టీడీపీ-జనసేన టికెట్ల పంపకాల వ్యవహారం అగ్గిని రాజేస్తోంది. 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 118 స్థానాలతో కూడిన తొలి జాబితాను మాత్రమే టీడీపీ-జనసేనలు జారీ చేశాయి. వీటిలో టికెట్ దక్కని వారు ఒకవైపు నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు.. రోడ్డెక్కి నిరసనలు కూడా చేస్తున్నారు. అయితే.. మరో 57 నియోజక వర్గాలకు అసలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో దాదాపు అన్నీ కాంప్లికేటెడ్ నియోజకవర్గాలే కావడం గమనార్హం.
ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గం కాక రేపుతోంది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు.. మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు బోడే ప్రసాద్ ఉన్నారు. అయితే.. ఈ సీటు విషయంలో టీడీపీ తర్జన భర్జన పడుతోంది. మైలవరం నుంచి వచ్చే వైసీపీ నాయకుడిపై ఆశలు పెట్టుకున్న పార్టీ.. సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదేసమయంలో సినీ రంగానికి చెందిన అగ్ర కధానాయకుడి కుటుంబానికి ఈ సీటు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పెనమలూరు వ్యవహారం.. రసకందాయంలో పడింది. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారు? అనేది చర్చగా మారింది. పార్టీ కూడా దీనిపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ తనకే వస్తుందని.. దీనిలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. నాలుగున్నరేళ్లుగా పార్టీ అభివృద్ధికి పనిచేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో టికెట్ తనకే వస్తుందన్న ధీమా ఉందన్నారు.
అయితే.. వేరేవారికి టికెట్ ఇస్తున్నారన్న వార్తలువస్తున్న నేపథ్యంలో బోడే స్పందిస్తూ.. ఇలాంటిది జరగదని చెప్పారు. ఎవరికీ తనను కాదని టికెట్ ఇవ్వబోరని అన్నారు. ఒకవేళ అదే జరిగితే.. తాను చేతులు ముడుచుకుని కూర్చోనని చెప్పుకొచ్చారు. అంటే.. తాను కూడా రెబల్ గా మారే అవకాశం ఉందన్న వాదనను ఆయన గట్టిగా ప్రకటించినట్టు అయింది. మరి ఈ విషయంలో టీడీపీ ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on February 26, 2024 6:26 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…