కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్ రేంజ్ మూవీతో ఈ సంస్థ మొదలైంది. ఆ తర్వాత ‘బై టు లవ్’ అనే మరో చిన్న చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇలా మామూలుగా ప్రయాణం మొదలుపెట్టిన సంస్థ ఉన్నట్లుండి భారీ చిత్రాల వైపు మళ్లింది. తమిళంలో నంబర్ వన్ హీరోగా ఉన్న విజయ్తో అతడి చివరి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసే అరుదైన అవకాశాన్ని ఈ సంస్థ దక్కించుకుంది. ఆ చిత్రమే.. జననాయగన్.
మరోవైపు ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలతో తిరుగులేని స్థాయికి ఎదిగిన యశ్ తర్వాతి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశమూ ఈ సంస్థకే లభించింది. అంతే కాక ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి రీజనల్ బ్లాక్బస్టర్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమా సైతం కేవీఎన్ సంస్థలోనే కావడంతో దీని అధినేత నారాయణ చాలా లక్కీ అని అంతా అనుకున్నారు. 2026లో ఈ సంస్థ పేరు మార్మోగిపోతుందనే చర్చ కూడా జరిగింది. సంక్రాంతికి ‘జననాయగన్’ రిలీజ్తో కేవీఎన్ హవా మొదలవుతుందని అంతా అనుకున్నారు.
కానీ ‘జననాయగన్’ సెన్సార్ చిక్కుల్లో పడి ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. అసలెప్పుడు రిలీజవుతుందో తెలియట్లేదు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలతో పాటు ఓటీటీ డీల్ సైతం రద్దయింది. వాయిదా వల్ల నారాయణ భారీగా నష్టపోతున్నారు. భారీ లాభాలు తెచ్చిపెడుతుందనుకున్న సినిమా కాస్తా.. నారాయణకు చేదు అనుభవం మిగిల్చేలా ఉంది.
మరోవైపు గల్ఫ్ వార్ పుణ్యమా అని.. ‘టాక్సిక్’ సినిమాను మార్చి 19 నుంచి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అసలు కారణాలు వేరే అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రకటించినట్లు జూన్లో అయినా సినిమా రిలీజవుతుందో లేదో తెలియట్లేదు. ఇక చిరు, బాబీ సినిమా కూడా అనుకున్న సమయానికి మొదలు కావట్లేదు. దాని మీద కూడా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.
ఈ తలనొప్పులు చాలవన్నట్లు.. ఇప్పుడు కేవీఎన్ వారి మరో చిత్రం ‘కేడీ’ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఐటెం సాంగ్లో లిరిక్స్ తీవ్ర దుమారం రేపాయి. సినిమా మీద చాలా నెగెటివిటీని తెచ్చిపెట్టిందా సాంగ్. దీంతో ఆ పాటనే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తంగా 2026 కేవీఎన్ సంస్థకు అద్భుతంగా ఉంటుందని ఆశిస్తే.. ఆ బేనర్లో ప్రతి సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ చేదు అనుభవాలనే మిగులుస్తాయి. ఈ కష్టాలకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.
This post was last modified on March 18, 2026 2:38 pm
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…
రెమ్యునేషన్లు పూర్తిగా చేతికి అందకుంటే డబ్బింగ్ చెప్పకుండా ఇబ్బంది పెట్టే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. అందుకే బిజినెస్ జరిగినా…