వైసీపీ కీలక నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అయితే, ఈయనకు మరలా క ర్నూలు ఎంపీ సీటునే ఇస్తారా? లేక వేరే ఏదైనా ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. వైసీపీలో 2019లో కర్నూలు నుంచివిజయం దక్కించుకున్న సంజీవ్కుమార్ సౌమ్యుడిగా ముద్రపడ్డారు. ఉన్నత విద్యావంతుడు, నిగర్వి కూడా కావడంతో ప్రజలకు ఆయనంటే అభిమానం మెండుగానే ఉంది.
అయితే, వివిద సర్వేల్లో సంజీవ్ కు వ్యతిరేకంగా ఫలితం వచ్చిందని భావించిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ లేదని తేల్చి చెప్పింది. దీంతో నెల రోజుల కిందటే ఆయన వైసీపీకి రాజీనామా సమర్పిం చారు. ఈ క్రమంలో టీడీపీ ఆయనకు టచ్లోకి వెళ్లింది. తాజాగా టీడీపీలో ఆయన చేరిపోయారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతు.. తనకు ఎలాంటి అవకాశం ఇచ్చినా పని చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు ఆదరించేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ఎక్కడా అభివృద్ధి లేదన్నారు. తాను ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడినా.. రాజకీయా లు నీకు తెలియవంటూ అవమానించారని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. మరి రాజకీయాలు తెలియని వాడిని ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చారో వారే సమాధానం చెప్పాలని అన్నారు. తన నియోజకవర్గానికి ఎంపీ లాడ్స్ కేటాయించి అభివృద్ధి పనులు చేసుకుంటే కూడా అడ్డు పడ్డారని తెలిపారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ సహకారం అవసరమని వ్యాఖ్యానించారు. వైసీపీ మాదిరిగా తాము లోపాయికారీ పొత్తులుతో ముందుకు సాగి.. ప్రజలను మోసం చేయడం లేదని.. నేరుగానే పొత్తులు పెట్టుకున్నామని చెప్పారు. ప్రజలు కూడా పొత్తులను స్వాగతిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామన్నారు.
This post was last modified on March 14, 2024 2:08 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…