Political News

పార్టీ అభ్యర్ధులను కేసీయారే మోసంచేశారా ?

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నేతలతో జరిగిన సమీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉంది. నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందన్నారు. అలాగే బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఎంఎల్ఏలు, ఎంఎల్ఏ అభ్యర్ధులపై జనాల్లో ఇంకా వ్యతిరేకత పోలేదని కేసీఆర్ చెప్పారు. పనిలోపనిగా కీలకమైన వ్యాఖ్య ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని తనకు తెలుసన్నారు. పార్టీ ఓటమి ఖాయమని 15 రోజుల ముందే తనకు సమాచారం ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఖాయమని ముందే తెలిసినపుడు అభ్యర్ధులతో అంతంత ఖర్చులు ఎందుకు పెట్టించారనే ప్రశ్న ఇపుడు నేతల మధ్య చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు అభ్యర్ధులు కోట్లాది రూపాయలు ఖర్చులు చేసుకున్నారు. డబ్బుకు డబ్బూ పోయింది, వ్యక్తిగతంగా ఓడక తప్పలేదు. ఇదే సమయంలో పార్టీ కూడా ఓడిపోయింది. దాంతో పెట్టిన ఖర్చంతా బూడిదలోపోసిన పన్నీరుగా అయిపోయిందని అభ్యర్ధులు లబోదిబో మంటున్నారు. అయితే అడ్డదిడ్డంగా సంపాదించిందే కదా మొన్నటి ఎన్నికల్లో కొందరు ఖర్చుచేసిందనే సెటైర్లు కూడా పార్టీలోనే వినబడుతున్నాయి.

జనాలంతా ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోయి కేసీఆర్ మాత్రమే గెలవాలని కోరుకున్నారట. అయితే ఆ కోరిక మొదటికే మోసం తెచ్చిందని ఇపుడు కేసీయార్ అనటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంఎల్ఏలందరు ఓడిపోతే ఇక కేసీయార్ అధికారంలోకి ఎలా వస్తారు ? ఇంతచిన్న లాజిక్ జనాలకు తెలీకుండానే ఉంటుందా ? ఇక్కడ విషయం ఏమిటంటే కేసీయార్ పరిపాలన అవసరం లేదని అనుకున్నారు కాబట్టే బీఆర్ఎస్ ను జనాలు ఓడగొట్టారంతే. ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోవాలి, కేసీయార్ మాత్రమే గెలవాలని జనాలు నిజంగానే అనుకుంటే మరి కామారెడ్డిలో స్వయంగా కేసీయారే ఎందుకు ఓడిపోయారు ?

ఇక్కడ విషయం ఏమిటంటే జనాలు మార్పును కోరుకున్నారు కాంగ్రెస్ ను గెలిపించారంతే. ఈ విషయాన్ని అంగీకరించటానికి కేసీయార్ సిద్ధంగాలేరు. లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందని అనటంలో అర్ధమేంటి ? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును తక్కువగా చూడటమే కదా. కాంగ్రెస్ పుంజుకుందన్న విషయాన్ని కేసీయార్ అంగీకరించలేకపోతున్నారు. అందుకనే ఇప్పటికీ కాంగ్రెస్ ను చాలా చులకనగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లో ఓడిన ఎంఎల్ఏల మీద జనాల్లో వ్యతిరేకత తగ్గలేదంటే ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎలా గెలుస్తారు ?

This post was last modified on March 4, 2024 2:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

4 hours ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

5 hours ago

కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన

అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…

6 hours ago

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…

9 hours ago

‘ఒరేయ్ తరుణ్ భాస్కర్… క్యారెక్టర్లో ఉండిపోకు’

దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…

9 hours ago

‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?

రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

10 hours ago