బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నేతలతో జరిగిన సమీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉంది. నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందన్నారు. అలాగే బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఎంఎల్ఏలు, ఎంఎల్ఏ అభ్యర్ధులపై జనాల్లో ఇంకా వ్యతిరేకత పోలేదని కేసీఆర్ చెప్పారు. పనిలోపనిగా కీలకమైన వ్యాఖ్య ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని తనకు తెలుసన్నారు. పార్టీ ఓటమి ఖాయమని 15 రోజుల ముందే తనకు సమాచారం ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఖాయమని ముందే తెలిసినపుడు అభ్యర్ధులతో అంతంత ఖర్చులు ఎందుకు పెట్టించారనే ప్రశ్న ఇపుడు నేతల మధ్య చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు అభ్యర్ధులు కోట్లాది రూపాయలు ఖర్చులు చేసుకున్నారు. డబ్బుకు డబ్బూ పోయింది, వ్యక్తిగతంగా ఓడక తప్పలేదు. ఇదే సమయంలో పార్టీ కూడా ఓడిపోయింది. దాంతో పెట్టిన ఖర్చంతా బూడిదలోపోసిన పన్నీరుగా అయిపోయిందని అభ్యర్ధులు లబోదిబో మంటున్నారు. అయితే అడ్డదిడ్డంగా సంపాదించిందే కదా మొన్నటి ఎన్నికల్లో కొందరు ఖర్చుచేసిందనే సెటైర్లు కూడా పార్టీలోనే వినబడుతున్నాయి.
జనాలంతా ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోయి కేసీఆర్ మాత్రమే గెలవాలని కోరుకున్నారట. అయితే ఆ కోరిక మొదటికే మోసం తెచ్చిందని ఇపుడు కేసీయార్ అనటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంఎల్ఏలందరు ఓడిపోతే ఇక కేసీయార్ అధికారంలోకి ఎలా వస్తారు ? ఇంతచిన్న లాజిక్ జనాలకు తెలీకుండానే ఉంటుందా ? ఇక్కడ విషయం ఏమిటంటే కేసీయార్ పరిపాలన అవసరం లేదని అనుకున్నారు కాబట్టే బీఆర్ఎస్ ను జనాలు ఓడగొట్టారంతే. ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోవాలి, కేసీయార్ మాత్రమే గెలవాలని జనాలు నిజంగానే అనుకుంటే మరి కామారెడ్డిలో స్వయంగా కేసీయారే ఎందుకు ఓడిపోయారు ?
ఇక్కడ విషయం ఏమిటంటే జనాలు మార్పును కోరుకున్నారు కాంగ్రెస్ ను గెలిపించారంతే. ఈ విషయాన్ని అంగీకరించటానికి కేసీయార్ సిద్ధంగాలేరు. లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందని అనటంలో అర్ధమేంటి ? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును తక్కువగా చూడటమే కదా. కాంగ్రెస్ పుంజుకుందన్న విషయాన్ని కేసీయార్ అంగీకరించలేకపోతున్నారు. అందుకనే ఇప్పటికీ కాంగ్రెస్ ను చాలా చులకనగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లో ఓడిన ఎంఎల్ఏల మీద జనాల్లో వ్యతిరేకత తగ్గలేదంటే ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎలా గెలుస్తారు ?
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…