Political News

ఫిక్స్‌.. మ‌ల్లారెడ్డి కూడా జంపే!

పాల‌మ్మినా.. పూల‌మ్మినా.. అంటూ రాజ‌కీయాలు చేసే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయ‌న‌ అల్లుడు, మ‌ల్కాజిగిరి ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి జంప్ అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం వారు బీఆర్ఎస్‌లో ఉన్నారు. అయితే.. కొన్ని రోజుల కింద‌ట‌ భూమిని ఆక్రమించి రోడ్డు వేశారన్న కార‌ణంగా మ‌ల్లారెడ్డికి చెందిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. త‌ర్వాత ఆయన అల్లుడి కాలేజీకి చెందిన భవనాలను కూల్చేశారు. రాజ‌కీయంగా ఈ ప‌రిణామం చ‌ర్చ‌నీయాంశం అయింది.

హైదరాబాద్ శివారు దుండిగల్ లోని చిన్న దామర చెరువు ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో మ‌ర్రి రాజ‌శేఖ‌రరెడ్డి కి ఏరోనాటికల్, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలు ఉన్నాయి. వీటికి సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్లను అధికారులు కూల్చేశారు. మొత్తం 8.24 ఎకరాల చెరువును ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. కాగా, ఇదంతా రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని.. త‌ను కాంగ్రెస్‌లో చేరిపోతే.. ఇవ‌న్నీ ఆగిపోయాతా? అంటూ.. మ‌ల్లారెడ్డి అప్ప‌ట్లో ఫైర్ అయ్యారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మైపోయింది. వాస్త‌వానికి తాము కాంగ్రెస్ లోకి వెళ్లేది లేద‌ని మ‌ల్లారెడ్డి చెప్పారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. పార్టీలోనే ఉంటున్నట్టు సంకేతాలు పంపించారు. అయితే, అనూహ్యంగా మ‌ల్లారెడ్డి ఆయ‌న అల్లుడు యూట‌ర్న్ తీసుకున్నా రు. తాజాగా బెంగ‌ళూరులోని ఓ హోట్ లో క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీల‌క నాయ‌కుడు, క‌ర్ణాట‌క పార్టీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్‌తో వారు భేటీ అయ్యారు.

ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు కూడా డీకే శివ‌కుమార్‌తో మాట్లాడుతున్న‌ట్టు స్పష్టంగా క‌నిపిస్తోంది. దీనిని బ‌ట్టి వారు పార్టీ మారుతున్న‌ట్టుగా స్ప‌ష్టం గా తెలుస్తోంది. రాష్ట్రంలో వ్యాపారాలు విస్త‌రించి ఉండ‌డం.. మ‌రో ఐదేళ్ల‌పాటు వాటిని కాపాడుకునే ప‌రిస్థితి ఉండ‌డం.. రాజ‌కీయంగా ఎదురు దెబ్బ‌లు తిన‌లేని ప‌రిస్తితి నెల‌కొన‌డం కార‌ణంగా మ‌ల్లారెడ్డి మాన‌సికంగా రెడీ అయిపోయార‌నే వాద‌న వినిపిస్తోంది. తాజా ప‌రిణామాలు కూడా దానికి ఊత‌మిస్తున్నాయి ఈ నేప‌థ్యంలో డీకేతో భేటీ మ‌రింత‌గా ఈ వాద‌న‌ను స‌మ‌ర్థిస్తోంది. సో.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందే మ‌ల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

This post was last modified on March 14, 2024 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago