Political News

టీడీపీ 144, జ‌న‌సేన 21, బీజేపీ 10

టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ మిత్ర ప‌క్షం మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు ఒక కొలిక్కి వ‌చ్చింది. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించిఈ మూడు పార్టీలూ.. సుదీర్ఘంగా 8 గంట‌ల పాటు చ‌ర్చించిన ద‌రిమిలా.. అనేక మార్పులు, చేర్పుల అనంత‌రం సీట్ల పంప‌కాల‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం.. అసెంబ్లీలోని 175 స్థానాల‌కు గాను టీడీపీ 144, జ‌న‌సేన 21, బీజేపీ 10 స్థానాల్లోనూ పోటీ చేయ‌నుంది. ఇక‌, పార్ల‌మెంటు స్థానాల‌కు సంబంధించి ఏపీలో 25 లోక్‌స‌బ సీట్లు ఉన్నాయి. వీటిలో టీడీపీ 17 చోట్ల పోటీ చేయ‌నుండ‌గా, బీజేపీ ఆరు స్థానాలు, జ‌న‌సేన రెండు చోట్ల బ‌రిలోకి దిగ‌నున్నాయి.

సుదీర్ఘ క‌స‌ర‌త్తు

కీలకమైన తొలి భేటీ మూడు పార్టీల‌కు అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు మ‌ధ్య‌లో మూడు గంట‌ల విరామంతో మొత్తం 8 గంటల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. అనేక ఈక్వేష‌న్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. మ‌ధ్య‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ‌ర్చువ‌ల్‌గా ఈ చ‌ర్చ‌ల్లో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. దీంతో బీజేపీ ఒత్తిడి మేర‌కు టీడీపీ ఒక‌ సీటు, జనసేన మూడు సీట్లు త‌గ్గించుకుని బీజేపీకి అసెంబ్లీ స్థానాల్లో మరో 4 సీట్లు ఇచ్చాయి. మొత్తంగా సీట్ల‌పై చ‌ర్చ ముగిసింది. ఇక‌, మంగళవారం అభ్యర్థులపై భేటీ అయి తేల్చ‌నున్నారు.

కూటమి సమావేశం ముగిసిన అనంతరం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పాండాలు నోవాటెల్ హోటల్ కు వెళ్లిపోయారు. భేటీలో పాల్గొన్న ఇతర టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు నివాసం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై మ‌రికొంత సేపు చర్చించారు. మరోవైపు షేకావత్, పాండాలు బీజేపీ అధిష్టానానికి భేటీ సారాంశాన్ని వివరించారు. ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గైర్హాజరయ్యారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

This post was last modified on March 12, 2024 6:20 am

Share
Show comments

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

1 hour ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago