Political News

జనాలను నగదుతో టార్గెట్ చేస్తోన్న జగన్

ఏపీలో ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తోన్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం జగన్ కృత నిశ్చయంతో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగానే ఆగస్టు 12న ఏపీలో 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75,000 నగదు అందించే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న మహిళల ఖాతాల్లో నేరుగా నగదు జమ అయింది. ఈ క్రమంలోనే బుడగ జంగం, వాల్మీకి, ఈనేటికోండ్, బెంటో ఒరియా కులాలకు ఈ పథకం అందించాలని సీఎం జగన్ తాజాగా అధికారులను ఆదేశించారు. ఆయా కులాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, కుల ధ్రువీకరణ పత్రం లేకపోయినా జాబితాలో చేర్చాలని ఆదేశించారు. ఆయా కులాలవారు కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నాలుగు కులాలకు చెందిన వారికి సెల్ఫ్ సర్టిఫికేషన్ మీద పథకాన్ని అమలుచేయనున్నారు.

సీఎం జగన్ అమలు చేస్తోన్న పథకాల్లో మెజారిటీ పథకాలు నగదు బదిలీ వంటివే. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడేలా జగన్ పథకాలు ఉన్నాయి. తన ప్రభుత్వం ద్వారా వేరే రూపాల్లో లబ్ధి పొందడం కంటే నగదు రూపంలో లబ్ధి పొందితేనే ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అవుతారన్నది జగన్ ఆలోచన కావచ్చు.

అందుకే, దాదాపుగా కుటుంబంలో అర్హులైన వారుంటే….ఏపీ ప్రభుత్వం అందించే ఏదో ఒక పథకం ద్వారా వారికి నగదు బదిలీ అవుతోంది. అంటే, ఏపీలో 60 శాతానికి పైగా ప్రజలు ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నమాట. అందుకే, జగన్ చేసే ప్రతి ప్రకటన…ప్రతి పథకం డబ్బుతో ముడిపడి ఉంటోందన్న విమర్శలు వస్తున్నాయి.

జగన్ మెజారిటీ ప్రకటనలు ఈ తరహాలోనే ఉంటున్నాయని, వేరే విషయాల ఊసే ఎత్తడం లేదని, ఈ ఉచిత పథకాలు, నగదు జమల వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

ఉచిత పథకాలు, నగదు జమల వల్ల చాలామంది ప్రజలు సోమరిపోతులై పోతున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా, తనకు క్రెడిట్ రావడం కోసం క్రెడిట్(అప్పు) తీసుకుంటున్నారని, డబ్బుతో అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని జగన్ అనుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఈ పథకాల కోసం ఏపీని అప్పులు ఊబిలోకి జగన్ నెడుతున్నారని, రేపు రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఈ భారం పడుతుందని కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on September 10, 2020 12:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

6 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

6 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

7 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

7 hours ago