టీడీపీ-జనసేన-బీజేపీ మిత్ర పక్షం మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిఈ మూడు పార్టీలూ.. సుదీర్ఘంగా 8 గంటల పాటు చర్చించిన దరిమిలా.. అనేక మార్పులు, చేర్పుల అనంతరం సీట్ల పంపకాలపై ఒక నిర్ణయానికి వచ్చాయి. దీని ప్రకారం.. అసెంబ్లీలోని 175 స్థానాలకు గాను టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లోనూ పోటీ చేయనుంది. ఇక, పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఏపీలో 25 లోక్సబ సీట్లు ఉన్నాయి. వీటిలో టీడీపీ 17 చోట్ల పోటీ చేయనుండగా, బీజేపీ ఆరు స్థానాలు, జనసేన రెండు చోట్ల బరిలోకి దిగనున్నాయి.
సుదీర్ఘ కసరత్తు
కీలకమైన తొలి భేటీ మూడు పార్టీలకు అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మధ్యలో మూడు గంటల విరామంతో మొత్తం 8 గంటల పాటు చర్చలు జరిపారు. అనేక ఈక్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యలో కేంద్ర హోం మంత్రి అమిత్షా వర్చువల్గా ఈ చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం. దీంతో బీజేపీ ఒత్తిడి మేరకు టీడీపీ ఒక సీటు, జనసేన మూడు సీట్లు తగ్గించుకుని బీజేపీకి అసెంబ్లీ స్థానాల్లో మరో 4 సీట్లు ఇచ్చాయి. మొత్తంగా సీట్లపై చర్చ ముగిసింది. ఇక, మంగళవారం అభ్యర్థులపై భేటీ అయి తేల్చనున్నారు.
కూటమి సమావేశం ముగిసిన అనంతరం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండాలు నోవాటెల్ హోటల్ కు వెళ్లిపోయారు. భేటీలో పాల్గొన్న ఇతర టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు నివాసం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై మరికొంత సేపు చర్చించారు. మరోవైపు షేకావత్, పాండాలు బీజేపీ అధిష్టానానికి భేటీ సారాంశాన్ని వివరించారు. ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గైర్హాజరయ్యారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు.
This post was last modified on March 12, 2024 6:20 am
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…