అనుకున్నంతా అయ్యింది. తెలంగాణాలోని కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను నాలుగు నెలల పాటు షట్ డౌన్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్లో రిపేర్లు చేయాల్సి రావటమే. ఈ మూడు ప్రాజెక్టులు ఉపయోగంలో లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదనే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు నింపాలంటే ముందు పై మూడు ప్రాజెక్టుల్లో నీటి నిల్వ చేయాలి. ఇపుడు ఈ ప్రాజెక్టులకు జరిగిన డ్యామేజీ ప్రకారం చూస్తే నీటి నిల్వ సాధ్యం కాదు.
అందుకనే దాదాపు రెండు నెలల క్రితం మేడిగడ్డలో, ఈ మధ్యలోనే అన్నారం, సుందిళ్ళలో నీటిని బయటకు పంపేశారు. విషయం ఏమిటంటే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కొన్ని కుంగిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా బ్యారేజి గోడలు కూడా అక్కడక్కడ బీటలొచ్చేశాయి. దాంతో ఈ బ్యారేజిలో నీటిని నిల్వ ఉంచేందుకు లేదని నిపుణులు చెప్పారు. దాంతో బ్యారేజిలోని నీటినంతా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు బయటకు పంపేశారు. అలాగే అన్నారం ప్రాజెక్టు గేట్లు పగిలిపోయాయి. ఈ పగుళ్ళలోనుండి నీరుంతా బటయకు లీకైపోతోంది. లీకులు మరీ ఎక్కువైతే గేట్లు తర్వాత డ్యామ్ ప్రమాదంలో పడుతుంది.
అందుకనే గేట్లెత్తేసి ఇందులోని నీటిని బయటకు వదిలేశారు అధికారులు. సుందిళ్ళ ప్రాజెక్టు సమస్య కూడా దాదాపు ఇలాంటిదే. ఈ మూడు ప్రాజెక్టులను రిపేర్లుచేస్తే కాని నిటినిల్వ సాధ్యంకాదు. ప్రాధమికంగా ప్రాజెక్టులను పరిశీలించిన నిపుణులు ఈ ప్రాజెక్టులు పనికిరావని తేల్చేశారు. అందుకనే క్రాస్ చెక్ చేయటంకోసం కేంద్రప్రభుత్వంలోని జలవనరుల మంత్రిత్వశాఖ నిపుణులను రమ్మని ప్రభుత్వం ఆహ్వానించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి (ఎన్డీఎస్ఏ) నుండి ఆరుగురు సభ్యుల నిపుణుల బృందం అద్యయనం కోసం వస్తున్నది.
ఈ బృందం వచ్చి అధ్యయనంచేసి ఏదో ఒక నిర్ణయం చెప్పేంతవరకు నీటిని నిల్వ చేయద్దని జలవనరుల శాఖ ఉన్నతాదికారులు రాష్ట్రప్రభుత్వానికి చెప్పారు. అంటే బృందం పరిశీలన, మరమ్మత్తుల విషయంపై నిర్ణయం తీసుకోవటం లాంటివి జరగాలంటే కనీసం నాలుగు నెలలు పడుతుందని అంచనా వేశారు. అందుకనే పై ప్రాజెక్టులను నాలుగు నెలలపాటు మూసేయాలని ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఉన్నతాదికారులను ఆదేశించింది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 5, 2024 9:48 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…