Political News

టీడీపీలో చేరిన వైసీపీ బీసీ ఎంపీ!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన క‌ర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. అయితే, ఈయ‌న‌కు మ‌ర‌లా క ర్నూలు ఎంపీ సీటునే ఇస్తారా?  లేక వేరే ఏదైనా ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. వైసీపీలో 2019లో క‌ర్నూలు నుంచివిజ‌యం ద‌క్కించుకున్న సంజీవ్‌కుమార్ సౌమ్యుడిగా ముద్ర‌ప‌డ్డారు. ఉన్న‌త విద్యావంతుడు, నిగ‌ర్వి కూడా కావ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఆయ‌నంటే అభిమానం మెండుగానే ఉంది.

అయితే, వివిద స‌ర్వేల్లో సంజీవ్ కు వ్య‌తిరేకంగా ఫ‌లితం వ‌చ్చింద‌ని భావించిన వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ లేద‌ని తేల్చి చెప్పింది. దీంతో నెల రోజుల కింద‌టే ఆయ‌న వైసీపీకి రాజీనామా స‌మ‌ర్పిం చారు. ఈ క్ర‌మంలో టీడీపీ ఆయ‌న‌కు ట‌చ్‌లోకి వెళ్లింది. తాజాగా టీడీపీలో ఆయ‌న చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతు.. త‌న‌కు ఎలాంటి అవ‌కాశం ఇచ్చినా ప‌ని చేస్తాన‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిని ప్ర‌జ‌లు ఆద‌రించేందుకు రెడీగా ఉన్నార‌ని తెలిపారు. వైసీపీ పాల‌న‌లో ఎక్క‌డా అభివృద్ధి లేద‌న్నారు. తాను ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడినా.. రాజ‌కీయా లు నీకు తెలియ‌వంటూ అవ‌మానించార‌ని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. మ‌రి రాజ‌కీయాలు తెలియ‌ని వాడిని ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చారో వారే స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎంపీ లాడ్స్ కేటాయించి అభివృద్ధి ప‌నులు చేసుకుంటే కూడా అడ్డు ప‌డ్డార‌ని తెలిపారు.

చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మగౌర‌వం కోస‌మే పొత్తులు పెట్టుకున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. వైసీపీ మాదిరిగా తాము లోపాయికారీ పొత్తులుతో ముందుకు సాగి.. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం లేద‌ని.. నేరుగానే పొత్తులు పెట్టుకున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు కూడా పొత్తుల‌ను స్వాగ‌తిస్తున్నార‌ని చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఘ‌న విజ‌యం సాధిస్తామ‌న్నారు. 

This post was last modified on March 14, 2024 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…

1 hour ago

ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుక‌య్యా?

ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్న‌ట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్య‌వ‌హారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. కానీ త‌ర్వాతి…

2 hours ago

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…

2 hours ago

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

7 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

10 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

11 hours ago