Political News

పార్టీ అభ్యర్ధులను కేసీయారే మోసంచేశారా ?

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నేతలతో జరిగిన సమీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉంది. నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందన్నారు. అలాగే బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఎంఎల్ఏలు, ఎంఎల్ఏ అభ్యర్ధులపై జనాల్లో ఇంకా వ్యతిరేకత పోలేదని కేసీఆర్ చెప్పారు. పనిలోపనిగా కీలకమైన వ్యాఖ్య ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని తనకు తెలుసన్నారు. పార్టీ ఓటమి ఖాయమని 15 రోజుల ముందే తనకు సమాచారం ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి ఖాయమని ముందే తెలిసినపుడు అభ్యర్ధులతో అంతంత ఖర్చులు ఎందుకు పెట్టించారనే ప్రశ్న ఇపుడు నేతల మధ్య చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు అభ్యర్ధులు కోట్లాది రూపాయలు ఖర్చులు చేసుకున్నారు. డబ్బుకు డబ్బూ పోయింది, వ్యక్తిగతంగా ఓడక తప్పలేదు. ఇదే సమయంలో పార్టీ కూడా ఓడిపోయింది. దాంతో పెట్టిన ఖర్చంతా బూడిదలోపోసిన పన్నీరుగా అయిపోయిందని అభ్యర్ధులు లబోదిబో మంటున్నారు. అయితే అడ్డదిడ్డంగా సంపాదించిందే కదా మొన్నటి ఎన్నికల్లో కొందరు ఖర్చుచేసిందనే సెటైర్లు కూడా పార్టీలోనే వినబడుతున్నాయి.

జనాలంతా ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోయి కేసీఆర్ మాత్రమే గెలవాలని కోరుకున్నారట. అయితే ఆ కోరిక మొదటికే మోసం తెచ్చిందని ఇపుడు కేసీయార్ అనటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంఎల్ఏలందరు ఓడిపోతే ఇక కేసీయార్ అధికారంలోకి ఎలా వస్తారు ? ఇంతచిన్న లాజిక్ జనాలకు తెలీకుండానే ఉంటుందా ? ఇక్కడ విషయం ఏమిటంటే కేసీయార్ పరిపాలన అవసరం లేదని అనుకున్నారు కాబట్టే బీఆర్ఎస్ ను జనాలు ఓడగొట్టారంతే. ఎంఎల్ఏలు మాత్రం ఓడిపోవాలి, కేసీయార్ మాత్రమే గెలవాలని జనాలు నిజంగానే అనుకుంటే మరి కామారెడ్డిలో స్వయంగా కేసీయారే ఎందుకు ఓడిపోయారు ?

ఇక్కడ విషయం ఏమిటంటే జనాలు మార్పును కోరుకున్నారు కాంగ్రెస్ ను గెలిపించారంతే. ఈ విషయాన్ని అంగీకరించటానికి కేసీయార్ సిద్ధంగాలేరు. లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉంటుందని అనటంలో అర్ధమేంటి ? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును తక్కువగా చూడటమే కదా. కాంగ్రెస్ పుంజుకుందన్న విషయాన్ని కేసీయార్ అంగీకరించలేకపోతున్నారు. అందుకనే ఇప్పటికీ కాంగ్రెస్ ను చాలా చులకనగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ లో ఓడిన ఎంఎల్ఏల మీద జనాల్లో వ్యతిరేకత తగ్గలేదంటే ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎలా గెలుస్తారు ?

Satya

Recent Posts

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

29 minutes ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

38 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

11 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

14 hours ago