Political News

వివేకా భార్య సంచలన వీడియో

“మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. అయితే, ఈ విష‌యం మేం గ్ర‌హించ‌లేక పోయాం” అని దివంగ‌త వైఎస్ వివేకానంద‌రెడ్డి స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ తాజాగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. వివేకానంద‌రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించార‌ని.. త‌ర్వాత ప‌క్క‌కు పెట్టేశార‌ని ఆమె తెలిపారు. అయితే.. ఇలా జ‌రుగుతుంద‌ని కానీ, ఇలా చేస్తార‌ని కానీ.. తాము ఊహించ‌లేక పోయామ‌ని సౌభాగ్య‌మ్మ వ్యాఖ్యానించారు.

“ఎవ‌రెవ‌రి మ‌న‌సులో ఏముందో గ్ర‌హించ‌లేక‌పోయాం. కానీ, చాలా బాధేస్తుంది. మా ఇంట్లోనే మాకు శ‌త్రు వులు ఉన్నారంటే!” అని సౌభాగ్య‌మ్మ తెలిపారు. గ‌త 2019 మార్చి 15న వివేకానంద‌రెడ్డిని ఆయ‌న ఇంట్లోనే దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. దీనిని తొలుత గుండె పోటుగా ప్ర‌చారం చేశారు. త‌ర్వాత‌.. ఇది దారుణ హ‌త్య అని తెలిసింది. అంతేకాదు.. దీని వెనుక ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర‌రెడ్డిల పాత్ర ఉంద‌ని సీబీఐ అధికారులు కూడా తేల్చారు.

అంతేకాదు.. అనేక సంద‌ర్భాల్లో ఎంపీ అవినాష్‌ను విచారించారు. ఇక‌, ఆయ‌న బెయిల్ తెచ్చుకుని బ‌య‌ట తిరుగుతున్నారు. ఇదిలావుంటే, ఈ కేసులో స‌హ‌క‌రించాల‌ని వివేకా కుటుంబం.. సీఎం జ‌గ‌న్‌ను అభ్య‌ర్థించిన విష‌యం తెలిసిందే. సొంత చిన్నాన్న కావ‌డంతో ఆయ‌న స‌హ‌క‌రిస్తార‌ని ఆశ‌లు కూడా పెట్టుకుంది. కానీ, ఆయ‌న నిందితుల‌ను కాపాడుతున్నార‌నే వాద‌న వివేకా కుటుంబానికి చాలా లేటుగా తెలిసిన‌ట్టు ఇటీవ‌ల వివేకా కుమార్తె సునీత కూడా ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని జ‌గ‌న్ అన్న ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. ఈ కేసులో నిందితుడు ఫ‌లానా వ్య‌క్తి అని తెలిసి(ఎంపీ అవినాష్) కూడా జ‌గ‌న్ త‌ప్పించుకున్నార‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగాఅంద‌రూ క‌లిసి త‌న తండ్రిని దారుణంగా చంపేశార‌ని సునీత వ్యాఖ్యానించారు. దీనిపై ఆమె ప్ర‌స్తుతం న్యాయ‌పోరాటం చేస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లుగా మీడియా ముందుకు రాని సౌభాగ్య‌మ్మ‌.. వివేకా ఐదో వ‌ర్థంతి నేప‌థ్యంలో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇంట్లోనే త‌మ‌కు శ‌త్రువులు ఉన్నార‌ని ప‌రోక్షంగా పలువురిని ఉద్దేశించి వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

3 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

5 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

5 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

7 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

9 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

10 hours ago