Political News

కేసీఆర్‌కు గుత్తా గుడ్ బై.. త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో చేరిక‌!

కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత బీఆర్ ఎస్ నేత‌, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్ప‌డం దాదాపు ఖ‌రారైపోయింది. త్వ‌ర‌లోనే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో భువ‌నగిరి స్థానం నుంచి గుత్తా త‌న‌యుడు అమిత్ రెడ్డి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు కేటాయించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే న‌ల్ల‌గొండ టికెట్‌ను ఖ‌రారు చేసిన పార్టీ.. భువ‌నగిరి టికెట్‌ను పెండింగులో పెట్టింది. దీనిపైనే తాజాగా గుత్తా అమిత్ సీఎం రేవంత్ రెడ్డి స‌ల‌హాదారుతో భేటీఅ యి చ‌ర్చించారు.

దాదాపు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేయ‌డంతో గుత్తా తండ్రీత‌న‌యులు కేసీఆర్ కు గుడ్ బై చెప్పి.. రేవంత్ గూటికి చేర‌డం ఖాయ‌మైపోయింది. వాస్త‌వానికి సోమవారం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్లగొండ పార్లమెంటు స్థానం మీటింగ్ కు గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రాలేదు. అప్పుడే పార్టీలో వీరి గురించి లుక‌లుక‌లు వినిపించాయి. ఇక‌, మంగళవారం గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమవ‌డంతో ఇక‌, వీరి చేరిక లాంఛ‌న‌మేన‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.

నల్లగొండ టికెట్ ను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ జానారెడ్డి కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డికి ప్రకటించింది. భువనగిరి స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది. అమిత్ రెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా అమిత్‌కు ఈ టికెట్‌పై పార్టీ భ‌రోసా ఇచ్చిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు.. గుత్తాకు బీఆర్ఎస్ కూడా త‌క్కువేమీ చేయ‌లేదు. వారు కోరుకున్న చోట పోటీ చేయొచ్చ‌ని పేర్కొంది. నల్లగొండ లేదా భువనగిరి టిక్కెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనప్పటికీ… స్థానిక రాజకీయాల కారణంగా తండ్రీ త‌న‌యులు కాంగ్రెస్‌లోకి జంప్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో గుత్తాకు రాజ‌కీయ విభేదాలు ఉన్నాయి. త‌మ‌కు టిక్కెట్ ఇచ్చినా జగదీష్ రెడ్డి వర్గం సహకరించదన్న కారణంగా వారు బయటకు రావాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో ఓడిపోయినా.. ఇప్పటికీ తెలంగాణ శాసనమండలిలో… బీఆర్ఎస్ కే మెజార్టీ ఉంది. కీలకమైన బిల్లులు ఏమైనా మండలికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మండలి చైర్మన్ కూడా కాంగ్రెస్ వైపు మారిపోతే ఆ అడ్వాంటేజ్ లేకుండా పోతుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు పార్టీ మారకుండా ఉండేందుకు కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నా వారి నుంచి స్పంద‌న రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 13, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

2 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

2 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

3 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

3 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

4 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

5 hours ago