Political News

పేర్నివారి పురాణాలు.. ప‌వ‌న్ గురించి ఏమ‌న్నారంటే..

వైసీపీ కీల‌క నేత‌, కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. తాజాగా ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌న‌సేన అధినేత బుధ‌వారం నిర్వ‌హించిన జెండా స‌భ‌లో చేసిన కామెంట్ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన‌.. నాని.. పురాణాల‌తో ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్ శ‌ల్యుడు, శిఖండి అని వ్యాఖ్యానించారు. “చంద్ర‌బాబుకు స‌రైన జోడీ దొరికింది. శ‌ల్య సార‌థ్యంలో ఆయ‌న ముందుకు సాగుతున్నాడు. త‌మ్ముళ్లే ఇక‌, తేల్చుకోవాలి” అని నాని అన్నారు.

అంతేకాదు.. ప్ర‌జల క్షేమం, రాష్ట్ర సంక్షేమం గురించి జెండా స‌భ‌లో ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని నాని వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేద‌న్నారు. “పవన్‌ సినిమా డైలాగ్‌లు బట్టీ కొట్టారు. సినిమా వాళ్లు రాసిచ్చిన ‍స్క్రిప్ట్‌ను పవన్‌ చదివారు. నాడు అమరావతి.. ఒక కులానికే రాజధాని అని పవన్ అన‌లేదా? ” అని నాని ప్ర‌శ్నించారు. సీట్ల విష‌యంలో ప‌వ‌న్ గురించి జ‌గ‌న్ ఒక్క మాట కూడా అన‌లేద‌ని.. త‌మ వంటి కాపు నాయ‌కులు మాత్ర‌మే వ్యాఖ్యానించార‌ని పేర్ని చెప్పారు.

ప‌వ‌న్ త‌న‌కు న‌చ్చిన‌ట్టు సీట్లు తీసుకున్నా.. వైసీపీకి ఎలాంటి బాధా లేద‌న్నారు. “24 – 4 – 2 – 0” నువ్వు న‌చ్చిన‌ట్టు తీసుకో.. నీకు మిగిలేది చివ‌రికి సున్నానే.. అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ పవన్ ఉద్ధ‌రించింది ఏమీ లేద‌న్న నాని.. కేవ‌లం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేసేందుకు మాత్ర‌మే ఒక పార్టీ పెట్టుకున్నాడ‌ని అన్నారు. “నీ చేష్టల వల్ల పవన్‌కు ఓటేద్దామనుకున్న కాపులు బాధపడతారు” అని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌ గురించి టన్నుల టన్నుల సమాచారం ఉందంటున్న పవన్‌ ఎందుకు బయట పెట్టలేకపో తున్నారని విమ‌ర్శించారు. “పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడు, శిఖండి పాత్ర‌లే మిగిలి ఉన్నాయి. ఆయ‌న వామనుడు కాదు శల్యుడు, శిఖండి వంటి నాయ‌కుడు” అని వ్యాఖ్యానించారు. శ‌ల్య సార‌థ్యంలో మ‌హాభార‌తం ఎలా జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందేన‌ని.. ఇప్పుడు ప‌వ‌న్ సార‌థ్యంలో జ‌న‌సేన ప‌రిస్థితి కూడా ఇలానే ఉంటుందని పేర్ని అన్నారు.

This post was last modified on February 29, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago