Political News

పవన్ తో పొత్తు..జగన్ పై ఒక‌చేయి, చంద్రబాబుపై మరో చేయి!

రీజనల్ పార్టీలను అడ్డం పెట్టుకుని ఏపీలో పాగా వేయాలని బీజేపీ చూస్తోందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. పవన్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ… జగన్ పై ఒక‌చేయి, చంద్రబాబు పై మరో చేయి వేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంతో బీజేపీ మూడు ముక్కులాట ఆడుతోందని విమర్శించారు. బాబు, జగన్, పవన్ లకు ఓటు వేస్తే మోడీకి వేసినట్లేనని అన్నారు. ఈ నెల 26న ఖర్గే, మాణిక్ ఠాకూర్, షర్మిల అనంతపురం సభలో పాల్గొంటారని, ఆ తర్వాత పొత్తుల అంశంపై ఒక స్పష్టత వస్తుందని చెప్పారు.

చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే రిటర్నింగ్ అధికారి 8 బ్యాలెట్ పేపర్లను చెల్లవని ప్రకటించారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓట్ల రీకౌంటింగ్ కు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై కూడా రుద్రరాజు స్పందించారు. ఆ తీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తోందని, పదేళ్లుగా ఈడీ వంటి సంస్థలను మోడీ తన గుప్పిట్లో పెట్టుకుని నిర్వీర్యం చేశారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు.

బీజేపీ జాతీయ స్థాయి సమావేశాల్లో రాముడు, మోడీ నామస్మరణ మాత్రమే చేశారని, రాముడితో మోడీ, అమిత్ షా, ఇతర నేతలకు ఎక్కడైనా పోలిక ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో పాటు, అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బీజేపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టి‌ ప్రభుత్వాలను కూలగొట్టడం, లేదంటే సిబిఐ, ఈడీ వంటి వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం చేస్తున్నారని ఆరోపించారు.

This post was last modified on February 21, 2024 5:22 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

20 seconds ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

29 mins ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

43 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

45 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago