Political News

టీడీపీలో చేరిన వైసీపీ బీసీ ఎంపీ!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన క‌ర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. అయితే, ఈయ‌న‌కు మ‌ర‌లా క ర్నూలు ఎంపీ సీటునే ఇస్తారా?  లేక వేరే ఏదైనా ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. వైసీపీలో 2019లో క‌ర్నూలు నుంచివిజ‌యం ద‌క్కించుకున్న సంజీవ్‌కుమార్ సౌమ్యుడిగా ముద్ర‌ప‌డ్డారు. ఉన్న‌త విద్యావంతుడు, నిగ‌ర్వి కూడా కావ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఆయ‌నంటే అభిమానం మెండుగానే ఉంది.

అయితే, వివిద స‌ర్వేల్లో సంజీవ్ కు వ్య‌తిరేకంగా ఫ‌లితం వ‌చ్చింద‌ని భావించిన వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ లేద‌ని తేల్చి చెప్పింది. దీంతో నెల రోజుల కింద‌టే ఆయ‌న వైసీపీకి రాజీనామా స‌మ‌ర్పిం చారు. ఈ క్ర‌మంలో టీడీపీ ఆయ‌న‌కు ట‌చ్‌లోకి వెళ్లింది. తాజాగా టీడీపీలో ఆయ‌న చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతు.. త‌న‌కు ఎలాంటి అవ‌కాశం ఇచ్చినా ప‌ని చేస్తాన‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిని ప్ర‌జ‌లు ఆద‌రించేందుకు రెడీగా ఉన్నార‌ని తెలిపారు. వైసీపీ పాల‌న‌లో ఎక్క‌డా అభివృద్ధి లేద‌న్నారు. తాను ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడినా.. రాజ‌కీయా లు నీకు తెలియ‌వంటూ అవ‌మానించార‌ని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. మ‌రి రాజ‌కీయాలు తెలియ‌ని వాడిని ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చారో వారే స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎంపీ లాడ్స్ కేటాయించి అభివృద్ధి ప‌నులు చేసుకుంటే కూడా అడ్డు ప‌డ్డార‌ని తెలిపారు.

చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మగౌర‌వం కోస‌మే పొత్తులు పెట్టుకున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. వైసీపీ మాదిరిగా తాము లోపాయికారీ పొత్తులుతో ముందుకు సాగి.. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం లేద‌ని.. నేరుగానే పొత్తులు పెట్టుకున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు కూడా పొత్తుల‌ను స్వాగ‌తిస్తున్నార‌ని చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఘ‌న విజ‌యం సాధిస్తామ‌న్నారు. 

This post was last modified on March 14, 2024 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

33 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

40 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago