బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నేతలతో జరిగిన సమీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉంది. నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందన్నారు. అలాగే బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఎంఎల్ఏలు, ఎంఎల్ఏ అభ్యర్ధులపై జనాల్లో ఇంకా వ్యతిరేకత పోలేదని కేసీఆర్ చెప్పారు. పనిలోపనిగా కీలకమైన వ్యాఖ్య ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని తనకు తెలుసన్నారు. పార్టీ ఓటమి ఖాయమని 15 రోజుల ముందే తనకు సమాచారం ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఖాయమని ముందే తెలిసినపుడు అభ్యర్ధులతో అంతంత ఖర్చులు ఎందుకు పెట్టించారనే ప్రశ్న ఇపుడు నేతల మధ్య చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు అభ్యర్ధులు కోట్లాది రూపాయలు ఖర్చులు చేసుకున్నారు. డబ్బుకు డబ్బూ పోయింది, వ్యక్తిగతంగా ఓడక తప్పలేదు. ఇదే సమయంలో పార్టీ కూడా ఓడిపోయింది. దాంతో పెట్టిన ఖర్చంతా బూడిదలోపోసిన పన్నీరుగా అయిపోయిందని అభ్యర్ధులు లబోదిబో మంటున్నారు. అయితే అడ్డదిడ్డంగా సంపాదించిందే కదా మొన్నటి ఎన్నికల్లో కొందరు ఖర్చుచేసిందనే సెటైర్లు కూడా పార్టీలోనే వినబడుతున్నాయి.
జనాలంతా ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోయి కేసీఆర్ మాత్రమే గెలవాలని కోరుకున్నారట. అయితే ఆ కోరిక మొదటికే మోసం తెచ్చిందని ఇపుడు కేసీయార్ అనటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంఎల్ఏలందరు ఓడిపోతే ఇక కేసీయార్ అధికారంలోకి ఎలా వస్తారు ? ఇంతచిన్న లాజిక్ జనాలకు తెలీకుండానే ఉంటుందా ? ఇక్కడ విషయం ఏమిటంటే కేసీయార్ పరిపాలన అవసరం లేదని అనుకున్నారు కాబట్టే బీఆర్ఎస్ ను జనాలు ఓడగొట్టారంతే. ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోవాలి, కేసీయార్ మాత్రమే గెలవాలని జనాలు నిజంగానే అనుకుంటే మరి కామారెడ్డిలో స్వయంగా కేసీయారే ఎందుకు ఓడిపోయారు ?
ఇక్కడ విషయం ఏమిటంటే జనాలు మార్పును కోరుకున్నారు కాంగ్రెస్ ను గెలిపించారంతే. ఈ విషయాన్ని అంగీకరించటానికి కేసీయార్ సిద్ధంగాలేరు. లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందని అనటంలో అర్ధమేంటి ? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును తక్కువగా చూడటమే కదా. కాంగ్రెస్ పుంజుకుందన్న విషయాన్ని కేసీయార్ అంగీకరించలేకపోతున్నారు. అందుకనే ఇప్పటికీ కాంగ్రెస్ ను చాలా చులకనగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లో ఓడిన ఎంఎల్ఏల మీద జనాల్లో వ్యతిరేకత తగ్గలేదంటే ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎలా గెలుస్తారు ?
This post was last modified on March 4, 2024 2:59 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…