తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు జాబితాలు ప్రకటించారు. జనసేనకు 24 స్తానాలు అసెంబ్లీ, టీడీపీ 94 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక, పార్లమెంటు స్థానాలకు వచ్చే సరికి జనసేనకు 3 స్థానాలు కేటాయించారు. ఇక, టీడీపీకి ఎన్ని అనేది గోప్యంగా ఉంచారు. అయితే.. ఇప్పటి వరకు ప్రకటించిన దానిని బట్టి అసెంబ్లీకి ఉన్న మొత్తం 175 స్థానాల్లో 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
అయితే.. వీటిలో టీడీపీ ఒక్కపార్టీని తీసుకుంటే.. మెజారిటీ స్థానాలు గత ఎన్నికల్లోను.. ఇంతకు ముందు ఓడిపోయిన అభ్యర్థులకే కేటాయించారు. కేవలం 5 నుంచి 6 స్థానాలలో మాత్రమే కొత్తవారికి అవకాశం ఇచ్చారు. తుని(యనమల దివ్య), కళ్యాణదుర్గం(అమలినేని సురేంద్రబాబు), చింతలపూడి(ఎస్సీ-సొంత రోషన్ బాబు), కడప(మాధవి), పులివెందుల(బీటెక్ రవి), తిరువూరు(కొలికపూడి శ్రీనివాసరావు)లు మాత్రమే కొత్తవారు. మిగిలిన వారంతా గత ఎన్నికల్లోనో.. ఇంతకు ముందో ఓడిన వారు కావడం గమనార్హం.
అయితే.. ఇలా పాతముఖాలకు చోటు ఇవ్వడం వెనుక మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. వారికి గతంలో ఓడిపోయారన్న సింపతి ఉండడం. ఇది పార్టీని గెలిపిస్తుందని చంద్రబాబు విశ్వసిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండోది.. ఆర్థికంగా, కేడర్ పరంగా వారికి మంచి మార్కులు ఉండడం.. మూడు క్షేత్రస్థాయిలో జనసేనతో కలిసి పనిచేస్తున్న తీరు. ఈ మూడు అంశాలను ప్రామాణింకంగా తీసుకుని చంద్రబాబు ప్రయోగానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే.. అసమ్మతి ప్రభావాన్ని వీరు తట్టుకుని నిలబడగలిగితే.. బాగానే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…