో కాదు.. కుటుంబ సభ్యులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా వాళ్ల మీదే నిందలు వేస్తారా? ఇప్పటి వరకు హత్య చేసిన వారికి శిక్ష పడలేదు. చిన్నాన్న చివరి క్షణం వరకు వైసీపీ కోసమే పని చేశారు. కానీ ఆయన్ని చంపడమే కాక వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.
సాక్షి పత్రికలో పైన వైఎస్ ఫొటో ఉంటుంది. కింద ఆయన తమ్ముడి మీద, ఆయన కుటుంబం మీద వ్యక్తిత్వ హననం జరుగుతుంటుంది. జగనన్నా ఒక్కసారి మీరు అద్దం ముందు నిల్చుని ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. రాజశేఖర్ రెడ్డి గారు తన తోబుట్టువుల కోసం ఎంతో చేశారు. కానీ ఆయన వారసుడిగా మీరేం చేశారు’’ అని షర్మిళ ప్రశ్నించారు.
This post was last modified on March 15, 2024 4:08 pm
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…