Political News

వివేకా భార్య సంచలన వీడియో

“మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. అయితే, ఈ విష‌యం మేం గ్ర‌హించ‌లేక పోయాం” అని దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ తాజాగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. వివేకానంద‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించార‌ని.. త‌ర్వాత ప‌క్క‌కు పెట్టేశార‌ని ఆమె తెలిపారు. అయితే.. ఇలా జ‌రుగుతుంద‌ని కానీ, ఇలా చేస్తార‌ని కానీ.. తాము ఊహించ‌లేక పోయామ‌ని సౌభాగ్య‌మ్మ వ్యాఖ్యానించారు.

“ఎవ‌రెవ‌రి మ‌న‌సులో ఏముందో గ్ర‌హించ‌లేక‌పోయాం. కానీ, చాలా బాధేస్తుంది. మా ఇంట్లోనే మాకు శ‌త్రు వులు ఉన్నారంటే!” అని సౌభాగ్య‌మ్మ తెలిపారు. గ‌త 2019 మార్చి 15న వివేకానంద‌రెడ్డిని ఆయ‌న ఇంట్లోనే దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. దీనిని తొలుత గుండె పోటుగా ప్ర‌చారం చేశారు. త‌ర్వాత‌.. ఇది దారుణ హ‌త్య అని తెలిసింది. అంతేకాదు.. దీని వెనుక ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర‌రెడ్డిల పాత్ర ఉంద‌ని సీబీఐ అధికారులు కూడా తేల్చారు.

అంతేకాదు.. అనేక సంద‌ర్భాల్లో ఎంపీ అవినాష్‌ను విచారించారు. ఇక‌, ఆయ‌న బెయిల్ తెచ్చుకుని బ‌య‌ట తిరుగుతున్నారు. ఇదిలావుంటే, ఈ కేసులో స‌హ‌క‌రించాల‌ని వివేకా కుటుంబం.. సీఎం జ‌గ‌న్‌ను అభ్య‌ర్థించిన విష‌యం తెలిసిందే. సొంత చిన్నాన్న కావ‌డంతో ఆయ‌న స‌హ‌క‌రిస్తార‌ని ఆశ‌లు కూడా పెట్టుకుంది. కానీ, ఆయ‌న నిందితుల‌ను కాపాడుతున్నార‌నే వాద‌న వివేకా కుటుంబానికి చాలా లేటుగా తెలిసిన‌ట్టు ఇటీవ‌ల వివేకా కుమార్తె సునీత కూడా ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని జ‌గ‌న్ అన్న ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. ఈ కేసులో నిందితుడు ఫ‌లానా వ్య‌క్తి అని తెలిసి(ఎంపీ అవినాష్) కూడా జ‌గ‌న్ త‌ప్పించుకున్నార‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగాఅంద‌రూ క‌లిసి త‌న తండ్రిని దారుణంగా చంపేశార‌ని సునీత వ్యాఖ్యానించారు. దీనిపై ఆమె ప్ర‌స్తుతం న్యాయ‌పోరాటం చేస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లుగా మీడియా ముందుకు రాని సౌభాగ్య‌మ్మ‌.. వివేకా ఐదో వ‌ర్థంతి నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇంట్లోనే త‌మ‌కు శ‌త్రువులు ఉన్నార‌ని ప‌రోక్షంగా పలువురిని ఉద్దేశించి వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

2 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

4 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago