Political News

తెలంగాణలో కాంగ్రెస్‌దే హ‌వా: స‌ర్వే

తెలంగాణలో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏక‌ప‌క్షంగా దూసుకుపోతుందా?  రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల ఎఫెక్ట్ జోరుగా ప‌నిచేయ‌నుందా? అంటే.. స‌ర్వే ఔన‌నే అంటోంది. తాజాగా వెల్ల‌డైన ఏపీబీ- సీ ఓట‌రు స‌ర్వే.. సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది. మొత్తం 17 పార్ల‌మెంటు స్థానాల్లో గుండుగుత్త‌గా 10 స్థానాల‌ను కాంగ్రెస్ బుట్టలో వేసుకుంటుంద‌ని స‌ర్వే తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే ఊపు కొనసాగించే అవకాశం ఉంద‌ని స‌ర్వే పేర్కొంది. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ  10 స్థానాలు గెలుచుకుంటుందని తాజాగా నిర్వహించిన ఏబీపీ – సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ లో వెల్లడైంది. బీజేపీకి కేవ‌లం 4 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 2, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది.

సీట్ల షేరింగ్ ఇదీ..
కాంగ్రెస్: 10, బీజేపీ:  4, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానం ద‌క్కించుకోనున్నారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ లేని విధంగా దూసుకుపోతుంద‌ని స‌ర్వే చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం సీఎం రేవంత్ రెడ్డి డైన‌మిక్ నిర్ణ‌యాలే కార‌ణమ‌ని పేర్కొన‌డం మ‌రో కీల‌క విష‌యం.  

ఇక  ఓటింగ్ విషయంలోనూ కాంగ్రెస్ జోరుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 42.9 శాతం ఓట్లు సాధించనుంది. బీజేపీ కన్నా బీఆర్ఎస్ కు ఎక్కువ ఓటింగ్ ఉంటుందని స‌ర్వే పేర్కొంది. 28.4 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ కు మొగ్గు చూపుతుండ‌గా, బీజేపీకి 25.11 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అయినా బీజేపీకి నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉంది.  

ఓట్ల షేరింగ్ ఇలా..
కాంగ్రెస్ 42.9%, బీజేపీ  25.1%, బీఆర్ఎస్  28.4% ఓట్ల షేరింగ్ ఉంటుంద‌ని స‌ర్వే తెలిపింది.

This post was last modified on March 15, 2024 10:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

35 minutes ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

53 minutes ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

3 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

3 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

4 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

4 hours ago